ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొంటాం !
గుంటూరు కరోనా కేసులు జిల్లాలో రోజురోజుకు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు 1000కిపైగా కేసులు నమోదవుతున్నాయి. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్నా, చాలామంది ఇంట్లోనే వైద్యం పొందుతూ స్వస్థత పొందుతున్నారు. జిల్లాలో పెద్దసంఖ్యలో ఉద్యోగులు కరోనా బారినపడ్డారు. కరోనా వల్ల
కేసులు పెరగడంతోపాటు ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవసరాలకు సరిపడా పడకలు అందుబాటులో ఉన్నాయా?
జిల్లాలో 87 ఆసుపత్రుల్లో కరోనా బాధితులకు వైద్యం అందించడానికి గుర్తించాం. ఇందులో 6500 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆక్సిజన్తో కూడిన పడకలు 3510, ఐసీయూ 1104, సాధారణ పడకలు 1882, వెంటిలేటర్తో కూడిన పడకలు 298 ఉన్నాయి. నియోజకవర్గంలో ప్రతిచోట తొలుత 20 పడకలతో ప్రారంభించి అవసరాలకు అనుగుణంగా పెంచుతాం. ప్రభుత్వ భవనాలతోపాటు ప్రైవేటు భవనాలను గుర్తించాం. మూడు కేంద్రాల్లో ఎక్స్రే, రక్త పరీక్షలు చేయడానికి ఏర్పాట్లున్నాయి. ప్రస్తుతం 700 పడకలు సిద్ధం చేశాం. కొవిడ్ కేంద్రాలకు వస్తున్నవారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది.
టీకా ప్రక్రియలో రెండో డోస్ ఎప్పటికి పూర్తవుతుంది. 18 ఏళ్లలోపు అర్హులను గుర్తించారా?
జిల్లాలో తొలిడోసు టీకాకు 39,66,059 మందిని గుర్తించాం. 42,43,399 మందికి వేసి 107 శాతం సాధించాం. రెండో డోసు 39,66,059 మందికి వేయాల్సి ఉండగా ఇప్పటివరకు 32,98,048 మందికి పూర్తయింది. 83 శాతం లక్ష్యానికి చేరుకున్నాం. 15 నుంచి 18ఏళ్లలోపు వారు 2,30,965 మంది ఉన్నట్లు గుర్తించి ఇప్పటికే 2,09,164 మందికి ఇచ్చి 90.6 శాతం పూర్తిచేశాం. వైద్యారోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు, 60ఏళ్లు దాటిన వారికి బూస్టర్ డోసు వేస్తున్నాం. ఇందులో 69303 మంది ఉండగా, 31928 మందికి వ్యాక్సిన్ వేసి 46.07శాతం సాధించాం.
కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా ప్రజలకు మీరిచ్చే సూచనలేమిటి?
జిల్లా యంత్రాంగం పరంగా వైరస్ విస్తరణకు అనేక చర్యలు తీసుకుంటున్నా ప్రజా భాగస్వామ్యం తప్పనిసరి. ప్రజలందరూ మాస్క్ ధరించాలని పదేపదే చెప్పి అవగాహన కల్పిస్తున్నా కొందరు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. జిల్లాలో మాస్క్లు ధరించని 85,295 మందికి జరిమానా విధించాం. సామాజిక బాధ్యతగా మాస్క్ ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ వాడటం, అనవసర ప్రయాణాలు తగ్గించుకోవడం, రద్దీ ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం చేస్తే వైరస్ కట్టడి సాధ్యమవుతుంది. యంత్రాంగం సన్నద్ధంగా ఉన్నందున ప్రజలెవరూ ఆందోళన చెందవద్ధు వైరస్ సోకినా ధైర్యంగా ఉంటూ వైద్యుల సూచనలతో మందులు వాడి పోషకాహారం తీసుకుంటే సరిపోతుంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొవడానికి సిద్ధంగా ఉన్నాం.
కొవిడ్ రెండో దశలో ఆక్సిజన్ కొరతతో ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారా?
రెండో దశలో తక్కువ సమయంలో వేలమంది ఆసుపత్రికి రావడం, ఎక్కువ మందికి ఆక్సిజన్ అవసరం కావడంతో ఇబ్బందులు ఏర్పడినా అప్రమత్తమై సమస్యను పరిష్కరించాం. అప్పటి అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని 11 ప్రభుత్వాసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటుచేశాం. కొన్ని ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యామ్నాయంగా ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు కూడా అవసరమైనన్ని అందుబాటులో ఉన్నాయి. ఈసారి ఆక్సిజన్ కొరత అనే ప్రసక్తే రాకుండా ముందస్తుగా సిద్ధంగా ఉన్నాం.
ఈనాడు: జిల్లాలో వైద్యులు, సిబ్బంది, ఉద్యోగులు కూడా కరోనా బారినపడుతున్నారు. బాధితులకు సేవల్లో లోపం లేకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్ : జిల్లాలో ఉన్న వైద్యులు, సిబ్బందితోపాటు అదనంగా 2029 మంది కొత్తగా విధుల్లోకి తీసుకున్నాం. వీరిలో వైద్యనిపుణులు, స్టాఫ్నర్సులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, నాలుగో తరగతి ఉద్యోగులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉన్నారు. వీరంతా అందుబాటులో ఉంటూ రోగులకు సేవలు అందిస్తారు. జిల్లా స్థాయి అధికారులను ప్రతి ఆసుపత్రికి నోడల్ అధికారులుగా నియమించి అక్కడ కరోనా రోగులకు అందుతున్న సేవలు పర్యవేక్షిస్తున్నాం. ఆయా ఆసుపత్రుల్లో రోగులకు సేవలు సక్రమంగా అందేలా చూడటంతోపాటు సమస్యలు ఉన్నట్లయితే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకువస్తారు. వీరందరూ సక్రమంగా పర్యవేక్షించేలా నిరంతరం సమీక్ష చేస్తున్నాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యమానికి ఊపిరై.. రాజధానికి సమిధలై..
[ 11-05-2024]
‘రాష్ట్ర విభజనతో పుట్టెడు కష్టాల్లో పడ్డాం. మనకూ ఒక రాజధాని ఉండాలి. పక్క రాష్ట్రాలతో దీటుగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి. భావితరాల భవిష్యత్తు బాగుంటుందని’ నమ్మి రాజధాని రైతులు తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూములను అమరావతి కోసం త్యాగాలు చేశారు. -
నోట్ల కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ అన్నిదారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
పట్టలేదు.. కట్టలేదు!
[ 11-05-2024]
ఐదేళ్ల పాలనలో నాడు-నేడు జీజీహెచ్ ఎలా ఉందో పోల్చి చూస్తే నాడే నయమని తేలిపోయింది. రోగులు, వారి సహాయకుల బాగు కోసం తెదేపా ప్రభుత్వం ప్రారంభించిన సర్వీస్ బ్లాక్ నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసింది. -
సీఎం వచ్చారు.. నరకం చూపారు
[ 11-05-2024]
నడిరోడ్డుపై సీఎం జగన్ నిర్వహించిన ప్రచార సభ.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. మంగళగిరిలోని స్థానిక పాతబస్టాండ్ సమీపంలో గౌతమబుద్దా రోడ్డులో శుక్రవారం ఆయన ప్రచార వాహనంపై ప్రసంగించారు. -
కక్షగట్టి.. పొట్టకొట్టి.. అమరావతి విధ్వంసం
[ 11-05-2024]
అమరావతి విశ్వనగరంగా ఆవిర్భవిస్తుందన్న ఆశలను సీఎం జగన్ తుంచేశారు. రేయింబవళ్లు శరవేగంగా సాగుతున్న నిర్మాణ పనులను కక్షగట్టి నిలిపేశారు. అంతేకాదు.. ఇక్కడి ప్రజల జీవనంపై పెద్ద దెబ్బ కొట్టారు. -
పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలి
[ 11-05-2024]
ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేలా పోలీసులు నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాలని సార్వత్రిక ఎన్నికల రాష్ట్ర ప్రత్యేక పోలీసు పరిశీలకుడు దీపక్ మిశ్రా ఆదేశించారు. -
అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు
[ 11-05-2024]
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వారంలోనే ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తామని గుంటూరు ఎంపీ తెదేపా అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పష్టం చేశారు. -
వేణుగోపాలుడి భూమినీ వదల్లేదు..!
[ 11-05-2024]
దేవుడి మాన్యంపై వైకాపా నాయకుడి కన్ను పడింది. వివరాల్లోకెళ్తే..గుంటూరు జిల్లా తాడికొండ గ్రామంలోని వేణుగోపాలస్వామివారి ఆలయం దేవుడి మాన్యం భూమిని వైకాపా నాయకులు కబ్జా చేశారు. -
పాలకుల నిరక్ష్యం.. ప్రజలకు శాపం
[ 11-05-2024]
వైకాపా పాలనలో పట్టణంలోని అధికార పక్ష సభ్యుల వార్డులు 38, 39, 40లలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో పూర్తికాక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
చినగంజాంలో వైకాపాకు షాక్
[ 11-05-2024]
జిల్లాలో సార్వత్రిక ఎన్నికల వేళ పర్చూరు నియోజకవర్గంలో వైకాపాకు భారీ షాక్ తగిలింది. -
కట్టలు తెగుతున్నాయ్!
[ 11-05-2024]
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నా లక్ష్యంతో అధికార పార్టీ అన్ని దారులూ అన్వేషిస్తోంది. నిన్నటి వరకు వివిధ వర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి వారిని ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. -
జగన్ జమానా.. రైతు నష్టాన
[ 11-05-2024]
పల్నాడు జిల్లాలో పంటలు చేతికొచ్చే వేళ మిగ్జాం తుపానుతో రైతులు సర్వం కోల్పోయారు. తీతకు సిద్ధంగా ఉన్న పత్తి వర్షాలకు తడిసి పనికిరాకుండా పోయింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి