ఎన్నికల వేళా.. ఆగని దోపిడీ
అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది.
అర్ధరాత్రి అడ్డగోలుగా తవ్వకాలు
పదుల సంఖ్యలో లారీలతో ఇసుక రవాణా
అధికార పార్టీ ప్రజాప్రతినిధి మేనల్లుడి నిర్వాకం
ఈనాడు, అమరావతి, న్యూస్టుడే, కొల్లిపర: అధికారం అండగా ఉందని ఏం చేసినా అడ్డుకునేవారు లేరని వైకాపా నేతలు బరితెగించారు. కృష్ణానదిలో రాత్రివేళ అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేస్తూ తరలించి జేబులు నింపుకొంటున్నారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వారికి అడ్డంకి లేకుండా పోయింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధి మేనల్లుడు ఇసుక వ్యాపారం చేస్తుండడంతో క్షేత్రస్థాయి యంత్రాంగం జీ హుజూర్ అంటోంది. అనుమతులు లేకపోయినా యంత్రాల వాడకంపై నిషేధం వంటి నిబంధనలకు నీళ్లొదిలి కాసుల కక్కుర్తితో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేస్తూ రూ.కోట్లు అక్రమార్జనకు తెరలేపారు. ప్రజాప్రతినిధి అండ దండిగా ఉండడంతో యథేచ్ఛగా చెలరేగిపోయారు. కృష్ణానదిలో ఏకంగా బాటలు వేసి మరీ ఇసుక తవ్వి రవాణా చేస్తున్నారు. ఇసుకాసురుల దాహానికి అక్కడి గోతులే సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, రోడ్లు పాడవుతున్నాయని స్థానికులు పదే పదే మొరపెట్టుకుంటున్నా ఇసుకాసురుల ముందు అరణ్యరోదన అవుతోంది. ఇదీ డెల్టా ప్రాంతానికి చెందిన అధికార పార్టీ ప్రజాప్రతినిధి మేనల్లుడి నిర్వాకం.
వారం రోజుల నుంచి మొదలై..
కృష్ణానదిలో కొల్లిపర మండల పరిధిలో వారం రోజుల నుంచి వైకాపా నేత ఇసుక అక్రమ తవ్వకాలకు తెరలేపారు. అంతకుముందు కూడా బుసక పేరుతో అనుమతులు తీసుకుని ఇసుక రవాణా చేసి రూ.కోట్లు కూడబెట్టుకున్నారు. నదిలో యంత్రాలతో తవ్వకాలను నిషేధించడంతో అనుమతి పొందిన కంపెనీ కొన్నాళ్లుగా తవ్వకాలు నిలిపేసింది. ఇదే అదనుగా వైకాపా నేత అక్రమ తవ్వకాలను ప్రారంభించారు. కొల్లిపర మండల పరిధిలో బొమ్మువానిపాలెం, మున్నంగి, వల్లభాపురం, అన్నవరపులంక తదితర రీచ్లలో రాత్రివేళ భారీ యంత్రాలు పెట్టి నిత్యం 150కు పైగా లారీల ఇసుకను తరలిస్తున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడం రోజువారీగా పెద్దఎత్తున ఆదాయం సమకూరుతుండడంతో నేతకు కాసుల వర్షం కురుస్తోంది.
కృష్ణా జిల్లాలో కట్టడితో ఇక్కడ డిమాండ్..
ఇదే సమయంలో కృష్ణా జిల్లాలో ఇసుక తవ్వకాలను కట్టడి చేయడంతో గుంటూరు జిల్లా ఇసుకకు మరింత డిమాండ్ పెరిగింది. ఇదే అదనుగా చీకటిపడితే చాలు నదిలో పెద్దఎత్తున అక్రమ తవ్వకాలు చేపట్టారు. ఏకంగా నదిలో లారీల రాకపోకలకు దారులు ఏర్పాటు చేసుకున్నారు. లారీలు ఇసుక నింపుకోవడానికి ఒక దారిలో వెళ్లేలా.. మరో దారిలో వేగంగా బయటకు వచ్చేలా చూస్తున్నారు. దీని వల్ల సమయం వృథా కాకుండా ఎక్కువ ట్రిప్పులు ఇసుక తరలించాలనేది నేత లక్ష్యం. ఒకవైపు ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతలు బిజీగా గడుపుతుండడంతో ప్రజాప్రతినిధి మేనల్లుడు మాత్రం ఇసుక అక్రమ రవాణాలో తీరిక లేకుండా ఉన్నారు. ప్రజాప్రతినిధి తాను ఎక్కడా అవినీతికి పాల్పడలేదంటూ బీరాలు పలుకుతుండగా ఆయన అండతోనే మేనల్లుడు ఇసుకాసురుడిగా అవతారమెత్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. లారీకి రూ.20వేల చొప్పున వారం రోజుల్లో 1050 ట్రిప్పుల ద్వారా సుమారు రూ.2.10 కోట్లు కొల్లగొట్టారు. ఇసుక వ్యాపారం మొత్తం మేనల్లుడి చేతిలో పెట్టడంతో రూ.కోట్లు సంపాదించి మామకు సమకూర్చారు.
యంత్రాంగానికి తెలిసినా.....
కొల్లిపర మండలంలో కృష్ణానదిలో ఇసుక రీచ్లలో రాత్రివేళ అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నా క్షేత్రస్థాయి యంత్రాంగం పట్టించుకోలేదు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గత నెల 16 నుంచి 24 గంటలు పనిచేసే తనిఖీ కేంద్రాలతో పాటు ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా అన్ని మార్గాల్లో తనిఖీలు చేస్తున్నారు. రాత్రివేళ మరింత అప్రమత్తంగా ఉంటున్నారు. ఈనేపథ్యంలో వారం రోజులుగా ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నా క్షేత్రస్థాయి యంత్రాంగం వాహనాలను స్వాధీనం చేసుకోలేదు. పోలీసు, రెవెన్యూ, భూగర్భగనులశాఖ అధికారులు అనుమతులు లేకుండా నదిలో తవ్వకాలు జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడలేదు. క్షేత్రస్థాయి యంత్రాంగం మొత్తం ప్రజాప్రతినిధి కనుసన్నల్లో పనిచేస్తుండడంతో ఎవరికివారు మిన్నకుండిపోయారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత స్వేచ్ఛగా పనిచేయాల్సిన యంత్రాంగం ఇంకా ప్రజాప్రతినిధి ఆదేశాలకు అనుగుణంగా పని చేయడం గమనార్హం.
33 లారీలు.. 2 పొక్లెయిన్లు స్వాధీనం
కొల్లిపర మండలం అన్నవరపులంకలో అనుమతులు లేకుండా ఇసుక తవ్వి తరలిస్తున్న 2 భారీ పొక్లెయిన్లు, 33 లారీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత పెద్ద మొత్తంలో లారీలు, పొక్లెయిన్లు స్వాధీనం చేసుకోవడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. కృష్ణానదిలో ఇసుక అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో గుంటూరు నుంచి పోలీసు బృందంతో ఏఎస్పీ నచికేత్ షెల్కే వెళ్లి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
[ 03-05-2024]
కడప జిల్లా కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. -
పేదల ప్రాణాలతో రాజకీయం చేస్తారా?: సీఎస్కు చంద్రబాబు లేఖ
[ 03-05-2024]
పింఛన్ల పంపిణీలో ప్రజల ఇబ్బందులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డికి తెదేపా అధినేత చంద్రబాబు లేఖ రాశారు. -
బ్యాంకుల వద్ద బారులుదీరిన పింఛనుదారులు
[ 03-05-2024]
వట్టి చెరుకూరు మండలంలోని గ్రామాల్లో బ్యాంకుల వద్ద లబ్ధిదారులు బారులుదీరారు. -
తెదేపా ఆధ్వర్యంలో ట్రాక్టర్లతో భారీ ప్రదర్శన
[ 03-05-2024]
మండలంలోని ఇంజనంపాడు, కమలమూడి, కాట్రపాడు, రొట్టె చెరుకూరు, లేములపాడు, అనంతపురం గ్రామాల్లో తెదేపా ఎంపీ, ఎమ్మెల్యే... -
కక్షగట్టి రప్పించారు.. కసితీరా వేధించారు..
[ 03-05-2024]
అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అవసరమైతే తప్ప ఇళ్లల్లో నుంచి బయటకు రావొద్దని ఒకవైపు ప్రచారం చేయిస్తున్న పాలకులు ఆరు పదుల వయసు పైబడిన సామాజిక పింఛనుదారులను మాత్రం మండుటెండలో బజారుకీడ్చి వారిని ఇబ్బందుల పాల్జేశారు. -
మీతోనే ముప్పు.. మీవల్లే ముంపు!
[ 03-05-2024]
వారి బాగోగులను అనుక్షణం పట్టించుకోవాలి.అక్కడి ప్రకృతి, పర్యావరణంతోపాటు నదులు, వాగులు, వంకలు సహా పంట పొలాలను రక్షించు కోవాలి. -
నా వంతుగా.. మామకు మద్దతుగా..
[ 03-05-2024]
సినీ హీరో నిఖిల్ గురువారం చీరాలలో సందడి చేశారు. కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎం కొండయ్యకు మద్దతుగా ఆయన పట్టణంలో ప్రచారం చేపట్టారు. -
బీసీ నాయకులకు జగన్ కుర్చీ కూడా వేయనివ్వరు
[ 03-05-2024]
బీసీ నాయకులు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దగ్గరకు వెళితే కనీసం కుర్చీ కూడా వేయరు, ఎవరికి వేయాలో ఆయన కనుసైగలతో సూచిస్తారని మనమంతా విన్నాం, బీసీల పట్ల ఆయన చూపే గౌరవం తీరు ఆ పార్టీ ఆలోచనా విధానాన్ని తెలియచేస్తుందని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. -
పోలీసు.. నేత.. చెట్టపట్టాల్!
[ 03-05-2024]
అధికార వైకాపా నేతల కనుసన్నల్లోనే ఇప్పటికీ పోలీసు యంత్రాంగం జోగుతోంది. విధి నిర్వహణలో వారు చెప్పిందే పోలీసులకు వేదంగా ఉంటోంది. -
ఉద్యోగుల ఓట్లకు..గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు. -
క్షీణించిన శ్రీలక్ష్మి ఆరోగ్యం
[ 03-05-2024]
వైకాపా నాయకుల దౌర్జన్యాలు, కబ్జాలతో నష్టపోయిన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోపూరి శ్రీలక్ష్మి ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబసభ్యులు గురువారం ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
[ 03-05-2024]
తెదేపా అధికారంలోకి రావడం ఖాయం. వచ్చే ఐదేళ్లలో నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పించి తీరతాం’.. అని గుంటూరు పశ్చిమ తెదేపా అభ్యర్థి గళ్లా మాధవి స్పష్టం చేశారు. -
అధికార పార్టీని చిత్తుగా ఓడించండి
[ 03-05-2024]
రాష్ట్రంలో అరాచకపాలన సాగిస్తున్న ప్రభుత్వం మారాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. ‘ఇండియా’ కూటమి అభ్యర్థులు జంగాల అజయ్కుమార్, జొన్నా శివశంకరరావు తరఫున మంగళగిరిలో గురువారం సాయంత్రం జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. -
లోకేశ్ మంగళగిరి రూపురేఖలు మారుస్తారు
[ 03-05-2024]
గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన మంగళగిరి వైకాపా అభ్యర్థి తల్లి కాండ్రు కమల, మామ మురుగుడు హనుమంతరావు నియోజకవర్గానికి ఏం చేశారని ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ఆంధ్రాప్యారిస్ పేరుకు తగ్గట్లు అభివృద్ధి చేస్తాం
[ 03-05-2024]
ఆంధ్రాప్యారిస్ను పేరుకు తగిన విధంగా అభివృద్ధి చేసి చూపిస్తామని, తమకు మద్దతు ఇవ్వాలని కూటమి గుంటూరు ఎంపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, తెనాలి ఎమ్మెల్యే అభ్యర్థి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు -
మహిళలే నిర్ణేతలు
[ 03-05-2024]
ఓటర్ల తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. జనవరి 22 తర్వాత జరిగిన చేర్పులు, మార్పులు అనంతరం 22,029 మంది ఓటర్లు పెరిగారు. -
ఉద్యోగుల ఓట్లకు.. గండికొట్టాలనేనా?
[ 03-05-2024]
ఉమ్మడి గుంటూరులో ఎన్నికల విధుల్లో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఇవ్వాల్సిన ఫారం-12కు ఎన్నికల అధికారులు మోకాలడ్డుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి
-
పక్క వారిపై ఆ భావన ఉంటే ఈగోలు అడ్డురావు: శోభితా ధూళిపాళ్ల
-
ఆ ఒక్కడే.. ఐపీఎల్లో నన్ను భయపెట్టిన బ్యాటర్: గౌతమ్ గంభీర్
-
సునీత, వైఎస్ షర్మిల పిటిషన్లపై హైకోర్టు కీలక ఆదేశాలు
-
సూచీలకు ‘హెవీ’ స్ట్రోక్.. 700 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రోహిత్ తర్వాత పాండ్యనే కెప్టెన్.. మరింత బాధ్యతగా ఆడాలి: మాజీ క్రికెటర్