logo

వైకాపా నుంచి తెదేపాలోకి భారీ వలసలు

తెనాలిలో వైకాపా నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్‌ తోక శిరీష, వాసు దంపతులు,

Published : 02 May 2024 06:34 IST

ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ సమక్షంలో తెదేపాలో చేరిన వైకాపా మున్సిపల్‌ కౌన్సిలర్‌ శిరీష, తదితరులు

తెనాలి టౌన్‌, న్యూస్‌టుడే: తెనాలిలో వైకాపా నుంచి స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు కూటమిలోకి వరుసగా వస్తున్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణంలోని 23వ వార్డు కౌన్సిలర్‌ తోక శిరీష, వాసు దంపతులు, మరి కొంత మంది నాయకులు తెదేపాలో చేరారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. వైకాపా ప్రభుత్వంలో కోరుకున్న విధంగా అభివృద్ధి, సంక్షేమం అందించలేకపోతున్న నేపథ్యంలో స్థానిక ప్రజాప్రతినిధులు ఇలా ఆ పార్టీని వీడుతున్నారని ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్కొన్నారు. నాయకులు ఖుద్దూస్‌, త్రిమూర్తి, మహేష్‌, యుగంధర్‌, రవీంద్ర, రమాదేవి తదితరులు పాల్గొన్నారు. కొద్ది రోజుల కిందట 31వ వార్డు వైకాపా కౌన్సిలర్‌ మానసారెడ్డి స్థానిక నాయకులతో కలిసి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన విషయం విదితమే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని