logo

Hyderabad News: సెలైన్‌తో విషం ఎక్కించుకుని వైద్యుడి ఆత్మహత్య

ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ సైదులు వివరాల ప్రకారం.. కడప జిల్లా బద్వేలుకు చెందిన డా. రాజ్‌కుమార్‌(29) అమీర్‌పేట శ్యామ్‌కరణ్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తూ బీకేగూడలో

Updated : 12 Dec 2021 07:48 IST

డా.రాజ్‌కుమార్‌

సనత్‌నగర్‌, న్యూస్‌టుడే: ఎస్సార్‌నగర్‌ ఠాణా పరిధిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సీఐ సైదులు వివరాల ప్రకారం.. కడప జిల్లా బద్వేలుకు చెందిన డా. రాజ్‌కుమార్‌(29) అమీర్‌పేట శ్యామ్‌కరణ్‌ రోడ్డులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తూ బీకేగూడలో అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. శుక్రవారం స్నేహితుడికి ఫోన్‌ చేసి తన మనసు బాగోలేదని చెప్పాడు. స్నేహితుడు తిరిగి ఫోన్‌ చేసినా స్పందించలేదు. అనుమానం వచ్చిన అతను మరో వైద్యుడు శ్రీకాంత్‌కు సమాచారమిచ్చాడు. అతను హుటాహుటిన వచ్చి చూడగా రాజ్‌కుమార్‌ తన చేతికి సెలైన్‌ బాటిల్‌ పెట్టుకుని అపస్మారక స్థితిలో కనిపించాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తండ్రి కొండిపల్లి సుబ్బారావు ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. సెలైన్‌లో విషం ఎక్కించుకున్నట్లు గుర్తించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని