నీరు మింగింది.. కన్నీరు మిగిలింది
వర్షానికి గుంతలో చేరిన నీరు మూడు కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. లోతు తెలియక లోపలికి దిగిన ముగ్గురు చిన్నారులను ఆ కుంట మింగేసింది
నీటి గుంతలో పడి ముగ్గురు చిన్నారులు దుర్మరణం
చిన్నారుల మృతదేహాల వద్ద విలపిస్తున్న కుటుంబీకులు
షాద్నగర్, షాద్నగర్ పట్టణం, న్యూస్టుడే: వర్షానికి గుంతలో చేరిన నీరు మూడు కుటుంబాల్లో కన్నీరు మిగిల్చింది. లోతు తెలియక లోపలికి దిగిన ముగ్గురు చిన్నారులను ఆ కుంట మింగేసింది. ఈ విషాద ఘటన షాద్నగర్ పురపాలికలోని సోలీపూర్ గ్రామ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం.. సోలీపూర్కు చెందిన అక్షిత్గౌడ్(8), ఫరీద్(12), సయీఫ్(7), సంజయ్కుమార్ కలిసి గ్రామ శివారులోని ఓ వెంచర్ వద్దకు వెళ్లారు. రోడ్డు మరమ్మతులకు కావాల్సిన మట్టి కోసం వెంచర్లో మున్సిపాలిటీకి కేటాయించిన స్థలంలో భారీగా గుంతలు తవ్వారు. వర్షాలకు ఓ గుంత నీటితో నిండింది. ఈత కొడదామన్న ఆసక్తితో నలుగురు చిన్నారులు అందులోకి దిగారు. సంజయ్కుమార్ కొంచెం దూరం వెళ్లి భయమేసి వెనిక్కి వచ్చేశాడు. మిగతా ముగ్గురు నీటిలో పడి గిలగిల్లాడుతుండటంతో వెంటనే పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్థులకు చెప్పాడు. బాలుర కుటుంబ సభ్యులు, గ్రామస్థులు హుటాహుటిన చేరుకొనేసరికే ముగ్గురూ నీటిలో మునిగి మృత్యు ఒడికి చేరారు. ఏసీపీ కుషాల్కర్, సీఐ నవీన్కుమార్ మృతదేహాలను బయటకు తీయించి షాద్నగర్ కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించారు. వెంచర్లో తవ్విన గుంతలే తమ పిల్లల ప్రాణాలు తీశాయని, తమకు న్యాయం కావాలని చిన్నారుల కుటుంబ సభ్యులు పట్టణ కూడలిలో, కమ్యూనిటీ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. న్యాయం జరిగేలా చూస్తానని ఏసీపీ కుషాల్కర్, తహసీల్దార్ గోపాల్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.
కొత్త బట్టలు కావాలి నాన్నా..: దసరాకు కొత్తబట్టలు కావాలని ఉదయమే అక్షిత్గౌడ్ మారాం చేశాడని.. ఇంతలోనే ఇలా జరిగిందని తండ్రి భిక్షపతి వాపోయాడు. ఆయన ముగ్గురు కుమారుల్లో అక్షిత్ చిన్నవాడు.
అన్నదమ్ముల ఇళ్లలో విషాదం: నయీమ్, సలీంలు సొంత అన్నదమ్ములు. నయీమ్ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె కాగా పెద్దకుమారుడు ఫరీద్ ఈ ఘటనలో కన్నుమూశాడు. సలీం దంపతులకు సయీఫ్తోపాటు కుమార్తె ఉండగా, కుమారుడు ఇదే ఘటనలో మృత్యువాత పడ్డాడు. దీంతో రెండు ఇళ్లలో తీవ్ర విషాదం నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిశ్చితార్థం రద్దు కావడంతో బాలిక తల నరికిన వరుడు
బాలికతో తనకు జరుగుతున్న నిశ్చితార్థాన్ని మహిళా, శిశు సంక్షేమశాఖ అధికారులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన వరుడు.. ఆమె తల నరికి హత్య చేసిన దారుణ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. -
ధాన్యాన్ని కుప్పవేస్తూ ఆగిన రైతు గుండె
ఆరబెట్టిన ధాన్యం అకాల వర్షాలకు మళ్లీ నానిపోతుందేమో అనే ఆందోళనతో పంటను కాపాడుకునే ప్రయత్నం చేసిన రైతు గుండె ఆగి మృతి చెందారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
విద్యుదాఘాతంతో ఓ రైతు మృతిచెందిన ఘటన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని వర్జిన్తండాలో చోటుచేసుకుంది. -
జిల్లా కేంద్రంలో కలకలం
జిల్లాకేంద్రంలో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. పట్టణంలోని చిక్కడపల్లికి చెందిన జీషాన్, బుధవార్పేట్కు చెందిన మతిన్ మిత్రులు. -
హైవే కిల్లర్లకు 45 ఏళ్ల జైలు శిక్ష
హైవే కిల్లర్గా పేరుపొందిన నరహంతక మున్నా ముఠాకు ఉరిశిక్ష విధిస్తూ ఒంగోలు ఎనిమిదో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పును యావజ్జీవ కారాగార శిక్షగా మారుస్తూ హైకోర్టు తీర్పు చెప్పింది. -
ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. 12 మంది మావోయిస్టుల మృతి
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యం మరోసారి నెత్తురోడింది. మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ఎండీ సజ్జనార్పై ఎన్నికల అధికారులకు ఫిర్యాదు
-
ప్రేమికుడిపై పెట్రోలు పోసి తానూ నిప్పంటించుకున్న ప్రేయసి
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
-
11 గుర్తింపు కార్డుల్లో ఏదైనా చూపి ఓటేయవచ్చు
-
జగన్ మాటలు వినని జనం.. చెప్పిందే చెప్పి విసిగించిన సీఎం
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!