యథేచ్ఛగా గ్యాస్ రీఫిల్లింగ్ దందా
నగరంలో గ్యాస్ రీఫిల్లింగ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఖాతా పుస్తకాలతో బుకింగ్, విక్రయించడం నుంచి ఏజెన్సీలతోనే డీల్ కుదుర్చుకునే వరకు దందా విస్తరించింది.
ఏజెన్సీల నుంచి బల్క్గా విక్రయాలు
పౌరసరఫరాల శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న సిలిండర్లు
ఈనాడు, హైదరాబాద్: నగరంలో గ్యాస్ రీఫిల్లింగ్ దందా యథేచ్ఛగా సాగుతోంది. ఖాతా పుస్తకాలతో బుకింగ్, విక్రయించడం నుంచి ఏజెన్సీలతోనే డీల్ కుదుర్చుకునే వరకు దందా విస్తరించింది. బల్క్గా 14.5కేజీల గృహావసర సిలిండర్లను కొనుగోలు చేసి 19 కేజీల వాణిజ్య సిలిండర్లలోకి రీఫిల్లింగ్ చేసి విక్రయిస్తున్నారు. దీంతో ఆయిల్ కంపెనీలకు వాణిజ్య సిలిండర్ల ద్వారా సమకూరే ఆదాయానికి గండిపడుతోంది.
గృహావసర సిలిండర్ ధర ప్రస్తుతం రూ.1,150, వాణిజ్య సిలిండర్ ధర రూ.2,350గా ఉంది. ఫిల్లింగ్ పైపుల ద్వారా గ్యాస్ రీఫిల్లింగ్ చేస్తూ ఒక్కో సిలిండర్పై సుమారు రూ.300 నుంచి రూ.500 వరకు సొమ్ము చేసుకుంటున్నారు. ఇవేకాదు 5కేజీల సిలిండర్లను సైతం ఇలాగే రీఫిల్లింగ్ చేసి అమ్ముతున్నారు. ఒక్కో సిలిండర్ రూ.700 నుంచి రూ.800 వరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
తాజా ఉదంతం..
* రెండేళ్లుగా జగద్గిరిగుట్టలో ఈ దందా చేస్తున్న 9 మందిని బాలానగర్ జోన్ ఎస్వోటీ, జగద్గిరిగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 267 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. (డొమెస్టిక్ - 67, కమర్షియల్- 190) ఉన్నాయి. ఇందులో ఏజెన్సీ నిర్వహించే వ్యక్తే ప్రధాన నిందితుడు.
* పౌర సరఫరాల శాఖ ఇటీవల 9 సర్కిళ్లలో జరిపిన తనిఖీల్లోనూ 115 కేసులు నమోదు చేసి 227 కేసులు నమోదు చేశారు. గడ్డి అన్నారంలో 11, యాకుత్పురాలో 12, కార్వాన్లో 8, గౌలిగూడలో 12, దారుస్సలాంలో 16, అంబర్పేట్లో 12, ఖైరతాబాద్లో 13, బేగంపేట్లో 14, సికింద్రాబాద్లో 17 కేసులు నమోదు చేశారు.
జనావాసాల్లో ప్రమాదకరంగా..
* రాజస్థాన్ నుంచి వలస వచ్చిన ఇద్దరు నార్సింగిలో కిరాణా దుకాణం నిర్వహిస్తూనే మరో అద్దెగదిలో రీఫిల్లింగ్ దందా ప్రారంభించారు. చిన్న సిలిండర్లలోకి గ్యాస్ నింపుతుండగా ప్రమాదవశాత్తు నిప్పంటుకుని ఇద్దరూ తీవ్రగాయాలతో మృతిచెందారు.
* కర్మన్ఘాట్లోని భూపేష్గుప్తానగర్లో ఇలాగే రీఫిల్లింగ్ చేస్తుండగా ఒకేసారి ఐదారు సిలిండర్లు పేలిపోయాయి. ఇనుప ముక్కలు వందమీటర్ల దూరంలో పడిపోయాయి. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
* సుభాష్నగర్లో ఇళ్ల మధ్యే రీఫిల్లింగ్ చేస్తున్న సమయంలో పేలుడు సంభవించి ఓ వ్యక్తి మృతి చెందగా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఆన్లైన్ బుకింగ్ నుంచి సర్దుబాట్లు..
పేమెంట్ గేట్వేల ద్వారా బుక్ చేస్తే 3 రోజుల్లోగా డెలివరీ చేయాలన్న నిబంధనను కొన్ని ఏజెన్సీలు పాటించడం లేదు. బుక్ చేసిన 15 రోజులకు డెలివరీ అవడం లేదు. దీన్ని కొందరు సీరియస్గా తీసుకుని ఫిర్యాదు చేసే వరకు వెళ్తే రెండ్రోజుల్లో సర్దుబాటు చేస్తామని, ఎవరైనా అడిగితే డెలివరీ అయ్యిందని చెప్పాలంటూ అభ్యర్థిస్తుండటం అనుమానాలకు తావిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాధ్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
ప్రయాణం మానుకోండి.. ప్రతిఫలం పొందండి
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి