Hyderabad: భార్యను బెదిరించాలనుకుని.. నిజంగానే ఉరేసుకున్నాడు
భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతో ఉరేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి చనిపోయిన ఘటన ఇది జవహర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....శ్రీకాకుళం జిల్లాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు సింహాద్రి నాగరాజు (36), మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు.
జవహర్నగర్: భార్యను బెదిరించాలన్న ఉద్దేశంతో ఉరేసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి చనిపోయిన ఘటన ఇది జవహర్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....శ్రీకాకుళం జిల్లాకు చెందిన సెంట్రింగ్ కార్మికుడు సింహాద్రి నాగరాజు (36), మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడు. బాలాజీనగర్ చంద్రపురికాలనీకి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోగా.. నాగరాజును రెండో వివాహం చేసుకుంది. నాగరాజు మద్యానికి బానిసయ్యాడు. తరచూ ఆమెను వేధిస్తున్నాడు. మద్యం మత్తులో ఆత్మహత్య చేసుకుంటానని తరచూ భార్యను బెదిరించేవాడు. ఈనెల 6న మద్యం తాగి ఇంటికి రాగా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. భార్య పిల్లలతో దమ్మాయిగూడలోని అమ్మమ్మ వద్దకు వెళ్లింది. గురువారం ఉదయం ఇంటికొచ్చేసరికి తాళం వేసి ఉండటంతో కిటికీలో నుంచి చూడగా భర్త ఉరివేసుకున్నట్లు గుర్తించింది. తనను భయపెట్టే క్రమంలోనే చనిపోయిన ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
తండ్రి మరణాన్ని తట్టుకోలేక యువతి ఆత్మహత్య
నాగోలు: తండ్రి మరణాన్ని జీర్జించుకోలేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఎల్బీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఎస్సై లింగారెడ్డి కథనం ప్రకారం.. మహబూబాబాద్కు చెందిన బాసని శ్రీనివాస్- సునీత దంపతులకు ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు. శ్రీనివాస్ బతుకుదెరువు కోసం కుటుంబంతో వచ్చి మన్సూరాబాద్ సాయిసప్తగిరి కాలనీలో ఉంటున్నాడు. సునీత వనస్థలిపురంలోని ఓ ఇంట్లో పనికి కుదిరింది. ఇంటర్ చదివిన కుమార్తె కీర్తన(20)కు పెళ్లి నిశ్చయమైంది. అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్ మూడు నెలల క్రితం హఠాత్తుగా మృతిచెందాడు. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్న కీర్తన.. గురువారం ఇంట్లో ఉరేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరి ఆట వారిదే.. నిర్ణేత ఓటరే
[ 13-05-2024]
సిక్సర్ల లాంటి ప్రసంగాలు.. వికెట్లను గిరాటేసె బంతుల్లాంటి విమర్శలు.. ప్రచారపు పరుగులు.. ప్రత్యర్థులను అవుట్ చేసేందుకు ఎత్తుగడలు.. ఏదేమైనా ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు వ్యూహ ప్రతివ్యూహాలు.. ఇదంతా రాజకీయ క్రీడ.. -
కార్యకర్త.. కర్మ.. క్రియ
[ 13-05-2024]
నెలరోజులపాటు రాత్రీపగలు ప్రధాన పార్టీలు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. -
పదండి ఓటేద్దాం
[ 13-05-2024]
రాజధాని నగరం ఓటుకు సిద్ధమైంది. కోటీ పది లక్షల మంది ఓటర్లు ఓటేయనున్నారు. -
నేడు వర్ష సూచన
[ 13-05-2024]
నగరంలో సోమవారం కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
హోరాహోరీగా ఉప ఎన్నిక
[ 13-05-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక పోలింగ్కు రంగం సిద్ధమైంది. -
ఓటుకు జై.. నోటాకు నై
[ 13-05-2024]
అవగాహన లోపంతోనే అనేక మంది లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. -
అభిమానమే కాదు.. అనుకరించండి
[ 13-05-2024]
సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు క్యూలో నిల్చొని ఓటేస్తూ ఓటు ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తున్నారు. -
బద్ధకం వదులు.. ఓటుకు కదులు
[ 13-05-2024]
సమయం వచ్చేసింది. పోలింగ్కు యావత్తు మహానగరం సిద్ధమైంది. -
ఊరెళ్లిన నగరం.. దారులన్నీ నిశ్శబ్దం
[ 13-05-2024]
తెలంగాణలో లోక్సభ, ఏపీలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు ఈనెల 13న జరుగుతున్నాయి. -
ఈ సారైనా పెరిగేనా?
[ 13-05-2024]
అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గుతోంది. ఓటర్లలో అసెంబ్లీ ఎన్నికలకు ఉన్న ఆసక్తి లోక్సభ ఎన్నికలకు వచ్చే సరికి మరింత తగ్గుతోంది. -
ఎన్నికల్లో ఈసీఐల్కు ప్రత్యేక భాగస్వామ్యం
[ 13-05-2024]
ఎన్నికల ప్రక్రియలో హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) కంపెనీకి ప్రత్యేక భాగస్వామ్యం ఉంది. -
ప్రతి ఓటూ ప్రాధాన్యమైందే
[ 13-05-2024]
పార్లమెంట్ ఎన్నికలనగానే లక్షల సంఖ్యలో ఓటర్లు ఉంటారు.. నేను ఒక్కర్ని వేయకపోతే ఫలితమేమైనా తారుమారు అవుతుందా అంటుంటారు. -
పోలింగ్ రోజే.. పుట్టినరోజు
[ 13-05-2024]
పుట్టిన రోజునే ఎన్నికల పోలింగ్ జరగడం మజ్లిస్ అధినేత, హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీకి అరుదైన అనుభవాన్ని కలిగించనుంది. -
తొలి ఓటు కోసం..
[ 13-05-2024]
తొలి ఓటుతో తమ తీర్పు చెప్పాలని యువత ఆశగా ఎదురు చూస్తోంది. -
మేమేశాం.. మీరూ ఓటు వేయండి
[ 13-05-2024]
పోలింగ్ బూత్కు వెళ్లలేం.. అయినా ఓటు వేయాలనే ఉత్సాహం తగ్గలేదు. ఓటు వేయడం మా బాధ్యత అని అంటున్నారు నగరంలోని వృద్ధులు. -
ఓట్లకు రూ.కోట్లు
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు వారి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధుల్లో నగదు పంపిణీ చేశారు. -
ఓటరన్నా.. ఆకర్ష.. ఆకర్ష
[ 13-05-2024]
ఓటర్లను ఆకట్టుకునేందుకు జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల కార్యకర్తలు ఆదివారం మధ్యాహ్నం మొదలు రాత్రంతా డబ్బులు, మద్యం పంపిణీలో తలమునకలై పోయారు. -
పోలింగ్ పర్వం.. సర్వం సిద్ధం
[ 13-05-2024]
నేటి సార్వత్రిక ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. -
సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
[ 13-05-2024]
జిల్లాలో నేడు జరుగనున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన పకడ్బందీ బందోబస్తు చర్యలు తీసుకున్నామని, సమస్య, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా పోలీసు అధికారి కోటిరెడ్డి ఆదివారం తెలిపారు. -
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు: కలెక్టర్
[ 13-05-2024]
ఎన్నికల విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి అన్నారు. -
బాలికపై పలుమార్లు అత్యాచారం
[ 13-05-2024]
పలుమార్లు అత్యాచారానికి గురైన బాలిక ప్రసవించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.