HYD News: కారుకు మహా కుదుపు.. కాంగ్రెస్లో చేరనున్న మేయర్ గద్వాల్ విజయలక్ష్మి?
రాజధానిలో గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ శుక్రవారం స్వయంగా మేయర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు.
ఆమెతోపాటు పదిమంది భారాస కార్పొరేటర్లు సైతం!
ఎన్నికల నోటిఫికేషన్లోపు మరికొందరు..
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి: రాజధానిలో గులాబీ పార్టీకి మరో ఎదురుదెబ్బ.. ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరడానికి రంగం సిద్ధమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ శుక్రవారం స్వయంగా మేయర్ ఇంటికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని రకాల అవకాశాలు కల్పిస్తామని మేయర్ పదవికి భరోసా ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. మేయర్ చేరికతోపాటు మరో పది మంది కార్పొరేటర్లు కూడా చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. నోటిఫికేషన్ నాటికి మరికొందరు కీలక నేతలు హస్తం గూటికి చేరనున్నారు. ఈ మొత్తం వ్యవహారంతో భారాసలో అలజడి నెలకొంది.
అవిశ్వాసం పెట్టినా.. వ్యూహరచన..
మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్లో చేరితే భారాస పార్టీ అవిశ్వాసం ప్రకటించే అవకాశం ఉందని, దీని నుంచి బయటపడడానికి కూడా కాంగ్రెస్ వ్యూహరచన చేసిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 2020లో జరిగిన బల్దియా పాలకవర్గ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను భారాస 56, భాజపా 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ రెండు స్థానాల్లో విజయం సాధించాయి. మొన్నటి ఎన్నికల తరువాత పలువురు భారాస కార్పొరేటర్లు కాంగ్రెస్లో చేరడంతో ప్రస్తుతం ఆ పార్టీ బలం 10కి పెరిగింది. భారాస బలం 46కు తగ్గింది. తాజాగా మరో పది మందిని పార్టీలో చేర్చుకోనున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోగా మరో 15 మందిని ఆకర్షించాలని సంబంధిత కార్పొరేటర్లతో మాట్లాడుతున్నారు. భాజపా నుంచి కూడా కొంతమంది కార్పొరేటర్లను చేర్చుకోవాలని భావిస్తున్నారు. భారాస అవిశ్వాసం పెడితే ఎంఐఎం కీలకంగా మారే అవకాశం ఉంది. ఎంఐఎం కాంగ్రెస్కు మద్దతు ఇస్తే.. మేయర్ విజయలక్ష్మి హస్తం పార్టీలో చేరినా.. ఆమె పదవికి ఢోకా ఉండదని పార్టీ వర్గాల అంచనా.
బల్దియాపై కాంగ్రెస్ దృష్టి..
గ్రేటర్ పరిధిలో నాలుగు జిల్లాల్లోని 29 శాసనసభా నియోజకవర్గాల్లో మూడింటిలో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో గెలవాలంటే నగరానికి చెందిన పది మంది ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లను పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి కార్యాచరణ మొదలు పెట్టింది. ఇందులో భాగంగానే చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డిని చేర్చుకుని అదే లోక్సభ స్థానంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేయిస్తోంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను చేర్చుకుని సికింద్రాబాద్ నుంచి, వికారాబాద్ జడ్పీఛైర్పర్సన్ సునీతా మహేందర్రెడ్డిని మల్కాజిగిరి నుంచి బరిలో నిలిపింది. ఈ చేరికలు సరిపోవన్న ఉద్దేశంతో బల్దియా ప్రజాప్రతినిధులపై దృష్టిసారించింది. ఇప్పటికే డిప్యూటీ మేయర్ శ్రీలతా రెడ్డి కాంగ్రెస్లో చేరారు. తాజాగా మేయర్తోపాటు మరికొందరు కార్పొరేటర్ల చేరికకు అంతా సిద్ధమైందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు
[ 12-05-2024]
ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్ పేలి పది మందికి గాయాలైన ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. -
పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది
[ 12-05-2024]
మొయినాబాద్ మండలంలో 65 పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకున్నారని తహసీల్దార్ కె. గౌతమ్ కుమార్ తెలిపారు. -
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
[ 12-05-2024]
నిత్యం రద్దీగా ఉండే హైదరాబాద్ నగరం ఓట్ల పండుగతో బోసిపోయింది. -
హైదరాబాద్కు భారీ వర్ష సూచన.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: జీహెచ్ఎంసీ
[ 12-05-2024]
జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. -
వంట చేస్తుండగా వృద్ధురాలి మెడలో గొలుసు చోరీ
[ 12-05-2024]
ఓ వృద్ధురాలి మెడలో గొలుసుని గుర్తుతెలియని ఆగంతకుడు చోరీ చేసిన ఘటన పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది -
ఓటరు స్లిప్పు అందలేదా?.. ఇలా చేయండి
[ 12-05-2024]
ఓటరు సమాచార పత్రాలను ఇప్పటికే సంబంధిత బీఎల్లు ఇంటింటికీ పంపిణీ చేశారు. రాజకీయ పార్టీలు ఓటరు చీటీలను పంచుతున్నాయి. ఇంకా అందనివారు ‘ఓటరు హెల్ప్లైన్’ మొబైల్ యాప్తో సమాచారం పొందొచ్చు. -
అభయ హస్తం.. ప్రగతికి నేస్తం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరిరోజు శివారులో కాంగ్రెస్ నినాదాలు హోరెత్తాయి.. కూడళ్లు జన పరవళ్లతో కిక్కిరిశాయి.. -
నగరాన్ని చుట్టేశారు.. ప్రచారానికి తెరదించారు
[ 12-05-2024]
రాజధానిలో మైకులు మూగబోయాయి. నెల రోజులపాటు ప్రసంగాలతో ఊదరగొట్టిన నేతల నోళ్లు మూతపడ్డాయి. లోక్సభ ఎన్నికల ప్రచారం గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. -
ఓటుకు సిద్ధమా
[ 12-05-2024]
గ్రేటర్ హైదరాబాద్ నగరం ఓటుకు సిద్ధమైంది. మరో 24గంటల్లో ఎన్నిక ప్రక్రియ మొదలుకానుంది. మూడు జిల్లాల్లోని నాలుగు ఎంపీ స్థానాలు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతుండగా.. -
గులాబీతో అభివృద్ధి గుబాళింపు..
[ 12-05-2024]
ముస్లింల సంక్షేమానికి భారాస ఎంతో కృషి చేసిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
ఎన్నికల యుద్ధం.. బలగం సిద్ధం
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మూడు కమిషనరేట్ల పరిధిలో 27వేల మంది పోలీసులు, 60 కంపెనీల కేంద్ర బలగాలు బందోబస్తులో ఉండనున్నాయి. ఎక్కడ ఘర్షణ చెలరేగినా క్షణాల్లో చేరుకునేలా దశలవారీ భద్రతా వ్యూహం రూపొందించారు. -
నకిలీ ఓటర్లను గుర్తించేందుకు ప్రత్యేక నిఘా
[ 12-05-2024]
భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని, అందరూ ఓటు వేయాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్రాస్ పిలుపునిచ్చారు. -
రండి.. స్వేచ్ఛగా ఓటేయండి
[ 12-05-2024]
ఓటు హక్కు వినియోగంపై ఎలా అవగాహన కల్పించారు? ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి చేశారా? -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెయింటింగ్ వర్క్షాప్ 19న
[ 12-05-2024]
ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. ‘ఎ ప్యాలెట్ ఆఫ్ డ్రీమ్స్’ పేరున ఈ నెల 19న నిర్వహించనున్న ఈ శిబిరంలో 14 సంవత్సరాలు దాటిన వారెవరైనా పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. -
ప్రచారం ముగిసింది.. పోలింగే మిగిలింది!
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచారం శనివారం సాయంత్రంతో ముగిసింది. దాదాపు మూడు నెలలుగా సాగిన ప్రచారానికి తెరపడింది. మల్కాజిగిరి, హైదరాబాద్ పార్లమెంట్ స్థానాల్లో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నించారు. -
ఈవీఎంల పంపిణీలో ఇబ్బందులు తలెత్తకుండా చూడాలి: కలెక్టర్
[ 12-05-2024]
ఈవీఎంలను పోలీంగ్ కేంద్రాలకు సక్రమంగా పంపిణీ జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి సిబ్బందికి తెలిపారు. శనివారం స్థానిక ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రమైన మేరీ-ఏ-నాట్్్స పాఠశాలను అదనపు పాలనాధికారి రాహుల్ శర్మ, శిక్షణ కలెక్టర్ ఉమా హారతితో కలిసి పరిశీలించారు. -
అమిత్షోతో.. కొండంత భరోసా
[ 12-05-2024]
భాజపా అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వికారాబాద్లో నిర్వహించిన సభ విజయవంతమై పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. -
సర్కార్లో జిల్లాకు అధిక ప్రాధాన్యం
[ 12-05-2024]
మన కాంగ్రెస్ ప్రభుత్వంలో జిల్లాకు ఎంతో ప్రాధాన్యం ఉందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల అభ్యర్థి గడ్డం రంజిత్రెడ్డి విజయాన్ని కోరుతూ శనివారం తాండూరులోని విలియమ్ మూన్ మైదానంలో నిర్వహించిన జనజాతర బహిరంగ సభలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంక గాంధీతో కలిసి పాల్గొని సీఎం మాట్లాడారు. -
వేలిపై సిరా చుక్క.. ఉచిత వైద్యం పక్కా
[ 12-05-2024]
ఈనెల 13న లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్న వారికి ఆరోజు ఉచితంగా వైద్యం అందజేస్తామని స్థానిక మైత్రి ఆసుపత్రి ఛైర్మన్ డాక్టర్ శ్రవణ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
తండ్రికి నెలకు రూ.1.2 లక్షల పింఛన్.. మృతదేహాన్ని ఏళ్లపాటు ఇంట్లోనే దాచిపెట్టి!
-
పేలిన ద్విచక్రవాహనం పెట్రోల్ ట్యాంక్.. 10 మందికి గాయాలు
-
మదర్స్ డే వేళ మోదీకి స్పెషల్ గిఫ్ట్.. థాంక్స్ చెప్పిన ప్రధాని
-
దిల్లీలో ఆసుపత్రులకు బాంబు బెదిరింపుల కలకలం..
-
క్లీంకారకు ఉపాసన థ్యాంక్స్.. ఒకే ఫ్రేమ్లో అక్కినేని హీరోలు
-
సొంతగడ్డపై మురిసిన చెన్నై.. రాజస్థాన్పై ఘన విజయం