ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..
నగరంలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు.
ప్రత్యర్థుల లోపాలను ఎత్తిచూపుతూ..
నాలుగు ఎంసీ స్థానాల్లో అభ్యర్థుల పథమిలా
ఈనాడు, హైదరాబాద్: నగరంలోని నాలుగు లోక్సభ నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల ప్రచారం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. నామినేషన్ల దాఖలు పూర్తికావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు పూర్తిస్థాయిలో ప్రచారంపై దృష్టిపెట్టారు. పార్టీల రాష్ట్ర, కేంద్ర నాయకులు జాతీయ అంశాలపై మాట్లాడుతుంటే.. అభ్యర్థులు స్థానిక అంశాలే తమ ప్రచార అంశంగా ప్రజల్లోకి వెళుతున్నారు. కొందరైతే ప్రత్యేకంగా మ్యానిఫెస్టోలను ప్రకటిస్తున్నారు. తమని గెలిపిస్తే చేసే పనులను చెప్పడంతో పాటు ప్రత్యర్థి పార్టీల లోపాలను ఎత్తిచూపుతున్నారు.
నగరంలోని ఎంపీ స్థానాలు హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల.. ఇవి వేటికవే భిన్నమైనవి. ఈసారి ప్రచారం గతం కంటే భిన్నంగా సాగుతోంది. అభ్యర్థులు కొందరు ప్రత్యేకంగా ఎన్నికల వ్యూహకర్తలను నియమించుకుని వారు చెప్పినట్టు చేస్తున్నారు. ప్రచార, సామాజిక మాధ్యమాల నిర్వహణ మొత్తం వారే చూసుకుంటున్నారు. లోకల్, నాన్ లోకల్ అంశాలను తెరమీదకు తీసుకొస్తున్నారు.
చేవెళ్ల
చేవెళ్ల స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుండగా.. మూడు నగరం పరిధి, మరో మూడు పూర్తిగా గ్రామీణం, మరొకటి కలబోతగా ఉంటాయి. భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి ఏకంగా నియోజకవర్గం కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో ప్రకటించారు. ప్రభుత్వ తోడ్పాటుతో అందించే పథకాలతో పాటు వ్యక్తిగతంగా చేసే పనులను అందులో ప్రకటించారు. ఈస్థానం పరిధిలో 700 గ్రామాలను తాను రెండుమూడు సార్లు తిరిగానని, మీరు ఒక్కసారైనా తిరిగారా అంటూ ప్రత్యర్థులకు సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్రెడ్డి.. ఎంపీగా ఐదేళ్లుగా తాను ఎంతో అభివృద్ధి చేశానని చెబుతున్నారు. ఇక్కడినుంచి బీసీ నినాదంతో భారాస తరఫున కాసాని జ్ఞానేశ్వర్ రంగంలో ఉన్నారు.
మల్కాజిగిరి
దేశంలోనే పెద్ద పార్లమెంట్ నియోజకవర్గమిది. తెలంగాణవాసులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచివచ్చి ఏళ్లకిందట స్థిరపడినవారు ఉన్నారు. భారాస అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి వినూత్న ప్రచారంతో ముందుకెళుతున్నారు. ఎస్ఆర్డీపీ కింద గతంలో రాష్ట్రంలో అధికారంలోఉన్న తమ ప్రభుత్వం 36 ప్రాజెక్టులు పూర్తిచేస్తే, కేంద్రంలోని భాజపా సర్కారు చేపట్టిన ఉప్పల్-మేడిపల్లి ఫ్లైఓవర్ ఆరేళ్లుగా పెండింగ్లోనే ఉందని విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునితా మహేందర్రెడ్డి ఉన్నారు. గెలిపిస్తే చేయబోయే పనులపై కరపత్రాలు పంచుతున్నారు. ఈ ప్రాంతాన్ని కోకాపేటలా అభివృద్ధిచేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రచారంలో ప్రకటించారు. మోడీ పరివార్గా తమను గెలిపించాలని భాజపా అభ్యర్థి ఈటల రాజేందర్ కోరుతున్నారు. విశ్వకర్మ యోజన పథకంతో అందులోఉన్న 17 కులాలకు న్యాయం చేస్తానని చెబుతున్నారు.
సికింద్రాబాద్..
భారాస అభ్యర్థి పద్మారావుగౌడ్.. ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే, మంత్రిగా తాను ఎంతో అభివృద్ధి చేశానని, ఎంపీగానూ గెలిపిస్తే మరిన్ని పనులు చేస్తానని చెబుతున్నారు. భాజపా అభ్యర్థిగా ఉన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి గల్లీగల్లీ తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. దశాబ్దకాలంగా జంటనగరాల్లోని అణగారిన వర్గాల అభ్యున్నతి లక్ష్యంగా.. ముఖ్యంగా మహిళలు, యువత, మైనారిటీ సంక్షేమానికి కేంద్రం గణనీయంగా నిధులు కేటాయించిందని చెబుతున్నారు. కాంగ్రెస్నుంచి దానం నాగేందర్ ఇప్పుడిప్పుడే ప్రచారం మొదలెట్టారు. గెలిపిస్తే చేయబోయే పనులపై కరపత్రాలు పంచుతున్నారు.
హైదరాబాద్
సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ హైదరాబాద్లో ఎంఐఎం అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఏడు నియోజకవర్గాల్లో గల్లీగల్లీ తిరుగుతున్నారు. దీటుగా భాజపా అభ్యర్థి మాధవీలత విస్తృత ప్రచారం చేస్తున్నారు. స్థానికం కన్నా జాతీయ అంశాలపైనే వీరి ప్రచారం జరుగుతోంది. భారాసనుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ నుంచి మహమ్మద్ సమీర్ బరిలో ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణం మానుకొని ప్రతిఫలం పొందండి.. సొంతూళ్లకు వెళ్లే వారికి తాయిలాలు
[ 11-05-2024]
ఏపీ నుంచి వచ్చి శేరిలింగంపల్లిలో ఉంటున్న కొందరు ఓటర్లు సొంతూరుకు ప్రయాణమయ్యారు. -
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
[ 11-05-2024]
కేపీహెచ్బీ ఠాణా పరిధిలో నాలుగు రోజుల క్రితం మహిళ మెడలోంచి గొలుసు చోరీ చేసిన ఘటనలో సాఫ్ట్వేర్ ఉద్యోగి నిందితుడని గుర్తించిన పోలీసులు.. -
నమో నినాదం.. కమల వికాసం
[ 11-05-2024]
వికసిత కమలాలతో.. కాషాయ రెపరెపలతో ఎల్బీ స్టేడియం పరిసరాలు కళకళలాడాయి. మైదానమంతా మోదీ నినాదమే మార్మోగింది. -
అడుగడుగునా హారతులు.. అభివృద్ధికి వరాలు
[ 11-05-2024]
అడుగడుగునా హారతులు.. బతుకమ్మ ఆటలు.. శ్రేణుల నినాదాలు.. వెరసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రోడ్షోలో ఎటుచూసినా జనసందోహమే. -
భద్రత మాది.. బాధ్యత మీది
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా 100 శాతం భద్రతా చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు స్వేచ్ఛగా ఓటేసేలా భరోసా కల్పిస్తున్నామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి తెలిపారు. -
సికింద్రాబాద్ ఓటర్లు అభివృద్ధి చూశారు
[ 11-05-2024]
‘రాష్ట్ర రాజధానిలో సగం సికింద్రాబాద్ నియోజకవర్గం. ఇక్కడ నేను చేసిన అభివృద్ధి అందరికీ తెలుసు. అభివృద్ధి ఫలాలు అందుకుంటున్నారు. -
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు.. జాతీయ హోదాకు పోరాడతా
[ 11-05-2024]
‘చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఓవైపు ఆధునికతను పుణికి పుచ్చుకోవడంతోపాటు మరోవైపు వెనకబడిన ప్రాంతాల సమాహారంగా విస్తరించి ఉంది. -
ప్రలోభాలకు ఎర.. పంపకాల జాతర
[ 11-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజులే గడువు ఉండటంతో రాజధాని పరిధిలో ప్రలోభాలకు తెర లేచింది. -
కమలం గుర్తుంచుకోండి
[ 11-05-2024]
శేరిలింగంపల్లి అసెంబ్లీ పరిధిలోని వివేకానంద నగర్ కాలనీలో చేవెళ్ల లోక్సభ భాజపా అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి రోడ్షో నిర్వహించారు. -
తెలంగాణ గుండెచప్పుడు.. ప్రతిధ్వనించింది
[ 11-05-2024]
ఇప్పటి వరకు లోక్సభకు 17 సార్లు ఎన్నికలు జరగ్గా ‘తెలంగాణ ప్రజా సమితి’ (టీపీఎస్) చారిత్రక విజయం నమోదు చేసుకుంది. -
భాజపా శ్రేణుల్లో నయా జోష్
[ 11-05-2024]
సార్వత్రిక ప్రచారం తుది దశలో భాగంగా శుక్రవారం ప్రధాని మోదీ హైదరాబాద్, నారాయణపేట జిల్లాల్లో సుడిగాలి పర్యటన చేశారు. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివి
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అధోగతి: సబిత
[ 11-05-2024]
ఐదు నెలల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి విమర్శించారు. -
చేవెళ్ల సీటు సోనియాకు కానుకగా ఇస్తాం: టీఆర్ఆర్
[ 11-05-2024]
చేవెళ్ల పార్లమెంట్ సీటును గెలిపించుకుని పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కానుకగా ఇస్తామని చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కో ఇంఛార్జి డాక్టర్ టి.రామ్మోహన్రెడ్డి అన్నారు. -
ప్రచార పర్వం.. నేటితో పరిసమాప్తం
[ 11-05-2024]
దాదాపు నెల రోజులుగా హోరెత్తించిన సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం 5 గంటలతో తెర పడుతోంది. -
సొంతవారికే పంపకాల అప్పగింతలు
[ 11-05-2024]
ప్రచారం తుది అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు ‘పంపకాల’ తలనొప్పులు మొదలయ్యాయి. -
గత స్మృతులను గుర్తు చేస్తూ.. సంతోషం వ్యక్తం చేస్తూ
[ 11-05-2024]
ఆరు నెలల క్రితం చిన్నారి పాడిన పద్యాన్ని గుర్తు చేసుకొని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. -
ప్రముఖుల రాకపోకలతో బేగంపేట విమానాశ్రయంలో సందడి
[ 11-05-2024]
ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నగరానికి ప్రముఖుల రాకపోకలతో శుక్రవారం బేగంపేట విమానాశ్రయం సందడిగా మారింది. -
ఎన్నికల రోజున డ్రోన్లతో నిఘా
[ 11-05-2024]
ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి(డీఈఓ) రోనాల్డ్రాస్ తెలిపారు. -
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకం
[ 11-05-2024]
వైద్య సేవల్లో నర్సుల పాత్ర కీలకమని నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ నగరి బీరప్ప అన్నారు. -
చీటీ వచ్చిందా.. ఏ బ్రాండు కావాలో ఇచ్చెయ్
[ 11-05-2024]
ఓటర్లకు మద్యం పంపిణీపై ఎన్నికల సంఘం దృష్టి మళ్లించేందుకు అభ్యర్థులు కొత్త ఎత్తులు వేస్తున్నారు. -
దుర్గంచెరువు పూడ్చివేతపై ఫిర్యాదు
[ 11-05-2024]
మాదాపూర్లోని దుర్గంచెరువు ఎఫ్టీఎల్ను ఫూడ్చివేసిన ప్రాంత్రాన్ని శుక్రవారం ఇరిగేషన్ శాఖ అధికారులు పరిశీలించారు. -
జనం డబ్బుతో సినిమా నిర్మాణం
[ 11-05-2024]
చిట్టీల వ్యాపారంతో ప్రజల వద్ద రూ.కోట్లు వసూలు చేసిన దంపతులు ఆ సొమ్ముతో ఓ సినిమాను నిర్మించారు. -
ఈత కొలనులో మునిగి అయిదేళ్ల చిన్నారి దుర్మరణం
[ 11-05-2024]
వేసవి శిబిరం ఓ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్