logo

భువనేశ్వర్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన

తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పర్యటిస్తున్నారు.

Published : 28 Apr 2024 14:55 IST

భువనేశ్వర్‌: తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో పర్యటిస్తున్నారు. అక్కడి పీసీసీ కార్యాలయంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్‌  నేతలు, సోషల్‌ మీడియా విభాగం కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నేతలకు దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కటక్‌లో పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి ఏర్పాట్లనూ భట్టి విక్రమార్క పర్యవేక్షిస్తున్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని