రసవత్తరం..చేవెళ్ల పోరు
చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది.
తొలి గెలుపు కాంగ్రెస్దే
రెండుసార్లు గెలిచిన భారాస
బోణీ కొట్టాలని భాజపా
న్యూస్టుడే, తాండూరు, వికారాబాద్: చేవెళ్ల లోక్సభ ఎన్నికలు ప్రతిసారీ రసవత్తరంగా సాగుతాయి. ముఖ్యంగా మూడు ప్రధాన పార్టీల మధ్య మాత్రమే పోటీ నెలకొంటుంది. 2008లో దేశవ్యాప్తంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2009 లో చేవెళ్ల లోక్ సభ ఏర్పాటైంది. అప్పట్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎస్.జైపాల్రెడ్డి, తెదేపా నుంచి జితేందర్రెడ్డి, భాజపా నుంచి బద్దం బాల్రెడ్డి పోటీ చేశారు. పోటీ మాత్రం కాంగ్రెస్, తెదేపాల మధ్యనే జరిగింది. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 38.78 శాతంతో 4,20,807 ఓట్లు సాధించింది. తెదేపా 37.08 శాతంతో 4,02, 275 ఓట్లను సాధించింది. భాజపా కేవలం 10.39 శాతంతో 1,12,701 ఓట్లు మాత్రమే సాధించింది. కాంగ్రెస్ పార్టీ తెదేపాపై 18,532 ఓట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ ఎన్నికలు హోరాహోరీ
ప్రస్తుత లోక్సభ ఎన్నికలు హోరాహోరీగా మారుతున్నాయి. భాజపా, కాంగ్రెస్, భారాస అభ్యర్థులు ముగ్గురూ గెలపునకు చెమటోడుస్తున్నారు. భారాస మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలని చూస్తోంది. ఆ పార్టీ తరపున కాసాని జ్ఞానేశ్వర్ అభ్యర్థిగా తొలిసారి బరిలో దిగారు. జిల్లాలోని తాండూరు, వికారాబాద్, పరిగి మాజీ ఎమ్మెల్యేలు రోహిత్రెడ్డి, డాక్టర్ ఆనంద్కుమార్, కొప్పుల మహేష్రెడ్డి తమ అభ్యర్థి విజయానికి కృషి చేస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతూ మద్దతు కూడగడుతున్నారు.
తొలి విజయం కోసం...
ఈ ఎన్నికల్లో గెలుపొంది బోణీ కొట్టాలని భాజపా చూస్తోంది. 2009, 2019 ఎన్నికల్లో పోటీ చేసినా ఫలితం దక్కలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాజపా గెలుపుపై కోటి ఆశలు పెట్టుకుంది. పార్టీ తరపున కొండావిశ్వేశర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. చేవెళ్లపై ప్రత్యేక మ్యానిఫెస్టో తెచ్చారు.
తెరాస (భారాస) ఆరంభం.. అదిరింది
2014 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసింది. తొలిసారిగా రంగంలోకి దిగిన తెరాస అనూహ్య విజయం సాధించింది. పార్టీ తరపున పోటీ చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి 33.06 శాతంతో 4,35,077 ఓట్లు సాధించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పట్లోళ్ల కార్తీక్ రెడ్డి పోటీ చేశారు. 27.53 శాతంతో 3,62,054 ఓట్లు సాధించారు. తెరాస కాంగ్రెస్పై 73,023 ఓట్ల తేడాతో విజయం సాధించింది. తెదేపా నుంచి పోటీ చేసిన తూళ్ల వీరేందర్గౌడ్కు 26.34 శాతంతో 3,53,203 ఓట్లు వచ్చాయి. ఈఎన్నికల్లో భాజపా పోటీ చేయకుండా తెదేపాకు మద్దతు ఇచ్చింది.
- 2019 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించలేదు. కొండా విశ్వేశ్వర్ రెడ్డే 2019లో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. తెరాస నుంచి రంజిత్రెడ్డి, భాజపా నుంచి బి.జనార్దన్రెడ్డి బరిలోకి దిగారు. తెరాస అభ్యర్థి విజయం సాధించారు.
గ్రామాల్లో తిరుగుతూ.. మద్దతు కూడగడుతూ
భారాస సిట్టింగ్ ఎంపీ రంజిత్రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఆయన విజయాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న తాండూరు, పరిగి ఎమ్మెల్యేలు మనోహర్రెడ్డి, రామ్మోహన్రెడ్డి సభలు, సమావేశాలు నిర్వహించి ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.ఎమ్మెల్యే టీఆర్ఆర్ తన నియోజకవర్గ పరిధి గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతూ కాంగ్రెస్ గెలవాల్సిన అవసరాన్ని వివరిసున్నారు. మండలాల వారీగా కార్యకర్తలు, మండలస్థాయి నేతలను పార్టీలో చేర్చుకుంటున్నారు. ఇక బుయ్యని అభ్యర్థి రంజిత్రెడ్డితో కలిసి సమన్వయ ప్రచారం చేస్తున్నారు. వికారాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న శాసన సభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రంజిత్ రెడ్డి గెలుపునకు తనవంతు కృషి చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రయాణికులతో కిక్కిరిసిన హైదరాబాద్ మెట్రో
[ 14-05-2024]
హైదరాబాద్ మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. -
సర్వశక్తులొడ్డారు.. సగానికి పైగా కదిలారు
[ 14-05-2024]
రాజధాని ఓటర్లు సోమవారం పోలింగ్కు కదిలొచ్చారు. గత లోక్సభ ఎన్నికల కంటే ఈ సారి కొంత మెరుగ్గానే ఓటింగ్ నమోదైంది. రాష్ట్రంలోని మిగిలిన లోక్సభ నియోజకవర్గాల్లో 60 శాతం జరిగింది. రాజధాని ఓటింగ్లో చివరి వరుసలో నిలిచింది. -
కంటోన్మెంట్లో పెరిగిన ఓటింగ్
[ 14-05-2024]
రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లు లోక్సభకు మాత్రమే ఓటు వేయగా.. కంటోన్మెంట్ అసెంబ్లీ పరిధిలోని ఓటర్లు మాత్రం రెండు ఓట్లు వినియోగించుకున్నారు. ఇక్కడ భారాస ఎమ్మెల్యే లాస్యనందిత అకాల మరణంతో సోమవారం ఉప ఎన్నిక జరిగింది. -
పోలింగ్ సమయం పెంచాలని అసదుద్దీన్ నిరసన
[ 14-05-2024]
చాంద్రాయణగుట్ట సెయింట్ ఆన్స్ గ్రామర్ హైస్కూల్లోని బూత్-88లో పలుమార్లు ఈవీఎంలు మొరాయించాయని మజ్లిస్ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓటింగ్ సమయానికి విఘాతం కలిగినందున సమయం పెంచాలని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసు నీడలో పోలింగ్
[ 14-05-2024]
ఎక్కడికక్కడ సాయుధ బలగాల మోహరింపు.. పోలీసు పహారా నడుమ నగరంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చిన్నపాటి ఘర్షణలు.. ఆందోళనలు మినహా ఎక్కడా ఉద్రిక్తతలు నమోదవ్వలేదు. -
మొరాయించిన ఈవీఎంలు ఓటరుకు తప్పని తిప్పలు
[ 14-05-2024]
ఉదయాన్నే ఓటేయడానికి ఆసక్తి చూపినా పలుచోట్ల ఈవీఎంల మొరాయింపులతో ఓటర్లకు ప్రయాసలు తప్పలేదు. కుత్బుల్లాపూర్ సుభాష్చంద్రబోస్నగర్ 313 పోలింగ్ కేంద్రంలో ఈవీఎం గంటన్నర పాటు మొరాయించింది. -
అధికారుల తీరుపై మండిపడ్డ మాధవీలత
[ 14-05-2024]
చాంద్రాయణగుట్టలోని సెంట్ ఆన్స్ గ్రామర్ హైస్కూల్లోని పోలింగ్ బూత్లను భాజపా అభ్యర్థి కొంపెల్ల మాధవీలత సందర్శించారు. ఓ బూత్లో ఈవీఎంలు వరుస క్రమంలో లేవని అభ్యంతరం చెప్పి వాటిని సక్రమంగా మార్పించారు. -
పోలింగ్ కేంద్రంలో సెల్ఫీ దిగిన ఏజెంట్పై కేసు
[ 14-05-2024]
ఎన్నికల ప్రవర్తనా నియమావళి నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలతో సెల్ఫీ దిగిన ఓ ఏజెంట్పై శంషాబాద్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. తొండుపల్లిలోని 460 పోలింగ్ స్టేషన్లో ఉదయం 5.45 గంటలకు మాక్ పోలింగ్ నిర్వహించారు. -
వెతల మధ్య ఓటింగ్
[ 14-05-2024]
రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల్లోని పలు పోలింగ్ కేంద్రాల్లో సౌకర్యాలు లేక అధికారులు అవస్థపడ్డారు. ఖైరతాబాద్ వెంకటరమణ కాలనీలోని ఓ పాఠశాల నిర్వాహకులు మరుగుదొడ్లకు తాళం వేశారు. -
ఠాణా ఎదుట కంటోన్మెంట్ భాజపా అభ్యర్థి నిరసన
[ 14-05-2024]
కాంగ్రెస్ కార్యకర్తలు డబ్బు సంచులతో వెళ్తున్నారని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ కంటోన్మెంట్ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి డా.టి.ఎన్.వంశ తిలక్ సోమవారం బేగంపేట ఠాణా ఎదుట నిరసనకు దిగారు. -
ఓటు వేసి మృత్యుఒడికి..
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రానికి వచ్చి బాధ్యతగా ఓటు వేశాక గుండెపోటుతో ఓ వృద్ధురాలు మృతిచెందింది. ఘటన ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఓల్డ్ భరత్నగర్ సామాజిక భవనంలోని 349 బూత్లో జరిగింది. -
సిబ్బంది వైఫల్యం.. ఓటర్లకు గందరగోళం
[ 14-05-2024]
ఓటర్లకు పోలింగ్ చీటీలు పంచడంలో అధికార యంత్రాంగం మరోసారి ఘోరంగా విఫలమైంది. తూతూమంత్రంగా కొన్నిచోట్ల పంచి మమ అన్పించారు. ఓ ప్రధాన పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ తిరిగి చీటీలు పంచారు. -
పోలింగ్ స్టేషన్ లేదని గిరిజనుల ధర్నా
[ 14-05-2024]
తమకు ప్రత్యేక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయలేదంటూ రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం కొడిచెర్ల పంచాయతీ తండా వాసులు రహదారిపై ధర్నా నిర్వహించారు. -
తొలిఓటు సంబరం
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్లో 18ఏళ్లు నిండిన ఓటర్లు తొలిసారిగా వారి ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలకు వారి తల్లిదండ్రులు, స్నేహితులతో కలిసి ఉత్సాహంగా వచ్చారు. సెలవు రోజని బద్ధకించకుండా ఉదయం ఏడు, ఎనిమిది గంటలకే ఓటరు గుర్తింపుకార్డు, ఆధార్ కార్డులతో పోలింగ్ కేంద్రాలకు వచ్చారు. -
బారులుదీరిన బస్తీవాసులు
[ 14-05-2024]
బస్తీ ఓటర్లపై అభ్యర్థులు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాలేదు. ఆయా నియోజకవర్గాల్లోని బస్తీవాసులు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులుదీరారు. కుటుంబ సభ్యులు, చంటి పిల్లలతో సహా క్యూలో నిలుచుని ఓటు హక్కును వినియోగించుకున్నారు. -
బుల్లెట్ బండి పేలుడు ఘటనలో..
[ 14-05-2024]
బుల్లెట్ బండి ట్యాంకు పేలిన ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందిన ఘటన పాతబస్తీ భవానీనగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. -
నిర్మానుష్యంగా రహదారులు
[ 14-05-2024]
నిత్యం లక్షలాది వాహనాలతో ప్రయాణించే జూబ్లీహిల్స్ రహదారులన్నీ నిర్మానుష్యమయ్యాయి. వరుస సెలవులు.. ఏపీ, తెలంగాణాల్లో ఎన్నికలు కావడంతో చాలా మంది తమ సొంతూర్లకు వెళ్లారు. -
ప్రలోభాలు.. పంపకాలకు దూరం
[ 14-05-2024]
మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని అగర్మియాగూడలో స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని అన్ని పార్టీల ప్రతినిధులు ఒక రోజు ముందే తీర్మానం చేసుకున్నారు. -
పార్టీ గుర్తులతో ఓటరు స్లిప్పులు!
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రాలకు ఓటరు ఐడీ కార్డులతో వచ్చిన ప్రజలు అక్కడే ఉన్న పార్టీల నాయకుల వద్ద సిప్పులు తీసుకున్నారు. ఈసారి పార్టీలు మొబైల్ ప్రింటర్ సహాయంతో వారికి సంబంధించిన ఓటర్ స్లిప్పులు ఇచ్చాయి హిమాయత్నగర్లోని ఓ కేంద్రం వద్ద ఇలా ఇచ్చిన స్లిప్పులపై పార్టీ గుర్తు, అభ్యర్థుల చిత్రాలు ఉన్నాయి. -
ఆమెను చంపేశారు.. ఈమెను బతికించారు
[ 14-05-2024]
బతికున్నవారిని చంపేశారు.. చనిపోయిన వారిని బతికించారు.. ఒకరికి రెండు పోలింగ్బూత్లలో ఓట్లున్నాయి.. సాంకేతికంగా ఎంత ప్రగతి సాధించినా జాబితాలో ఇలాంటి తప్పులు జరుగుతూనే ఉన్నాయి. -
ఏపీ.. ఎన్నికలపై ఆసక్తి!
[ 14-05-2024]
పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది నగరవాసుల్లో ప్రధానంగా ఆ రాష్ట్ర మూలాలున్న వారిలో ఉత్కంఠగా మారింది. -
నడవలేకుంటే చక్రాల కుర్చీలు
[ 14-05-2024]
నగర వ్యాప్తంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. చాలా కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బంది లేకుండా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు సైతం ఓపికతో వచ్చి ఓటు వేయడం కనిపించింది. -
సార్వత్రికం.. సర్వత్రా ప్రశాంతం
[ 14-05-2024]
చేవెళ్ల పరిధిలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా ముగిసింది. కొత్తగా ఓటుపొందిన యువతీ, యువకులు, గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, వృద్ధులు ఓటేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చారు. -
సీఎం ఎన్నికల నిబంధనలు అతిక్రమించారు: అరుణ
[ 14-05-2024]
ఎన్నికలు జరుగుతున్న సమయంలో ప్రెస్మీట్లు పెట్టడం ఎన్నికల నిబంధనలకు విరుద్ధమని భాజపా పాలమూరు లోక్సభ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. సోమవారం నియోజక వర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వచ్చిన ఆమె విలేకరులతో చిట్చాట్గా మాట్లాడారు. -
పెరిగిన పోలింగ్ శాతం
[ 14-05-2024]
పార్లమెంట్ ఎన్నికలంటే మనకెందుకులే అనుకోకుండా ఈసారి ఓటుహక్కు వినియోగానికి జిల్లా ఓటర్లు ముందుకొచ్చారు. ఈ కారణంగానే గత పార్లమెంట్ (2019) ఎన్నికల్లో జిల్లాలో 62.57 శాతం ఓటింగ్ నమోదైతే.. ఈసారి 68.02గా నమోదై అందరి దృష్టిని ఆకర్షించింది. -
స్ట్రాంగ్ రూమ్లకు చేరిన ఈవీఎంలు
[ 14-05-2024]
జిల్లాలో లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగియడంతో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు.
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్తో డీల్.. భారత్కు అమెరికా వార్నింగ్..!
-
వారణాసితో నా బంధం విడదీయలేనిది: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ప్రధాని మోదీ
-
కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు ‘మహా’తలపోటు
-
ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలివే.. ఇటు ఫన్.. అటు థ్రిల్
-
స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 21,125
-
100 రోజులు.. 200 విమానాలు.. ఏ వ్యాపారవేత్తో అనుకుంటే పొరపాటే!