logo

‘కాంగ్రెస్‌ వైపే బలహీన వర్గాలు’

దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్‌కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్‌ జి.చెన్నయ్య పేర్కొన్నారు.

Published : 03 May 2024 03:46 IST

అభివాదం చేస్తున్న ఐకాస ఛైర్మన్‌ చెన్నయ్య, నాయకులు

ఖైరతాబాద్‌, న్యూస్‌టుడే: దళితుల అభ్యున్నతి, సాధికారతకు కృషి చేస్తున్న కాంగ్రెస్‌కు తమ మద్దతు ఉంటుందని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, మాల ప్రజా సంఘాల ఐకాస ఛైర్మన్‌ జి.చెన్నయ్య పేర్కొన్నారు. గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. గతంలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం తెచ్చి చట్టబద్ధత కల్పించడం, ఆహార భద్రత చట్టం, భూపంపిణీ, బ్యాంకుల జాతీయకరణ, పబ్లిక్‌ రంగ సంస్థల ఏర్పాటు వంటి వాటితో దళిత, గిరిజన, బలహీన వర్గాల అభివృద్ధికి పాటుపడింది కాంగ్రెసేనన్నారు. భాజపా కేవలం కార్పొరేట్‌ సంస్థలకు కొమ్ముకాస్తూ దేశ సంపదను దోచిపెడుతోందని విమర్శించారు. ఐకాస కార్యనిర్వాహక ఛైర్మన్లు బూర్గుల వెంకటేశ్వర్లు, గోపోజు రమేష్‌, మన్నె శ్రీధర్‌రావు, మాల మహానాడు గ్రేటర్‌ అధ్యక్షుడు బైండ్ల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని