logo

తెరాస గ్రామశాఖ అధ్యక్షుడి హత్య

పాతకక్షలతో తెరాస గ్రామశాఖ అధ్యక్షుడిపై ఇంటి పక్కనే నివాసం ఉండే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి.

Published : 15 Jan 2022 04:07 IST

లస్మయ్య

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: పాతకక్షలతో తెరాస గ్రామశాఖ అధ్యక్షుడిపై ఇంటి పక్కనే నివాసం ఉండే వ్యక్తి కత్తితో దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలంలోని రాఘవపేట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన మామిడి లస్మయ్య(47) ఇంటి పక్కనే నివాసం ఉండే దాసరి వినోద్‌కు మధ్య మూడేళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఇరువురు పాత కక్షలతో పరస్పరం దూషించుకుంటున్న తరుణంలో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో లస్మయ్యను వినోద్‌ కత్తితో పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని చికిత్స నిమిత్తం మెట్‌పల్లికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించగా, హత్యకు పాల్పడ్డ దాసరి వినోద్‌ గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న మెట్‌పల్లి సీఐ శ్రీను, మల్లాపూర్‌ ఎస్సై నవీన్‌కుమార్‌ వివరాలు సేకరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని