logo

ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి

రామడుగు మండలం వెదిరలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వంచ తిరుపతిరెడ్డి(50) మృతి చెందినట్టు ఎస్సై తాండ్ర వివేక్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... శనివారం మధ్యాహ్నం వెదిరలో వంచ తిరుపతిరెడ్డి బైక్‌పై రోడ్డు

Published : 23 Jan 2022 02:25 IST

రామడుగు, న్యూస్‌టుడే: రామడుగు మండలం వెదిరలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో వంచ తిరుపతిరెడ్డి(50) మృతి చెందినట్టు ఎస్సై తాండ్ర వివేక్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... శనివారం మధ్యాహ్నం వెదిరలో వంచ తిరుపతిరెడ్డి బైక్‌పై రోడ్డు దాటేందుకు బయలుదేరాడు. అదే సమయంలో వచ్చిన ఆర్టీసీబస్సు ఢీకొట్టింది. తిరుపతిరెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని