ఆత్మరక్షణ.. తైక్వాండో శిక్షణ
ఆత్మరక్షణకు తైక్వాండో ఆయుధంలాంటిది.. నేటి పరిస్థితుల్లో చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందాలని చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆలోచనలు చేస్తున్నారు. పట్టణంలోని గీతావిద్యాలయంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ
ఉత్సాహంగా చిన్నారుల సాధన
తైక్వాండో సాధన చేస్తున్న చిన్నారులు
చొప్పదండి, న్యూస్టుడే: ఆత్మరక్షణకు తైక్వాండో ఆయుధంలాంటిది.. నేటి పరిస్థితుల్లో చదువుతోపాటు అన్ని రంగాల్లో ప్రావీణ్యం పొందాలని చిన్నారులు వారి తల్లిదండ్రులు ఆలోచనలు చేస్తున్నారు. పట్టణంలోని గీతావిద్యాలయంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తైక్వాండో ఉచిత శిక్షణకు వంద మందికి పైగా చిన్నారులు నిత్యం హాజరవుతూ మెలకువలు నేర్చుకుంటున్నారు. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం నాలుగు గంటల పాటు శిక్షణ పొందుతున్నారు.
పోటీల్లో పాల్గొంటూ..
జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ ఏటా ఉచితంగా తైక్వాండో శిక్షణను నిర్వహిస్తుండటంతో చిన్నారులు ఆసక్తిగా నేర్చుకుంటున్నారు. ఈ వేసవి శిబిరంలో నేర్చుకున్న మెలకువలతోనే సరిపెట్టకుండా దానిని మరింత రాటుదేలే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. పాఠశాలల్లో చదువును కొనసాగిస్తూ తైక్వాండోలో శిక్షణ పొందుతున్నారు. పాఠశాల స్థాయిలో జరిగే పోటీలతో పాటు రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటూ పతకాలు కైవసం చేసుకుంటున్నారు.
అందరికి ఉపయుక్తంగా ఉంది
- సాధన, ఆరోతరగతి
తైక్వాండో శిక్షణ నాలాంటి చిన్నారులందరికీ ఎంతో ఉపయుక్తంగా ఉంది. ఆత్మరక్షణ మెలకువలు చెబుతుండటంతో క్రమం తప్పకుండా సాధన చేస్తున్నాను. ఎంతో ఉత్సాహంగా పాల్గొంటున్నాను. ఈ శిబిరంలో నేర్చుకున్న అంశాలతోనే సరిపెట్టకుండా జాతీయస్థాయిలో పతకాలు సాధించాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నాను.
శారీరకంగా పటిష్ఠంగా తయారవుతున్నాం
- జయశ్రీ, ఐదోతరగతి
ప్రతీరోజు తైక్వాండో శిక్షణ పొందుతుండటంతో ఆత్మవిశ్వాసం కలుగుతుంది. ఈ శిక్షణతో వేసవి సెలవుల సద్వినియోగంతో పాటు జీవితంలో ఏదైనా సాధించవచ్చనే నమ్మకం ఏర్పడుతుంది. నైపుణ్యాలు పొంది ఉత్తమ ప్రదర్శన చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాను.
ఆరేళ్లుగా ఇస్తున్నాం
- లహరి, శిక్షకురాలు
గత ఆరేళ్లుగా పట్టణంలో జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తైక్వాండో శిక్షణను ఇస్తున్నాం. చిన్నారులు ఆసక్తితో శిక్షణ పొందుతుండటంతో ఎంతో ఆనందంగా ఉంది. చాలామంది చిన్నారులు ప్రతి ఏటా రాష్ట్ర, జాతీయస్థాయిల్లో పతకాలు సాధిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇదిగిదిగో నవ లోకం
[ 11-05-2024]
ఉమ్మడి జిల్లాలో యువ రక్తం ఉరకలేస్తోంది.. ఆకాశమే హద్దంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. యువ ఓటర్లు దేశ భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. -
గులాబీ శ్రేణుల్లో జోష్
[ 11-05-2024]
సిరిసిల్ల పట్టణంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
గడప గడపకు కార్యకర్తలు
[ 11-05-2024]
ప్రధాన పార్టీల ముఖ్య నేతల ప్రచారాలు ముగిశాయి.. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.. పోలింగ్కు మధ్యలో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.. -
దూరమైనా తప్పక ఓటేస్తాం!
[ 11-05-2024]
ఇప్పటికీ అనేక అనుబంధ గ్రామాలకు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయి. 200 మంది ఓటర్లకుపైగా ఉన్నా.. రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లాల్సి వస్తోంది. -
రూ.20.93 లక్షల నగదు పట్టివేత
[ 11-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.20.93 లక్షల నగదును పట్టుకొని, సీజ్ చేసి ఎన్నికల పరిశీలన అధికారులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 11-05-2024]
వ్యవసాయ బావిలో పడి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్ పట్టణ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. -
కొట్లాడి అలసిపోయా
[ 11-05-2024]
అందుబాటులో ఉండి సేవలందించినా ఓడగొట్టారు, ఎన్నికల్లో కొట్లాడి కొట్లాడి అలసిపోయా ఇక ఓపిక లేదంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి సాగు నీరందిస్తాం
[ 11-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి సమస్య పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి, కాలువ చివరి ఆయకట్టు వరకు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 11-05-2024]
రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా దగా చేసిన కాంగ్రెస్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ పేర్కొన్నారు. -
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
ప్రజలకు ఉచిత హామీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని, భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ అన్నారు. -
కోల్బెల్టు కేంద్రంగా అభ్యర్థుల వ్యూహాలు
[ 11-05-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి కోల్బెల్టు ప్రాంతాలు ప్రచార కేంద్రాలుగా మారాయి. అభ్యర్థులు తమ వ్యూహాలను ఇక్కడి నుంచే రచిస్తున్నారు. -
గెలుపే ఎజెండా.. కునుకు లేకుండా..
[ 11-05-2024]
ప్రచారం చివరి రోజుకు వచ్చేసింది.. సభలు.. సమావేశాలు.. చేరికలతో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు.. ముఖ్య నాయకులకు కంటిమీద కునుకు కరవైంది..
తాజా వార్తలు (Latest News)
-
జగన్ సభకు ప్రైవేట్ వాహనాల స్వాధీనం!
-
కేపీహెచ్బీలో గొలుసు దొంగ.. సాఫ్ట్వేర్ ఉద్యోగి
-
అమరావతి వద్దన్న నాని కావాలా..రాజధాని నిర్మించే తెదేపా కావాలా?
-
ఓటేసేందుకు తరలివస్తున్నారు.. గన్నవరం విమానాశ్రయంలో పెరిగిన రద్దీ
-
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం