ఉమ్మడి జిల్లాలో రూ.650 కోట్లు
రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి విడుదల చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తొలిరోజు ఎకరం వరకు భూమి గల రైతులకు నిధులను విడుదల చేసి ప్రతిరోజు ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతారు
ఈ నెల 28 నుంచి రైతుబంధు నగదు బదిలీ
జగిత్యాల వ్యవసాయం, న్యూస్టుడే: రైతుబంధు పథకం ద్వారా పెట్టుబడి సాయాన్ని ఈ నెల 28 నుంచి విడుదల చేయనున్నట్లు రాష్ట్రప్రభుత్వం బుధవారం ప్రకటించింది. తొలిరోజు ఎకరం వరకు భూమి గల రైతులకు నిధులను విడుదల చేసి ప్రతిరోజు ఎకరం చొప్పున పెంచుకుంటూ పోతారు. గత సీజన్లలో రికార్డుల్లో సాగుభూమిగా నమోదై ఉన్న మొత్తానికి నిధులను ఇవ్వగా ఈ సీజన్లో వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న భూమిని గుర్తించగా పథకం నుంచి మినహాయించే అవకాశముంది. ఇదే తరుణంలో భూ మార్పిడికి గడువు విధింపు, గత కొన్ని సీజన్ల మాదిరిగా భూ పరిమితి విధించకుండా అందరికీ పెట్టుబడి సాయం అందుతుందని అన్నదాతలు ఆశిస్తున్నారు. 2018లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించగా తొలుత ఎకరాకు రూ.4 వేల చొప్పున ఇచ్చారు. ప్రస్తుతం ఎకరాకు రూ.5 వేల చొప్పున రెండు వానాకాలం, యాసంగిలకు నిధులను అందిస్తున్నారు. 2019 యాసంగిలో కేవలం 5 ఎకరాల వరకు భూమికలిగిన వారికే నిధులను ఇవ్వగా అంతకుముందు, ఆ తరువాతి సీజన్లలో ఎలాంటి భూపరిమితి విధించకుండా రైతులందరికీ నిధులిచ్చారు. ఈ వానాకాలంలోనూ ఎలాంటి పరిమితి విధించవద్దని కర్షకులు కోరుతున్నారు.
గడిచిన పంటకాలాల మాదిరిగా ఈ పంటకాలంలోనూ ప్రభుత్వం వద్ద వివరాలు సక్రమంగా ఉన్నవారికే నిధులందే అవకాశముంది. గత పంటకాలాల్లో ఉమ్మడి జిల్లాలో దాదాపుగా 43 వేల మందికిపైగా రైతులకు రూ.10 కోట్లకుపైగా రైతుబంధు పథకం నిధులందలేదు. వ్యవసాయాధికారులకు పట్టాదారుల వివరాలు లభ్యం కాకపోవటం, కొందరు ఇతర ప్రాంతాల్లో ఉండటం, బ్యాంకు ఖాతాల నెంబర్లు తప్పుగా ఉండటం, బ్యాంకుల వివరాల్లేకపోవటం, రెవెన్యూ రికార్డులు సరిగా లేకపోవటం, నగదు ట్రాన్స్ఫర్ గాకపోవటం తదితర కారణాలతో గతంలో వీరికి నిధులందలేదు. నూతన రైతుల నమోదు, పాతవారి వివరాల్లోని పొరపాట్లను సరిదిద్దటం తదితరాలకు ప్రస్తుతం అవకాశం కల్పిస్తే లబ్ధిదారుల సంఖ్య పెరిగి రూ.650 కోట్ల నుంచి రూ.660 కోట్లవరకు పెట్టుబడిసాయం రైతులకు అందే అవకాశముంటుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్!
[ 02-05-2024]
నిత్యం ప్రజల మధ్య ఉండే జీవన్రెడ్డిని ఎంపీగా గెలిపించాలని.. ఈ ప్రాంత అభివృద్ధికి అవసరమైన నిధులు వస్తాయని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
హస్తాన్ని నమ్మొద్దు.. కమలం మాయలో పడొద్దు
[ 02-05-2024]
కాంగ్రెస్ను నమ్మొద్దని, భాజపా మాయలో పడొద్దని కరీంనగర్ భారాస ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. -
ఆ పార్టీలకు డిపాజిట్లు రావు
[ 02-05-2024]
కరీంనగర్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్, భారాసలకు డిపాజిట్లు కూడా రావని, రెండో స్థానం కోసం పోటీ పడుతున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. -
నేటి కేసీఆర్ బస్సు యాత్ర రద్దు
[ 02-05-2024]
భారాస అధినేత కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారంలో పాల్గొనకుండా ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో గురు, శుక్రవారాల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగాల్సిన బస్సు యాత్రపై ప్రభావం పడింది. -
సమష్టి కృషితో స్వయం ప్రతిపత్తి
[ 02-05-2024]
కరీంనగర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా దక్కింది. ప్రస్తుతం కరీంనగర్లో ఎస్సారార్ డిగ్రీ కళాశాలకు మాత్రమే ఆ హోదా ఉంది. -
కార్మక క్షేత్రం.. తీర్పు విలక్షణం
[ 02-05-2024]
కార్మిక క్షేత్రమైన పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గం.. ఆది నుంచి ప్రజా తీర్పులో ప్రత్యేకత చాటుకుంటోంది. ఇక్కడి ఓటర్లు ప్రతి పార్టీకి వరుసగా రెండు సార్లు అధికారమిస్తూ, తర్వాత కొత్త వారికి అవకాశమిస్తున్నారు. -
కీలక సంస్కరణల వెనుక..
[ 02-05-2024]
‘పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్’ కేసుకు సంబంధించి 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు ‘నోటా’ను ప్రవేశపెట్టారు. వ్యక్తి భావ ప్రకటనా స్వేచ్ఛలో ‘నోటా’ భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. -
పురపాలికలకు ముందస్తుగాకాసుల జమ
[ 02-05-2024]
నగర, పురపాలికల్లో ఆస్తిపన్ను ఎర్లీబర్డ్ పథకం ద్వారా ముందస్తుగానే కాసుల గలగల కనిపించింది. గత నెల 1 నుంచి 30 వరకు పట్టణాలు, నగరాల్లో ఉన్న పన్ను చెల్లింపుదారులకు అయిదు శాతం రాయితీ ఇచ్చారు. -
రెండేళ్లలో ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు
[ 02-05-2024]
ఓ యువకుడు రెండేళ్లలో ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఆదర్శంగా నిలిచాడు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూర్కు చెందిన బెత్తపు -
మామ చేతిలో కోడలి హతం
[ 02-05-2024]
కుటుంబ పరువు కోసం కోడలి గొంతుకోసి మామ హత్య చేశాడు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలంలోని రేచపల్లి శివారులోని కొత్తపల్లి తండాలో బుధవారం చోటుచేసుకుంది. -
ఇంటింటికీ ఓటరు చీటీలు
[ 02-05-2024]
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సమాయత్తమవుతోంది. పోలింగ్ శాతం పెంచడంతో పాటు ఓటర్లు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేలా సర్వం సిద్ధం చేస్తున్నారు. -
ఓటుకు.. తప్పని దూరాభారం
[ 02-05-2024]
ప్రతి ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేస్తున్నా.. పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉండడంతో తండావాసులకు ఇబ్బందిగా మారుతోంది.. -
కాంగ్రెస్కు భయపడే మోదీని తీసుకొస్తున్నారు
[ 02-05-2024]
రాష్ట్రంలో కాంగ్రెస్ పట్ల ప్రజలు ఆకర్షితులవుతున్నారని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఎదుర్కోవడానికి -
ఇరవై శాఖలతో.. అభ్యర్థుల ప్రచారంపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ప్రచారాలకు పదునుపెడుతున్నారు. -
భానుడి ప్రతాపం.. కార్మికుల బేజారు
[ 02-05-2024]
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. భానుడి ప్రతాపంతో ఉపరితల గనుల్లో బొగ్గు ఉత్పత్తకి విఘాతం ఏర్పడుతోంది. -
మేమే వస్తాం.. ఓటు అభ్యర్థిస్తాం
[ 02-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారం ఊపందుకోవడంతో అంతటా రాజకీయం వేడెక్కింది. మరోవైపు ఎండ 45 డిగ్రీలకు చేరువవుతుండటంతో ఉదయం 9 గంటలకే గడప దాటలేనంతగా మండుతోంది. -
అయిదేళ్లు.. పెరిగిన ఓటర్లు 41,930
[ 02-05-2024]
జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 4,66,836 మంది ఓటర్లు ఉన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి