logo

Telangana news: కుమార్తె సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య

వివాహిత క్షణికావేశం ఇద్దరి మృతికి కారణమైంది. కుటుంబ కలహాలతో కుమార్తె సహా తల్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది.

Updated : 26 Dec 2023 08:30 IST

చిగురుమామిడి, న్యూస్‌టుడే: వివాహిత క్షణికావేశం ఇద్దరి మృతికి కారణమైంది. కుటుంబ కలహాలతో కుమార్తె సహా తల్లి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చిగురుమామిడి మండలం రామంచ గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గగన్‌, అంజలి (30) దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె తనుశ్రీ (5) సంతానం. కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన అంజలి.. సోమవారం ఉదయం కుమార్తెతో కలిసి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతుక్కుంటూ వెళ్లగా ఊరు చివరలో ఉన్న వ్యవసాయ బావిలో తల్లీకుమార్తెల మృతదేహాలు కనిపించాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు చేరుకొని మృతదేహాలను బయటకు తీసి శవపరీక్షకు పంపించారు. కుటుంబ కలహాలతో తన కుమార్తె బిడ్డతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు అంజలి తల్లి ఓదవ్వ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజేశ్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని