బాలింత మృతి.. ముగ్గురు వైద్యులపై కేసు
వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా ముగ్గురు వైద్యులపై కేసు నమోదైంది. బాధిత కుటుంబీకులు, ఎస్సై ఎస్.రాజేశ్ కథనం ప్రకారం..
మానస
జమ్మికుంట, న్యూస్టుడే : వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాధిత కుటుంబసభ్యులు ఆందోళనకు దిగగా ముగ్గురు వైద్యులపై కేసు నమోదైంది. బాధిత కుటుంబీకులు, ఎస్సై ఎస్.రాజేశ్ కథనం ప్రకారం.. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామానికి చెందిన మానస (24)ను రెండో ప్రసవానికి జమ్మికుంటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. మంగళవారం సిజేరియన్ చేయగా మగ శిశువు జన్మించాడు. అనంతరం ఆమెకు బీపీ తగ్గిందని వైద్యులు చెప్పడంతో వరంగల్లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు పరిశీలించి ఆలస్యంగా తీసుకొచ్చారని, పరిస్థితి విషమించిందని హైదరాబాద్కు తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్కు తీసుకెళ్తుండగా మంగళవారం అర్ధరాత్రి మానస మృతి చెందింది. మృతదేహాన్ని జమ్మికుంట ప్రైవేట్ ఆసుపత్రి వద్దకు తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. హుజూరాబాద్ గ్రామీణ సీఐ సంతోష్, జమ్మికుంట గ్రామీణ సీఐ కిషోర్, జమ్మికుంట, వీణవంక ఎస్సైలు రాజేశ్, వంశీకృష్ణ ఆసుపత్రి వద్దకు చేరుకొని బాధితులకు సర్ది చెప్పారు. ఆసుపత్రి వైద్యులు రాణి, రాము, అనస్తీషియా వైద్యుడు సుధాకర్రావు నిర్లక్ష్యం, సిజేరియన్ వికటించటమే తన భార్య మానస మృతికి కారణమని ఆమె భర్త శ్రీకాంత్ చేసిన ఫిర్యాదుతో ముగ్గురు వైద్యులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. మానసకు సిజేరియన్ అనంతరం గుండె సంబంధిత సమస్యలు వచ్చాయని, దీంతో బీపీ తగ్గిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. తమ నిర్లక్ష్యమేమీ లేదన్నారు. వరంగల్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకొని అక్కడి నుంచి మెరుగైన వైద్యానికి హైదరాబాద్కు తరలిస్తుండగా మృతి చెందితే ఇక్కడికి వచ్చి ఆందోళన చేశారని, డబ్బులు డిమాండ్ చేశారని వైద్యులు రాము, శ్రీనివాస్లు బుధవారం ఫిర్యాదు చేశారని ఎస్సై రాజేశ్ తెలిపారు. విచారణ చేస్తున్నామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నాయకుడికి తీవ్ర గాయాలు
[ 11-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ రోడ్డు షోకు వెళ్లుతుండగా జమ్మికుంటలో భారాస శ్రేణులు ఘన స్వాగతం పలికారు. -
భారాస అభ్యర్థిని గెలిపించాలి..!
[ 11-05-2024]
పెద్దపల్లి ఎంపీగా భారాస పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని ఆ పార్టీ మండల నాయకులు కోరారు. -
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి
[ 11-05-2024]
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కమాన్ పూర్ మాజీ ఎంపీపీ కోలేటి మారుతి కోరారు. -
ఇదిగిదిగో నవ లోకం
[ 11-05-2024]
ఉమ్మడి జిల్లాలో యువ రక్తం ఉరకలేస్తోంది.. ఆకాశమే హద్దంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. యువ ఓటర్లు దేశ భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. -
గులాబీ శ్రేణుల్లో జోష్
[ 11-05-2024]
సిరిసిల్ల పట్టణంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
గడప గడపకు కార్యకర్తలు
[ 11-05-2024]
ప్రధాన పార్టీల ముఖ్య నేతల ప్రచారాలు ముగిశాయి.. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.. పోలింగ్కు మధ్యలో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.. -
దూరమైనా తప్పక ఓటేస్తాం!
[ 11-05-2024]
ఇప్పటికీ అనేక అనుబంధ గ్రామాలకు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయి. 200 మంది ఓటర్లకుపైగా ఉన్నా.. రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లాల్సి వస్తోంది. -
రూ.20.93 లక్షల నగదు పట్టివేత
[ 11-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.20.93 లక్షల నగదును పట్టుకొని, సీజ్ చేసి ఎన్నికల పరిశీలన అధికారులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 11-05-2024]
వ్యవసాయ బావిలో పడి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్ పట్టణ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. -
కొట్లాడి అలసిపోయా
[ 11-05-2024]
అందుబాటులో ఉండి సేవలందించినా ఓడగొట్టారు, ఎన్నికల్లో కొట్లాడి కొట్లాడి అలసిపోయా ఇక ఓపిక లేదంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి సాగు నీరందిస్తాం
[ 11-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి సమస్య పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి, కాలువ చివరి ఆయకట్టు వరకు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 11-05-2024]
రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా దగా చేసిన కాంగ్రెస్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ పేర్కొన్నారు. -
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
ప్రజలకు ఉచిత హామీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని, భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ అన్నారు. -
కోల్బెల్టు కేంద్రంగా అభ్యర్థుల వ్యూహాలు
[ 11-05-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి కోల్బెల్టు ప్రాంతాలు ప్రచార కేంద్రాలుగా మారాయి. అభ్యర్థులు తమ వ్యూహాలను ఇక్కడి నుంచే రచిస్తున్నారు. -
గెలుపే ఎజెండా.. కునుకు లేకుండా..
[ 11-05-2024]
ప్రచారం చివరి రోజుకు వచ్చేసింది.. సభలు.. సమావేశాలు.. చేరికలతో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు.. ముఖ్య నాయకులకు కంటిమీద కునుకు కరవైంది..