ఆస్తుల పరిరక్షణ.. చోరీల నియంత్రణ
సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు.
న్యూస్టుడే, గోదావరిఖని : సింగరేణి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక దృష్టి సారించామని.. చోరీల నియంత్రణకు నిరంతరం అధికారులతో చర్చిస్తున్నామని సింగరేణి ముఖ్య భద్రతాధికారి దీక్షితులు అన్నారు. భారీ యంత్రాలకు సంబంధించి విడిభాగాలు చోరీకి గురికాకుండా ప్రత్యేక కమిటీలు వేసినట్లు తెలిపారు. ఆయా నివేదికల ఆధారంగా మరింత పకడ్బందీగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ‘న్యూస్టుడే’ నిర్వహించిన ముఖాముఖిలో పలు అంశాలను వివరించారు.
ప్రశ్న: సింగరేణిలో లక్షల రూపాయల విలువ చేసే యంత్రాల విడిభాగాలున్నాయి. వీటి పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
సమాధానం: సంస్థలో కేబుల్ చోరీలపై దృష్టి సారించాం. ఇటీవలి కాలంలో ఎక్కువగా అవే చోరీలు జరుగుతున్నాయి. దీనిపై ప్రత్యేకంగా కమిటీ వేశాం. ఆయా నివేదికల ఆధారంగా నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది. ప్రతి వారంలో రెండు సార్లు డివిజన్ల వారిగా భద్రతాధికారులతో సమీక్షిస్తున్నాం. అయా అంశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల చోరీల నియంత్రణ మెరుగ్గా ఉంటుంది.
ప్ర: తుక్కుగా మారిన భారీ యంత్రాల విడిభాగాలు మాయమవుతున్నాయి. వాటిని ఏ విధంగా కాపాడతారు?
స: భారీ యంత్రాల విడిభాగాల పరిరక్షణకు డైరెక్టర్(పా) ప్రత్యేకంగా కమిటీ వేశారు. స్టోర్స్ జీఎంతో పాటు భద్రతా జీఎంలతో కలిసి కమిటీ నియమించారు. దీనిపై పర్యవేక్షణ చేసి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదికలు తయారు చేశాం. త్వరలోనే నివేదికలను డైరెక్టర్(పా)కు అప్పగిస్తాం. దానిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయలపై నిర్ణయం తీసుకుంటారు.
ప్ర: గతంలో డీజిల్ చోరీ ఘటనలు అధికంగా జరిగాయి. ప్రస్తుతం నిఘా ఎలా?
స: కంపెనీలోని ప్రతి బంక్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కంపెనీ యంత్రాలకు జీపీఎస్ విధానం అమలు చేశాం. గతంలో జరిగిన ఘటనల నేపథ్యంలో నిఘా విభాగాలను విస్తృతం చేశాం. చెక్పోస్టుల వద్ద భద్రతను పెంచాం. డీజిల్ నింపే సమయంలో సంబంధిత అధికారి కీ తెరిస్తేనే ఇంధనాన్ని నింపుతారు.
ప్ర: బొగ్గును కొందరు ఇటుక బట్టీలకు అక్రమంగా తరలిస్తున్నారు? నియంత్రణ?
స: బొగ్గు రవాణా చేసే వాహనాలకు జీపీఎస్ ఏర్పాటు చేశాం. కొన్ని ఏరియాల్లో పూర్తిస్థాయిలో జీపీఎస్ ఉండగా ఇంకా కొన్ని ఏరియాల్లో ఈ విధానాన్ని అమలు చేయాల్సి ఉంది. బొగ్గు అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ఇటుక బట్టీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నాం. ఇటుక బట్టీల వద్ద నిల్వ ఉన్న బొగ్గు, వినియోగిస్తున్న బొగ్గుకు సంబంధించి బిల్లులు ఉండాలి. లేదంటే అక్కడున్న బొగ్గును స్వాధీనం చేసుకుంటాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారాస నాయకుడికి తీవ్ర గాయాలు
[ 11-05-2024]
మాజీ మంత్రి కేటీఆర్ హుజురాబాద్ రోడ్డు షోకు వెళ్లుతుండగా జమ్మికుంటలో భారాస శ్రేణులు ఘన స్వాగతం పలికారు. -
భారాస అభ్యర్థిని గెలిపించాలి..!
[ 11-05-2024]
పెద్దపల్లి ఎంపీగా భారాస పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ను గెలిపించాలని ఆ పార్టీ మండల నాయకులు కోరారు. -
కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి
[ 11-05-2024]
పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీని గెలిపించాలని కమాన్ పూర్ మాజీ ఎంపీపీ కోలేటి మారుతి కోరారు. -
ఇదిగిదిగో నవ లోకం
[ 11-05-2024]
ఉమ్మడి జిల్లాలో యువ రక్తం ఉరకలేస్తోంది.. ఆకాశమే హద్దంటూ అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది.. యువ ఓటర్లు దేశ భవితకు దిశా నిర్దేశం చేస్తున్నారు.. -
గులాబీ శ్రేణుల్లో జోష్
[ 11-05-2024]
సిరిసిల్ల పట్టణంలో భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్షో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. -
గడప గడపకు కార్యకర్తలు
[ 11-05-2024]
ప్రధాన పార్టీల ముఖ్య నేతల ప్రచారాలు ముగిశాయి.. నేటి సాయంత్రం 5 గంటలతో ప్రచారానికి తెరపడనుంది.. పోలింగ్కు మధ్యలో ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.. -
దూరమైనా తప్పక ఓటేస్తాం!
[ 11-05-2024]
ఇప్పటికీ అనేక అనుబంధ గ్రామాలకు పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయి. 200 మంది ఓటర్లకుపైగా ఉన్నా.. రెండు కిలోమీటర్లకుపైగా వెళ్లాల్సి వస్తోంది. -
రూ.20.93 లక్షల నగదు పట్టివేత
[ 11-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్లో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.20.93 లక్షల నగదును పట్టుకొని, సీజ్ చేసి ఎన్నికల పరిశీలన అధికారులకు అప్పగించారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
[ 11-05-2024]
వ్యవసాయ బావిలో పడి యువకుడు అనుమానస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సుల్తానాబాద్ పట్టణ శివారులో శుక్రవారం చోటుచేసుకుంది. -
కొట్లాడి అలసిపోయా
[ 11-05-2024]
అందుబాటులో ఉండి సేవలందించినా ఓడగొట్టారు, ఎన్నికల్లో కొట్లాడి కొట్లాడి అలసిపోయా ఇక ఓపిక లేదంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. -
‘ముఖ్యమంత్రి మాటలు నమ్మొద్ద్దు’
[ 11-05-2024]
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాటలు ప్రజలు, కార్యకర్తలు ఎవరూ నమ్మొద్దని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పేర్కొన్నారు. -
పత్తిపాక రిజర్వాయర్ నిర్మించి సాగు నీరందిస్తాం
[ 11-05-2024]
పెద్దపల్లి నియోజకవర్గంలో ప్రధానమైన సాగునీటి సమస్య పరిష్కారం కోసం పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి, కాలువ చివరి ఆయకట్టు వరకు నీటికి ఇబ్బందులు లేకుండా చూస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు హామీ ఇచ్చారు. -
రైతులను దగా చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్పండి
[ 11-05-2024]
రైతులకు రైతుబంధు ఇవ్వకుండా, రుణమాఫీ చేయకుండా దగా చేసిన కాంగ్రెస్కు ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి భారాస ఎంపీ అభ్యర్థి ఈశ్వర్ పేర్కొన్నారు. -
భాజపాతోనే అభివృద్ధి సాధ్యం
[ 11-05-2024]
ప్రజలకు ఉచిత హామీల ఆశచూపి కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని, భాజపాతోనే అభివృద్ధి సాధ్యమని పెద్దపల్లి లోక్సభ భాజపా అభ్యర్థి గోమాసె శ్రీనివాస్ అన్నారు. -
కోల్బెల్టు కేంద్రంగా అభ్యర్థుల వ్యూహాలు
[ 11-05-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి కోల్బెల్టు ప్రాంతాలు ప్రచార కేంద్రాలుగా మారాయి. అభ్యర్థులు తమ వ్యూహాలను ఇక్కడి నుంచే రచిస్తున్నారు. -
గెలుపే ఎజెండా.. కునుకు లేకుండా..
[ 11-05-2024]
ప్రచారం చివరి రోజుకు వచ్చేసింది.. సభలు.. సమావేశాలు.. చేరికలతో తీరిక లేకుండా గడుపుతున్న అభ్యర్థులు.. ముఖ్య నాయకులకు కంటిమీద కునుకు కరవైంది..