ఓటుహక్కు వినియోగంలో మహిళా చైతన్యం
2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు.
గత ఎన్నికల్లో 10 శాతం అధికంగా వారి పోలింగ్
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జగిత్యాల జిల్లాలో పురుషుల కన్నా మహిళలే ఎక్కువ సంఖ్యలో ఓటేశారు. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి సెగ్మెంట్లలో కలిపి మొత్తం 4,59,971 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఇందులో పురుషులు 2,06,920 మంది కాగా మహిళలు 2,53,050 మంది, ఇతరులు ఒకరు. అంటే పురుషుల కన్నా 46,130 మంది మహిళలు అధికంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. మూడు సెగ్మెంట్లలో కలిపి అతివల ఓటింగ్ శాతం 55.01గా ఉండగా పురుషుల ఓటింగ్ శాతం 44.99కే పరిమితమైంది. జిల్లా నుంచి ఎక్కువ మంది పురుషులు ఉపాధి నిమిత్తం విదేశాలకు వెళ్లడం, ముంబయి, భీవండి తదితర ప్రాంతాల్లో ఉండటం ఒక కారణమైతే స్థానికంగా ఉన్న వారు కూడా ఓటేయడానికి బద్దకిస్తుండటంతో అన్ని ఎన్నికల్లో పురుషుల పోలింగ్ శాతం గణనీయంగా తగ్గుతోంది. ప్రస్తుత లోక్సభ ఎన్నికల కోసం తాజాగా ప్రచురించిన ఓటరు జాబితాలోనూ మూడు సెగ్మెంట్ల పరిధిలో అతివలే అధికంగా ఉన్నారు. సవరణల తర్వాత 3,42,216 మంది పురుషులు, 3,70,460 మంది మహిళలున్నారు. అంటే 28,244 మంది మహిళలు ఎక్కువగా ఉన్నారు. మూడు నియోజవర్గాల్లోనూ నారీమణులదే ఆధిపత్యం కావడంతో వారి ఆదరణ చూరగొనేందుకు అన్ని పార్టీల నేతలు యత్నిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ ప్రశాంతం
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం వరకు పోలింగ్ జరగ్గా ఓటర్లు బారులు తీరి ఓటేశారు.. -
ప్రజా తీర్పు నిక్షిప్తం
[ 14-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ సోమవారం ప్రశాంతంగా జరిగింది. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లాలో ఓటర్లు పోటెత్తారు. పలువురు విదేశాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
ఓటర్లకు తప్పని ఇబ్బందులు
[ 14-05-2024]
ఎప్పటిలాగే ఓటర్లకు కష్టాలు తప్పలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో పేర్లు ఉండి ప్రస్తుత ఓటర్ల జాబితాలో పేర్లు లేక పలువురు నిరాశ చెందారు. -
జేఎన్టీయూకు చేరిన ఈవీఎంలు, వీవీప్యాట్లు
[ 14-05-2024]
పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలు, వీవీప్యాట్లను సెంటినరీకాలనీలోని జేఎన్టీయూకు పోలీసు భద్రత నడుమ సోమవారం రాత్రి తరలించారు. -
రహదారి ప్రమాదంలో వ్యక్తి మృతి
[ 14-05-2024]
హుజూరాబాద్-జమ్మికుంట ప్రధాన రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందారు. -
స్వేచ్ఛగా ఓటుహక్కు వినియోగం
[ 14-05-2024]
రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని.. ప్రజలు ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకున్నారని సీపీ శ్రీనివాస్ వెల్లడించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!
-
ఎయిర్టెల్ లాభం 31% డౌన్.. కొత్తగా 78 లక్షల మంది కస్టమర్లు
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
ఆ వీడియోల లీక్ వెనక ‘భారీ తిమింగలం’ - కుమారస్వామి ఆరోపణ
-
టీ20 ప్రపంచకప్ 2024.. బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఇవే...