ధాన్యం తూకాల్లో వేగం ఏదీ?
జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
ఇప్పటివరకు కొన్నది 69 వేల మెట్రిక్ టన్నులే
ఎల్లారెడ్డిపేటలో తూకం వేస్తున్న హమాలీలు
న్యూస్టుడే, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల గ్రామీణం: జిల్లాలో వరి కోతలు 80 శాతం పూర్తయ్యాయి. వచ్చే నెల 15 నాటికి కోతలు ముగుస్తాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. మేలో అత్యధికంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తాయని అంచనా వేశారు. వారి ప్రణాళిక ప్రకారంగానే ఏప్రిల్ చివరి వారం నుంచి కేంద్రాలకు పోటెత్తుతున్నాయి. మేలో మరింత ఎక్కువ వచ్చే అవకాశాలున్నాయి. జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 3 - 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఓవైపు అకాల వర్షాలు, వడగళ్ల వానలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుంది. తరచూ ఆకాశంలో కమ్ముకుంటున్న మేఘాలతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఎక్కడ వర్షాలు పడతాయోనని భయాందోళనకు గురవుతున్నారు. తూకాలను వేగవంతం చేస్తే నష్టం వాటిల్లదని రైతులు భావిస్తున్నారు. కొనుగోళ్లపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.
జిల్లాలో యాసంగి సీజన్లో 1,74,750 ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేశారు. పంట సాగు విస్తీర్ణాన్ని బట్టి 4.36 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అధికారులు లెక్కకట్టారు. ‘ఏ’ గ్రేడు రకానికి రూ. 2,203, సాధారణ రకం ధాన్యానికి రూ. 2,183 ప్రభుత్వం మద్దతు ధరగా నిర్ణయించింది. ధాన్యం సేకరించేందుకు 44 ఐకేపీ, 202 పీఏసీఎస్, 9 డీసీఎంఎస్, 4 మెప్నా మొత్తం 259 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలోని 244 కొనుగోలు కేంద్రాల్లో తూకాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 27 నాటికి 10,076 మంది రైతుల వద్ద ఐకేపీ ద్వారా 12,991.600 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ల ద్వారా 53,071.660, డీసీఎంఎస్ల నుంచి 1,516.760, మెప్నా ద్వారా 1,589.460 మెట్రిక్ టన్నులు కలుపుకొని మొత్తం 69,169.480 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 64,731.240 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించారు. ఆయా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసి, మిల్లులకు చేర్చేందుకు 4,438.240 మెట్రిక్ టన్నుల ధాన్యం బస్తాలు సిద్ధంగా ఉన్నాయి. 6,564 మంది రైతులు విక్రయించిన రూ. 90.40 కోట్ల విలువైన 41,034.200 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఇందులో 4,189 మంది రైతులకు చెందిన 24,795 మెట్రిక్ టన్నులకు డబ్బులు రూ. 54.62 కోట్లను వారి ఖాతాల్లో జమ చేశారు. కొనుగోలు కేంద్రాల్లో నిర్ణీత తేమశాతం ఉన్న ధాన్యం కుప్పలు పేరుకుపోతున్నాయి. తూకాలు, ఆన్లైన్ ఎంట్రీలో కొంత ఆలస్యమవుతున్నట్లు కర్షకులు చెబుతున్నారు. అదనపు కలెక్టర్ ఖీమ్యానాయక్ జిల్లాలోని కొనుగోలు కేంద్రాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. తూకాల్లో జాప్యం లేకుండా చూడాలని, ఆన్లైన్ నమోదును త్వరితగతిన పూర్తిచేయాలని నిర్వాహకులకు సూచిస్తున్నారు.
ఆన్లైన్ నమోదులో ఆలస్యం
రైతులు వరిని కోసిన వెంటనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. కేంద్రాల్లో నిర్ణీత తేమశాతం వచ్చే వరకు కవర్లలో ఆరబెడుతున్నారు. అయితే తూకాల్లో జాప్యం చోటుచేసుకోవడంతో రోజుల తరబడి పడిగాపులు పడుతున్నారు. ఓవైపు తూకం వేసిన బస్తాలను మిల్లులకు చేర్చడం, ధాన్యం రాశులను తూకం వేయడం, ఈ రెండు పనులు ఏకకాలంలో సాధ్యం కావడం లేదు. లారీలు రాగానే హమాలీలు తూకాలు నిలిపివేసి, బస్తాలను లోడ్ చేస్తున్నారు. మిల్లుల్లో బస్తాలు దింపగానే ట్రక్షీట్తో రైతుల వివరాలను నిర్వాహకులు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్ నమోదులో ఆలస్యం చోటుచేసుకొంటుందని అన్నదాతలు వాపోతున్నారు. ఇప్పటికైనా కేంద్రాల నిర్వాహకులు ఆన్లైన్ నమోదు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సకాలంలో డబ్బులు అందేలా చూడాలని రైతులు కోరుతున్నారు.
చర్యలు తీసుకొంటున్నాం
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు వేగంగా జరిగేందుకు ప్రత్యేక దృష్టి సారించాం. సంబంధిత శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత వేగంగా కొనుగోళ్లు చేసేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నాం. నాణ్యత ప్రమాణాల ప్రకారం రైతులు ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి.
జితేందర్రెడ్డి, డీఎస్వో, సిరిసిల్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ నిర్మాణాలపై బల్దియా నజర్
[ 15-05-2024]
కరీంనగర్ నగర పాలక పరిధిలో నూతన భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా నిర్మిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా భవనాలు చకచకా నిర్మిస్తుండగా కనీసం పర్యవేక్షణ కూడా చేయడం లేదు. అక్రమ లేఅవుట్లతో అనర్థమని తెలిసినా అదేదీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. -
స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర నిఘా
[ 15-05-2024]
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత కోసం నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలకు సోమవారం రాత్రి వరకు చేరుకున్నాయి. -
గొర్రెల పంపిణీ లేనట్లేనా!
[ 15-05-2024]
కొత్త రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తాజాగా తీసుకున్న నిర్ణయాల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే డీడీలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఎవరి లెక్కలు వారివే!
[ 15-05-2024]
‘ఫలానా మండలంలో మనకే మంచి పట్టు ఉంది.. అక్కడ బాగానే ఓట్లు పడ్డాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న విధంగానే కొందరు ఓటర్లు మనవైపే ఉన్నారు.. మరో మండలంలో మనకు ఆదరణ కాస్త తక్కువైంది.’.. అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓట్ల లెక్కలేసుకుంటున్నారు. -
8,34,164 మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. దేశ చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినప్పటికీ దాని వినియోగంలో మాత్రం చాలా మంది దూరంగా ఉంటున్నారు. -
ధన్వాడలో ఉప ముఖ్యమంత్రి పూజలు
[ 15-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. -
తీరిక దొరికింది ఇలా..
[ 15-05-2024]
ఎన్నికల షెడ్యూలు వెలువడింది మొదలు పోలింగ్ వరకు అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడిపారు. -
ఓటెత్తిన నారీమణులు
[ 15-05-2024]
ఈసారి లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఓటు హక్కు వినియోగంలో హవా చాటారు.. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ ఓటుహక్కు కలిగి ఉండగా.. వినియోగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటారు. -
చికిత్స పొందుతూ జడ్పీటీసీ మాజీ సభ్యుడి మృతి
[ 15-05-2024]
జూలపల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటకుల నర్సయ్య(48) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 10న నర్సయ్య ఇంట్లో తీవ్ర గాయాలతో అచేతనావస్థలో పడి ఉండటంతో గమనించిన బంధువులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. -
‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన కాంగ్రెస్’
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. -
నగదు ప్రవాహానికి అడ్డుకట్ట
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రలోభాల నియంత్రణకు ఎన్నికల సంఘం నియమించిన నిఘా బృందాల తనిఖీల్లో రూ.9.82 కోట్ల సొత్తు పట్టుబడింది. అధికార యంత్రాంగం చాకచాక్యంగా వ్యవహరించడంతో డబ్బు ప్రవాహనానికి అడ్డుకట్ట వేసినట్లయింది. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో?
[ 15-05-2024]
సింగరేణి సంస్థ గడచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
సర్వే చేశారు... పనులు మరిచారు
[ 15-05-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. -
లక్ష మెజారిటీ ఖాయం : జీవన్రెడ్డి
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెట్పల్లి మండలం వేంపేటలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 15-05-2024]
రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే కేంద్రప్రభుత్వ పీఎంకిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరేందుకు జిల్లాలోని వేలాదిమంది రైతులు అయిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. -
మృత్యు మలుపు
[ 15-05-2024]
మేడిపల్లి జాతీయ రహదారిపై ఏటా ప్రమాదాల రూపంలో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. సరాసరి నెలరోజులకు ఒక ప్రాణం ఏదో ప్రమాదంలో గాలిలో కలసిపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో పవనోత్సాహం.. అత్యధికంగా పోలింగ్ నమోదు
-
మధ్యవర్తి వంచన.. వలస జీవులు కాలినడకన
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!