పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యం
కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు.
మంత్రి పొన్నం
అభివాదం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అభ్యర్థి రాజేందర్రావు
కరీంనగర్ కొత్తపల్లి, కరీంనగర్ గ్రామీణం, న్యూస్టుడే: కేంద్రంలో కొనసాగిన పదేళ్ల భాజపా పాలనలో ప్రగతి శూన్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. ఆదివారం కొత్తపల్లి మండలంలోని బావుపేట గ్రామంలో, కొత్తపల్లిలో నిర్వహించిన కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చేతులెత్తేశారన్నారు. నల్లధనం తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తామని చెప్పి కనీసం ఒక్కరి ఖాతాలో అయినా వేశారా? అని ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయలేదని, పెన్షన్ ఇవ్వలేదని, తెలంగాణ విభజన హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. పదేళ్లలో ఏ ఒక్క హామీ అమలు చేయకుండా భాజపా నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఆరు గ్యారంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానని కరీంనగర్ భాజపా అభ్యర్థి బండి సంజయ్ ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు అందించడమే కాకుండా ఆరోగ్యశ్రీ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఎన్ని డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారని కేసీఆర్ను ప్రశ్నించారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావు మాట్లాడుతూ.. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో భాజపాకో హఠావో... దేశ్కో బచావో మన అందరిని నినాదం కావాలన్నారు. తనను గెలిపిస్తే బావుపేటను మండలం చేస్తానని, సొంత నిధులతో ఎస్సీ కాలనీలో మినరల్ వాటర్ ప్లాంట్, ఓపెన్ జిమ్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. కరీంనగర్ గ్రామీణ మండలం చామనపల్లిలో జరిగిన కార్నర్ మీటింగ్లో వెలిచాల రాజేందర్రావు మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసినప్పుడు భార్య మంగళసూత్రాన్ని అమ్మి నామినేషన్ రుసుం చెల్లించానని చెప్పుకొన్న భాజపా అభ్యర్థి బండి సంజయ్కి వందల కోట్ల డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ శాసన సభ్యుడు కోడూరి సత్యనారాయణగౌడ్, నేతలు రోహిత్రావు, పులి ఆంజనేయులుగౌడ్, భాస్కర్రెడ్డి, పద్మాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ నిర్మాణాలపై బల్దియా నజర్
[ 15-05-2024]
కరీంనగర్ నగర పాలక పరిధిలో నూతన భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా నిర్మిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా భవనాలు చకచకా నిర్మిస్తుండగా కనీసం పర్యవేక్షణ కూడా చేయడం లేదు. అక్రమ లేఅవుట్లతో అనర్థమని తెలిసినా అదేదీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. -
స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర నిఘా
[ 15-05-2024]
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత కోసం నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలకు సోమవారం రాత్రి వరకు చేరుకున్నాయి. -
గొర్రెల పంపిణీ లేనట్లేనా!
[ 15-05-2024]
కొత్త రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తాజాగా తీసుకున్న నిర్ణయాల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే డీడీలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఎవరి లెక్కలు వారివే!
[ 15-05-2024]
‘ఫలానా మండలంలో మనకే మంచి పట్టు ఉంది.. అక్కడ బాగానే ఓట్లు పడ్డాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న విధంగానే కొందరు ఓటర్లు మనవైపే ఉన్నారు.. మరో మండలంలో మనకు ఆదరణ కాస్త తక్కువైంది.’.. అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓట్ల లెక్కలేసుకుంటున్నారు. -
8,34,164 మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. దేశ చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినప్పటికీ దాని వినియోగంలో మాత్రం చాలా మంది దూరంగా ఉంటున్నారు. -
ధన్వాడలో ఉప ముఖ్యమంత్రి పూజలు
[ 15-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. -
తీరిక దొరికింది ఇలా..
[ 15-05-2024]
ఎన్నికల షెడ్యూలు వెలువడింది మొదలు పోలింగ్ వరకు అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడిపారు. -
ఓటెత్తిన నారీమణులు
[ 15-05-2024]
ఈసారి లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఓటు హక్కు వినియోగంలో హవా చాటారు.. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ ఓటుహక్కు కలిగి ఉండగా.. వినియోగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటారు. -
చికిత్స పొందుతూ జడ్పీటీసీ మాజీ సభ్యుడి మృతి
[ 15-05-2024]
జూలపల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటకుల నర్సయ్య(48) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 10న నర్సయ్య ఇంట్లో తీవ్ర గాయాలతో అచేతనావస్థలో పడి ఉండటంతో గమనించిన బంధువులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. -
‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన కాంగ్రెస్’
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. -
నగదు ప్రవాహానికి అడ్డుకట్ట
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రలోభాల నియంత్రణకు ఎన్నికల సంఘం నియమించిన నిఘా బృందాల తనిఖీల్లో రూ.9.82 కోట్ల సొత్తు పట్టుబడింది. అధికార యంత్రాంగం చాకచాక్యంగా వ్యవహరించడంతో డబ్బు ప్రవాహనానికి అడ్డుకట్ట వేసినట్లయింది. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో?
[ 15-05-2024]
సింగరేణి సంస్థ గడచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
సర్వే చేశారు... పనులు మరిచారు
[ 15-05-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. -
లక్ష మెజారిటీ ఖాయం : జీవన్రెడ్డి
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెట్పల్లి మండలం వేంపేటలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 15-05-2024]
రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే కేంద్రప్రభుత్వ పీఎంకిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరేందుకు జిల్లాలోని వేలాదిమంది రైతులు అయిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. -
మృత్యు మలుపు
[ 15-05-2024]
మేడిపల్లి జాతీయ రహదారిపై ఏటా ప్రమాదాల రూపంలో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. సరాసరి నెలరోజులకు ఒక ప్రాణం ఏదో ప్రమాదంలో గాలిలో కలసిపోతోంది.