ఉపాధి పని... ఉదయపు నడక
లోక్సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు.
సమూహ ప్రాంతాల్లో ఓట్ల అభ్యర్థన
మండే ఎండల్లో మారిన ప్రచార సరళి
న్యూస్టుడే, గోదావరిఖని
సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో ఉపాధిహామీ కూలీలతో మాట్లాడుతున్న నిజామాబాద్ ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి
లోక్సభ ఎన్నికల ప్రచార సరళి మారింది. ఎండలు మండుతుండటంతో ఇంటింటికీ తిరగడానికి నాయకులు జంకుతున్నారు. ఎక్కువ మంది ఓటర్లు ఉండే ప్రాంతాలకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గంపగుత్తగా ఓట్లు పడే అవకాశముండే చోటుకు వెళ్తూ మద్దతు కూడగడుతున్నారు.
ప్రస్తుతం ప్రతి గ్రామంలో ఉపాధిహామీ పథకం పనులు నిర్వహిస్తున్నారు. ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఉదయం 9 గంటలలోపే కూలీలంతా పనులకు వెళ్తున్నారు. చెరువులు, కాలువల్లో పూడికతీత, కాంటూరు కందకాల తవ్వకం తదితర మట్టి పనులు చేపడుతున్నారు. ఒక్కో ఊరిలో 100 నుంచి 500 మంది ఒకే చోట ఉంటూ పనులు నిర్వహిస్తున్నారు. దీంతో నాయకులు ఉపాధిహామీ పనులు జరుగుతున్న ప్రాంతాలనే ప్రచార అడ్డాలుగా మార్చుకున్నారు.
పని ప్రాంతాలే అడ్డాలు
కరీంనగర్, పెద్దపల్లి, నిజమాబాద్ లోక్సభ స్థానాల పరిధిలో ఉమ్మడి జిల్లాలో 9.42 లక్షల మంది ఉపాధిహామీ కూలీలున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు లేకపోవడంతో దాదాపు జాబ్కార్డున్న ప్రతి ఇంటి నుంచీ పనికి వెళ్తున్నారు. ఈ క్రమంలో ఒక్క కూలీని ప్రభావితం చేసినా ఆ కుటుంబంలోని మూడు ఓట్లు వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీల నాయకులు, అభ్యర్థులు ఉపాధిహామీ పనులపై దృష్టి సారించారు. కరీంనగర్ భారాస అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ సతీమణి డా.మాధవి కొద్ది రోజులుగా గ్రామాల్లో తిరుగుతూ ఉపాధిహామీ కూలీలను కలుస్తున్నారు. నిజమాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్రెడ్డి ఇటీవల సారంగాపూర్ మండలం లక్ష్మీదేవిపల్లిలో కూలీలను కలిసి ఓట్లడిగారు. ఇక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పల్లెల్లో ఉపాధి కూలీల వద్దకు వెళ్లి పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. భారాస నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉపాధిహామీ పని ప్రాంతాలే అడ్డాలుగా ప్రచారం చేస్తున్నారు.
జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కశాశాల మైదానంలో వాకర్స్తో మాట్లాడుతున్న కరీంనగర్ ఎంపీ భారాస అభ్యర్థి వినోద్కుమార్
హామీల కేంద్రాలు
ప్రస్తుతం యాసంగి ధాన్యం చేతికొస్తుండగా ప్రభుత్వ కేంద్రాల్లో కొనుగోళ్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఎక్కువ మంది రైతులు, వారి కుటుంబాలు కేంద్రాలను ప్రచారానికి వినియోగించుకుంటున్నారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్దకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకుంటున్నారు. తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ధాన్యం తూకంలో అవకతవకలు జరుగుతున్నా, తరుగు సమస్యలున్నా వెంటనే అధికారులతో మాట్లాడుతూ ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మైదానాలకు వరుస
పల్లెల్లో ఉపాధిహామీ పని ప్రాంతాలకు వెళ్తున్న నాయకులు, పట్టణాల్లో విశాల ప్రాంతాలు, మైదానాల బాట పడుతున్నారు. వాకర్స్తో కలిసి నడుస్తూ ప్రచారం చేస్తున్నారు. ఉదయం వాతావరణం చల్లగా ఉండటంతో పాటు ఎక్కువ మంది ఒకచోట దొరుకుతుండటంతో అభ్యర్థులు ఆ సమయాన్నే ఎంచుకుంటున్నారు. ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై శ్రద్ధ పెరగడంతో చాలా మంది ఉదయపు నడకకు వెళ్తున్నారు. దీంతో పట్టణ కేంద్రాల్లోని మైదానాలకు నాయకులు క్యూ కడుతున్నారు. కరీంనగర్, గోదావరిఖని, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, కోరుట్ల, హుజూరాబాద్, వేములవాడ, సుల్తానాబాద్ పట్టణాల్లో ఉదయం నడకకు వచ్చే వారిని ఎక్కువ మంది నాయకులు కలుస్తున్నారు. ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు స్వయంగా వచ్చి వాకర్స్ను కలిసి ఓటు అభ్యర్థిస్తున్నారు.
కరీంనగర్ ఎస్సారార్ కళాశాల మైదానంలో వాకర్స్తో కలిసి క్రికెట్ ఆడుతున్న భాజపా అభ్యర్థి బండి సంజయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ నిర్మాణాలపై బల్దియా నజర్
[ 15-05-2024]
కరీంనగర్ నగర పాలక పరిధిలో నూతన భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా నిర్మిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా భవనాలు చకచకా నిర్మిస్తుండగా కనీసం పర్యవేక్షణ కూడా చేయడం లేదు. అక్రమ లేఅవుట్లతో అనర్థమని తెలిసినా అదేదీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. -
స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర నిఘా
[ 15-05-2024]
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత కోసం నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలకు సోమవారం రాత్రి వరకు చేరుకున్నాయి. -
గొర్రెల పంపిణీ లేనట్లేనా!
[ 15-05-2024]
కొత్త రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తాజాగా తీసుకున్న నిర్ణయాల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే డీడీలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఎవరి లెక్కలు వారివే!
[ 15-05-2024]
‘ఫలానా మండలంలో మనకే మంచి పట్టు ఉంది.. అక్కడ బాగానే ఓట్లు పడ్డాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న విధంగానే కొందరు ఓటర్లు మనవైపే ఉన్నారు.. మరో మండలంలో మనకు ఆదరణ కాస్త తక్కువైంది.’.. అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓట్ల లెక్కలేసుకుంటున్నారు. -
8,34,164 మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. దేశ చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినప్పటికీ దాని వినియోగంలో మాత్రం చాలా మంది దూరంగా ఉంటున్నారు. -
ధన్వాడలో ఉప ముఖ్యమంత్రి పూజలు
[ 15-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. -
తీరిక దొరికింది ఇలా..
[ 15-05-2024]
ఎన్నికల షెడ్యూలు వెలువడింది మొదలు పోలింగ్ వరకు అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడిపారు. -
ఓటెత్తిన నారీమణులు
[ 15-05-2024]
ఈసారి లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఓటు హక్కు వినియోగంలో హవా చాటారు.. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ ఓటుహక్కు కలిగి ఉండగా.. వినియోగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటారు. -
చికిత్స పొందుతూ జడ్పీటీసీ మాజీ సభ్యుడి మృతి
[ 15-05-2024]
జూలపల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటకుల నర్సయ్య(48) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 10న నర్సయ్య ఇంట్లో తీవ్ర గాయాలతో అచేతనావస్థలో పడి ఉండటంతో గమనించిన బంధువులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. -
‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన కాంగ్రెస్’
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. -
నగదు ప్రవాహానికి అడ్డుకట్ట
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రలోభాల నియంత్రణకు ఎన్నికల సంఘం నియమించిన నిఘా బృందాల తనిఖీల్లో రూ.9.82 కోట్ల సొత్తు పట్టుబడింది. అధికార యంత్రాంగం చాకచాక్యంగా వ్యవహరించడంతో డబ్బు ప్రవాహనానికి అడ్డుకట్ట వేసినట్లయింది. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో?
[ 15-05-2024]
సింగరేణి సంస్థ గడచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
సర్వే చేశారు... పనులు మరిచారు
[ 15-05-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. -
లక్ష మెజారిటీ ఖాయం : జీవన్రెడ్డి
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెట్పల్లి మండలం వేంపేటలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 15-05-2024]
రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే కేంద్రప్రభుత్వ పీఎంకిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరేందుకు జిల్లాలోని వేలాదిమంది రైతులు అయిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. -
మృత్యు మలుపు
[ 15-05-2024]
మేడిపల్లి జాతీయ రహదారిపై ఏటా ప్రమాదాల రూపంలో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. సరాసరి నెలరోజులకు ఒక ప్రాణం ఏదో ప్రమాదంలో గాలిలో కలసిపోతోంది.
తాజా వార్తలు (Latest News)
-
నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో