44 రోజులు.. రూ.9.71 కోట్లు
లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న నగదు
నగదును చూపిస్తున్న కరీంనగర్ పోలీసులు
- మార్చి 16న కరీంనగర్లోని ఓ హోటల్లో పోలీసులు తనిఖీలు చేసి ఎలాంటి పత్రాలు లేకుండా ఉన్న రూ.6.67 కోట్ల నగదును పట్టుకున్నారు. పట్టుబడిన నగదును ఐటీ శాఖ అధికారులకు అప్పగించారు.
- ఏప్రిల్ 20న కరీంనగర్ పట్టణంలో రూ.88 లక్షల నగదును కొంత మంది ఎలాంటి పత్రాలు లేకుండా ద్విచక్ర వాహనంపై తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో పట్టుకున్నారు. పట్టుబడిన నగదును సీజ్ చేసి ఆదాయ పన్ను శాఖ అధికారులకు అప్పగించారు.
న్యూస్టుడే, కరీంనగర్ నేరవార్తలు: లోక్సభ ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఉండేందుకు పోలీసులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. చెక్పోస్టులు ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి జిల్లాలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 28వ తేదీ వరకు 44 రోజుల్లో రూ.9.71 కోట్ల నగదును పట్టుకున్నారు.
- జగిత్యాల జిల్లాలో అనుమతి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.90 లక్షల విలువ గల 1.506 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. రూ.3.96 లక్షల విలువైన 15.81 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రూ.33,765 విలువ గల మద్యం సీజ్ చేశారు.
- కరీంనగర్ జిల్లాలో 1140.205 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. రూ.52 వేల విలువ గల 2.50 కిలోల గంజాయిని పట్టుకున్నారు.
- రాజన్న సిరిసిల్ల జిల్లాలో రూ.40 వేల విలువ గల గంజాయిని పట్టుకున్నారు. అదేవిధంగా రూ.7.63 లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు.
- పెద్దపల్లి జిల్లాలో రూ.38 వేల విలువగల గంజాయి పట్టుకుని, 574 లీటర్ల మద్యం సీజ్ చేశారు.
ఇంకా 15 రోజులే..
లోక్సభ ఎన్నికలకు ఇంకా 15 రోజులే మిగిలి ఉంది. పార్టీలు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి భిన్న మార్గాలు అవలంబిస్తుంటాయి.. ప్రలోభాలపైనా దృష్టి పెడతాయి. ఈ క్రమంలో అధికారులు కూడా తనిఖీలు విస్తృతం చేస్తారు. ఈ సమయంలో సామాన్యులు జాగ్రత్తగా ఉండకపోతే తమ డబ్బు కోసం ఇబ్బంది పడాల్సి వస్తుంది. సరైన పత్రాలు లేకుండా నగదు, ఇతర సామగ్రి తరలించవద్దని పోలీసుశాఖ, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు ఎప్పటికప్పుడు చెబుతున్నా వాటిని లెక్క చేయకుండా కొంత మంది నగదు, ఇతర వస్తువులు తరలిస్తూ పోలీసులకు పట్టుబడుతున్నారు.
వెనక్కి తీసుకుంది రూ.71 లక్షలు
ఉమ్మడి జిల్లాలో రూ.9.71 కోట్లు ఇప్పటి వరకు తనిఖీల్లో పట్టుబడగా ఆధారాలు చూపి రూ.71 లక్షలు మాత్రం వెనక్కి తీసుకున్నారు. తనిఖీల సమయంలో పత్రాల ఆధారాలు చూపకపోవడంతో పోలీసులు పట్టుకున్న రూ.9.71 కోట్లను త్రీమెన్ కమిటీకి అప్పగించారు. బాధితులు తరువాత కమిటీకి సరైన పత్రాలు చూపడంతో రూ.71 లక్షలు వెనక్కి ఇచ్చేశారు. సరైన పత్రాలను చూపిస్తే నగదు విడుదల చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. సరైన ఆధారాలతో నగదు, బంగారం తరలిస్తే ఇబ్బందులుండవని సూచిస్తున్నారు.
స్వాధీనం చేసుకున్న నగదు (రూ.లలో)
జగిత్యాల : 14,64,410
సిరిసిల్ల : 74,37,300
కరీంనగర్: 7,96,55,850
పెద్దపల్లి : 86,04,302
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అక్రమ నిర్మాణాలపై బల్దియా నజర్
[ 15-05-2024]
కరీంనగర్ నగర పాలక పరిధిలో నూతన భవనాలు, బహుళ అంతస్తుల నిర్మాణాలు జోరుగా నిర్మిస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా భవనాలు చకచకా నిర్మిస్తుండగా కనీసం పర్యవేక్షణ కూడా చేయడం లేదు. అక్రమ లేఅవుట్లతో అనర్థమని తెలిసినా అదేదీ పరిగణనలోకి తీసుకోకుండానే ఇళ్లు నిర్మించుకుంటున్నారు. -
స్ట్రాంగ్ రూంల వద్ద నిరంతర నిఘా
[ 15-05-2024]
ఈవీఎం స్ట్రాంగ్ రూంల వద్ద భద్రత కోసం నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేశామని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తి కాగానే కరీంనగర్, చొప్పదండి, మానకొండూర్, హుజూరాబాద్, హుస్నాబాద్, సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలు కరీంనగర్లోని ఎస్సారార్ కళాశాలకు సోమవారం రాత్రి వరకు చేరుకున్నాయి. -
గొర్రెల పంపిణీ లేనట్లేనా!
[ 15-05-2024]
కొత్త రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం నిలిపివేయనున్నట్లు తాజాగా తీసుకున్న నిర్ణయాల ద్వారా తెలుస్తోంది. జిల్లాలో రెండో విడత గొర్రెల పంపిణీకి ఇప్పటికే డీడీలు చెల్లించిన వారందరికీ తిరిగి డబ్బులు వాపసు ఇవ్వడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. -
ఎవరి లెక్కలు వారివే!
[ 15-05-2024]
‘ఫలానా మండలంలో మనకే మంచి పట్టు ఉంది.. అక్కడ బాగానే ఓట్లు పడ్డాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఉన్న విధంగానే కొందరు ఓటర్లు మనవైపే ఉన్నారు.. మరో మండలంలో మనకు ఆదరణ కాస్త తక్కువైంది.’.. అంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు, నాయకులు ఓట్ల లెక్కలేసుకుంటున్నారు. -
8,34,164 మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
ఎన్నికల్లో ప్రతి ఓటు చాలా కీలకం. దేశ చరిత్రలో ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన అభ్యర్థులూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం, జిల్లా యంత్రాంగం ఎంతగా ప్రచారం చేసినప్పటికీ దాని వినియోగంలో మాత్రం చాలా మంది దూరంగా ఉంటున్నారు. -
ధన్వాడలో ఉప ముఖ్యమంత్రి పూజలు
[ 15-05-2024]
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం ధన్వాడలోని శ్రీ దత్తాత్రేయస్వామి ఆలయ వార్షికోత్సవ కార్యక్రమం మంగళవారం వైభవంగా జరిగింది. -
తీరిక దొరికింది ఇలా..
[ 15-05-2024]
ఎన్నికల షెడ్యూలు వెలువడింది మొదలు పోలింగ్ వరకు అభ్యర్థులు క్షణం తీరిక లేకుండా గడిపారు. -
ఓటెత్తిన నారీమణులు
[ 15-05-2024]
ఈసారి లోక్సభ ఎన్నికల్లో మహిళలు ఓటు హక్కు వినియోగంలో హవా చాటారు.. ఉమ్మడి జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మహిళలు ఎక్కువ ఓటుహక్కు కలిగి ఉండగా.. వినియోగంలోనూ అదే స్థాయిలో సత్తా చాటారు. -
చికిత్స పొందుతూ జడ్పీటీసీ మాజీ సభ్యుడి మృతి
[ 15-05-2024]
జూలపల్లి జడ్పీటీసీ మాజీ సభ్యుడు పాటకుల నర్సయ్య(48) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం ఈ నెల 10న నర్సయ్య ఇంట్లో తీవ్ర గాయాలతో అచేతనావస్థలో పడి ఉండటంతో గమనించిన బంధువులు కరీంనగర్లోని ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. -
‘కక్ష సాధింపు చర్యలకు పాల్పడిన కాంగ్రెస్’
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డంపెట్టుకుని కక్షసాధింపు చర్యలకు పాల్పడిందని పెద్దపల్లి లోక్సభ భారాస అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. -
నగదు ప్రవాహానికి అడ్డుకట్ట
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల్లో ప్రలోభాల నియంత్రణకు ఎన్నికల సంఘం నియమించిన నిఘా బృందాల తనిఖీల్లో రూ.9.82 కోట్ల సొత్తు పట్టుబడింది. అధికార యంత్రాంగం చాకచాక్యంగా వ్యవహరించడంతో డబ్బు ప్రవాహనానికి అడ్డుకట్ట వేసినట్లయింది. -
వార్షిక లాభాల ప్రకటన ఎప్పుడో?
[ 15-05-2024]
సింగరేణి సంస్థ గడచిన ఏడాది సాధించిన లాభాల ప్రకటనపై ఆసక్తి నెలకొంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2,222 కోట్ల లాభాలను సాధించిన సంస్థ 2023-24 ఆర్థిక సంవత్సరంలో భారీగా బొగ్గు ఉత్పత్తి చేసింది. -
సర్వే చేశారు... పనులు మరిచారు
[ 15-05-2024]
ఆధ్యాత్మిక పట్టణమైన వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రోజూ వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. -
లక్ష మెజారిటీ ఖాయం : జీవన్రెడ్డి
[ 15-05-2024]
నిజామాబాద్ లోక్సభ స్థానంలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి టి.జీవన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మెట్పల్లి మండలం వేంపేటలో మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 15-05-2024]
రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించే కేంద్రప్రభుత్వ పీఎంకిసాన్ సమ్మాన్ నిధి పథకంలో చేరేందుకు జిల్లాలోని వేలాదిమంది రైతులు అయిదేళ్లుగా ఎదురుచూస్తున్నారు. -
మృత్యు మలుపు
[ 15-05-2024]
మేడిపల్లి జాతీయ రహదారిపై ఏటా ప్రమాదాల రూపంలో మృత్యుఘంటికలు మోగుతున్నాయి. సరాసరి నెలరోజులకు ఒక ప్రాణం ఏదో ప్రమాదంలో గాలిలో కలసిపోతోంది.