చైతన్య ఫలితం.. శాంతియుతం
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది.
తగ్గుతున్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు
న్యూస్టుడే, పెద్దపల్లి కలెక్టరేట్
ఒకప్పుడు ఎన్నికలంటేనే గ్రామాల్లో పగలు, ప్రతీకారాలు కనిపించేవి. నిత్యం గొడవలతో ఘర్షణ వాతావరణం నెలకొనేది. ఆవేశాలు, కక్షలతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయం వెంటాడేది. ఇలాంటి సమయంలో చాలా మంది ‘మనకెందుకీ గొడవ’ అనుకుంటూ ఓటుకు దూరంగా ఉండే పరిస్థితి. కాగా కొన్నేళ్లుగా పల్లెల్లో శాంతియుత వాతావరణం నెలకొనడానికి అధికార యంత్రాంగం చేపట్టిన చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగడానికి దోహదపడుతున్నాయి. ఫలితంగా ఏటికేడు సమస్యాత్మక ప్రాంతాలు తగ్గుతున్నాయి. ప్రజాస్వామ్యం పరిఢవిల్లేలా క్షేత్ర స్థాయిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది.
ఎలా గుర్తిస్తారంటే..
ఎన్నికల సమయంలో అల్లర్లు, గొడవలు జరిగే ప్రాంతాలను సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల జాబితాలో చేరుస్తారు. హింసాత్మక ఘటనలు, అల్లరిమూకల ప్రభావం, ఘర్షణలు, ఇరువర్గాల పరస్పర దాడులు, కేసులు పెట్టుకోవడం వంటి ఘటనలు చోటుచేసుకుంటే సమస్యాత్మకమైనవిగా గుర్తిస్తారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో వీటి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఈ కేంద్రాలపై పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారిస్తుంది. అదనపు సిబ్బందితో శాంతిభద్రతలను పర్యవేక్షిస్తారు. చిన్నపాటి గొడవ కూడా లేకుండా పోలింగ్ ముగిసే వరకు నిఘా తీవ్రతరం చేస్తారు.
మంథని నియోజకవర్గంలో అవగాహన కల్పిస్తున్న పోలీసులు
ఫలిస్తున్న ప్రచారం
ఉమ్మడి జిల్లాలోని మంథని, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో పలు ప్రాంతాల్లో తీవ్రవాద ప్రాబల్యం ఉండేది. ఎన్నికల సమయంలో అక్కడి గ్రామాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకునేవి. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రౌడీషీటర్లు పేట్రేగిపోయేవారు. ప్రజాస్వామ్యంలో ‘ఓటు’ ఆయుధంతో భవిత మారుతుందంటూ అధికారులు చేస్తున్న ప్రచారం ఫలిస్తోంది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 3,654 పోలింగ్ కేంద్రాలున్నాయి. 2019 ఎన్నికల్లో 659 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించగా ప్రస్తుతం 475 ఉన్నాయి.
సమన్వయంతో ముందుకు..
- ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాల్లో మార్పు తీసుకొచ్చేందుకు పోలీసులు, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో ముందుకెళ్తున్నారు.
- సుమారు 30 ఏళ్ల కిందటి వరకు మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండేవి. మారుమూల గ్రామాలకు రవాణా వ్యవస్థ అంతంతమాత్రంగా ఉండటం కూడా ఇందుకు కారణం.
- గతంతో పోలిస్తే అక్షరాస్యత పెరగడంతో చదువుకున్న యువత ఓటు హక్కు వినియోగంపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. దీంతో పోలింగ్ శాతం పెరుగుతోంది.
- గొడవలు లేకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఊరూరా చైతన్యం కల్పిస్తున్నారు. కోడ్ ఉల్లంఘిస్తే కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు.
- రౌడీషీటర్లు, మాజీ మావోయిస్టులకు కౌన్సెలింగ్ ఇచ్చి గొడవలకు తావు లేకుండా ముందస్తుగా బైండోవర్లు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుకున్న సొత్తు రూ. 9.17 కోట్లు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. -
శిథిల వంతెనపై తప్పని ప్రయాణం!
[ 16-05-2024]
రామడుగు మండల కేంద్రంలోని మోతెవాగుపై వంతెన శిథిలమవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 1983లో నిర్మించిన వంతెన వరదలకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. -
యువత ఓటింగ్ 37.31 శాతమే!
[ 16-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత నిర్లిప్తత ప్రదర్శించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.. -
తక్కువ వ్యయంతో అధిక ఫలితాల సాధనకు కృషి
[ 16-05-2024]
సాగులో తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు సాధించేందుకు రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన చేస్తున్నారని జమ్మికుంట కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఎన్.వెంకటేశ్వర్రావు అన్నారు. -
ఇంకుడుగుంతపై నిర్లక్ష్యం
[ 16-05-2024]
నగరంలోని భగత్నగర్లో ఒకరు కొత్తగా జీ+2 ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఇంకుడుగుంత నిర్మించేందుకు ఫీజు కూడా చెల్లించారు. -
స్వతంత్రుల ప్రభావమెంత?
[ 16-05-2024]
ప్రతి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న స్వతంత్రులు ఓట్ల సాధనలో మాత్రం నామమాత్రంగానే నిలుస్తున్నారు.. ఈసారీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు ప్రచార ప్రక్రియపై దృష్టి పెట్టింది తక్కువ. -
పరిసరాల పరిశుభ్రతే రక్ష
[ 16-05-2024]
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచిఉంది. విష జ్వరాల బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరి దుర్మరణం
[ 16-05-2024]
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ప్రమాదవశాత్తు శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్(39) దుర్మరణం చెందాడు. -
ఆదర్శలో ఇంటర్ ప్రవేశాలు
[ 16-05-2024]
ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన.. అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు.. నిష్ణాతులైన అధ్యాపకులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్ తరగతులకు ఆదరణ పెరుగుతోంది. -
భూసారం.. పరీక్షలతో ఫలం
[ 16-05-2024]
రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. -
సగం మందికే ఉపాధి
[ 16-05-2024]
వేసవి తాపంతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఉపాధి పనులకు కూలీల జాతర కొనసాగుతుంది. -
బోర్డులే తప్ప.. కనిపించని ఆటలు
[ 16-05-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు, యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గత ప్రభుత్వం పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో డిసెంబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని సరఫరా చేసింది. -
ఉత్పత్తిదారులకు నూలు.. నేతన్నలకు మేలు
[ 16-05-2024]
జాతీయ, అంతర్జాతీయ విపణిలో నూలు ధరల హెచ్చుతగ్గులు జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
చివరి దశకు యాసంగి రైతుబంధు పంపిణీ
[ 16-05-2024]
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నగదు జమ చివరి దశకు చేరుకుంది. అయిదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సొమ్ము గతంలోనే ఖాతాల్లో వేయగా ఆపై విస్తీర్ణం కలిగిన అన్నదాతలకు సాయం జమ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. -
నత్తనడకన పనులు.. రాకపోకలకు ఇబ్బందులు
[ 16-05-2024]
రద్దీ మార్గంలో లెవెల్ క్రాసింగ్లు ఎత్తివేసేందుకు రైల్వే శాఖ మంజూరు చేసిన పై వంతెన(ఆర్వోబీ)ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఈ-ఆఫీస్ మూసివేతపై అనుమానాలు.. గవర్నర్కు చంద్రబాబు లేఖ
-
ఆ విషయంలో ప్రధాని అవివేకంగా ఆలోచిస్తున్నారు: శరద్ పవార్
-
ఐఫోన్ SE 4, ఫోల్డబుల్ ఫోన్ వచ్చేది అప్పుడేనా..?
-
టిష్యూపేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం!
-
ఆఖర్లో కొనుగోళ్లు.. 677 పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్