భూసారం.. పరీక్షలతో ఫలం
రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి.
సిఫార్సుకన్నా 16-50 శాతం అధికంగా ఎరువుల వినియోగం
మినీ భూసార పరికరాలు
న్యూస్టుడే, జగిత్యాల వ్యవసాయం: రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. సాధారణంగా 2.5 ఎకరాలకొక నమూనాను తీసి విశ్లేషిస్తేనే కచ్చితమైన ఫలితాలు వస్తాయి. కానీ తక్కువ విస్తీర్ణంలో నమూనాలు తీయటం, ఫలితాలను ఆలస్యంగా ఇవ్వటంతో చాలామంది రైతులు ఆచరించటంలేదు. భూసార పరీక్షల్లేక, ఫలితాలు పొందినవారు కూడా రసాయన ఎరువుల మోతాదును విస్మరించటంతో సిఫార్సుకన్నా 16-50 శాతం వరకు అధికంగా ఎరువులు వాడుతున్నారు. 2.5 ఎకరాలకొక మట్టినమూనాను విశ్లేషించాలన్న ప్రభుత్వం అంచనా ప్రకారం జిల్లాలో భూమినిబట్టి కనీసం 1.75 లక్షల పరీక్షలు చేయాలి. ఒకసారి పరీక్షిస్తే మళ్లీ 2-3 సంవత్సరాల తరువాత మళ్లీ పరీక్షించాలి. ఎరువుల ధరలు, కాలుష్యం పెరిగిన నేపథ్యంలో భూసార పరీక్షల ఫలితాలకు అనుగుణంగానే ఎరువుల మోతాతును నిర్దేశించుకోవటం అవశ్యంగా మారింది.
జగిత్యాల జిల్లాలో సరైన విశ్లేషణకేంద్రం లేక కరీంనగర్కు పంపించాల్సి ఉండగా జిల్లాలోనే పూర్తిస్థాయి పరీక్షలకు ఇకమీదట ఏర్పాట్లు చేయాలి. 71 ఏఈవో క్లస్టర్లలోని రైతు వేదికల్లో మినీ భూసార పరీక్ష కేంద్రాలకు నిధులను విడుదల చేసి వినియోగంలోకి తేవాలి. అధికారుల సిఫార్సు మేరకు జగిత్యాలలో రూ.60 లక్షల నిధులతో భూసార పరీక్ష కేంద్రం నిర్మాణం, చల్గల్ ప్రదర్శన క్షేత్రంలోని ల్యాబ్ను వినియోగించటం, వ్యవసాయ కళాశాల, పొలాస పరిశోధనస్థానంలోనూ భూసార పరీక్షలు చేయించటంద్వారా పరీక్షల సంఖ్యను పెంచవచ్చు. కేంద్రం సూచించినట్లుగా భూసార పరీక్ష ఫలితాల కార్డులున్నవారికే రసాయన ఎరువులను విక్రయించాలి. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు, శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించి భూసార పరీక్షలను చేయించాల్సిఉంది.
సమగ్ర వివరాలతో కార్డులివ్వాలి
ప్రతిమొక్క తన జీవిత చక్రం పూర్తి చేసుకోవడానికి 17 రకాల పోషకాలు అవసరం. వీటిలో కర్బనం, ఆక్సిజన్, హైడ్రోజన్, నీరు, బొగ్గుపులుసు వాయువు, ప్రధాన పోషకాలైన నత్రజని, భాస్వరం, పొటాషియం, ద్వితీయ పోషకాలైన కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్లతో పాటు సూక్ష్మపోషకాలైన ఐరన్, జింక్, కాపర్, బోరాన్, నికెల్, మాలిబ్దినం, మాంగనీస్ ఉండాలి. భూసార పరీక్షల ద్వారా ప్రధాన, ద్వితీయ, సూక్ష్మపోషకాలశాతం తెలిస్తే మనం వేయాల్సిన ఎరువులశాతం తెలుస్తుంది. అలాగే భూమి స్వభావం పీహెచ్ స్థాయి అంటే ఆమ్ల గుణమా క్షార గుణమా, మధ్యస్థమా అనే వివరాలు, ఎలక్ట్రో కండక్టివిటీ(ఈసీ) లవణాల మోతాదును, సస్యరక్షణ సిఫారసులు తెలుస్తాయి కాబట్టి రైతులందరి నేలలను పరీక్ష చేసేలా చర్యలు తీసుకోవాల్సిఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బడికి వేళాయె!
[ 12-06-2024]
ఆటాపాటలతో వేసవి సెలవులను సరదాగా గడిపిన విద్యార్థులు నేటి నుంచి బడి బాట పట్టనున్నారు. ఇప్పటి వరకు ఆలస్యంగా నిద్రలేచినా ఏమి అనని అమ్మానాన్నలు.. ఇకపై పొద్దునే బడికి టైమ్ అవుతుంది. రెడీకœండి అంటూ మేల్కొల్పుతారు. -
పంట బీమా.. రైతన్న ధీమా
[ 12-06-2024]
భూమిని దుక్కి దున్నింది మొదలు విత్తనం నాటి పంట చేతికొచ్చే వరకు ప్రకృతి సహకరించాలని రైతు రోజు దేవుడిని వేడుకుంటాడు. కానీ ప్రకృతి ప్రకోపానికి పంటలు కొన్ని మొదట్లోనే.. మరికొన్ని చేతికి వచ్చే దశలో నాశనమవుతాయి. అన్నదాతల ఆరుగాల కష్టం బూడిదలో పోసిన పన్నీరుగానే మారుతుంది. -
అంధకారంలో స్మార్ట్ రోడ్లు
[ 12-06-2024]
కరీంనగర్ ప్రధాన, అంతర్గత రహదారులను అందంగా తీర్చిదిద్దారు. రోడ్లు, డ్రైనేజీలు, నడకదారులు, మొక్కలు నాటి, రెయిలింగ్ ఏర్పాటు చేశారు. రహదారులకు ఇరువైపులా కొత్త స్తంభాలు వేసి వీధిదీపాలు బిగించారు. -
మార్కింగ్తోనే మమ అనిపించారు
[ 12-06-2024]
ఆధ్యాత్మిక క్షేత్రంగా రోజు రోజుకు అభివృద్ధి చెందుతున్న వేములవాడలోని మొదటి బైపాస్ రోడ్డులోని మూలవాగు వంతెన వైపు బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వీటిని గుర్తించి మార్కింగ్ ఇచ్చిన అధికారులు తొలగింపును మరిచిపోయారు. -
వరి విత్తనం.. మరింత భారం
[ 12-06-2024]
వర్షాకాలం పంటల సాగుకు రైతులు సన్నద్ధం అవుతున్నారు. వరి నారుమడులు పోయడానికి సిద్ధమవుతుండగా.. ప్రైవేటు కంపెనీలు బ్రాండ్ల పేరిట వరి విత్తనాల ధరలను పెంచేశాయి. 25, 30 కిలోల బస్తాల సర్టిఫైడ్ విత్తనాలకు అదనంగా రూ.100 నుంచి రూ.120 వరకు పెంచి విక్రయిస్తున్నారు. -
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరిన్ని సేవలు
[ 12-06-2024]
వైద్య ఆరోగ్య శాఖలో పలు పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. గత కొన్నాళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్య విధాన పరిషత్, బోధనాసుపత్రుల్లో ఖాళీల కొరత ఆరోగ్య సేవలపై ప్రభావం చూపుతోంది. క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు, హెల్త్ అసిస్టెంట్లు లేకపోవడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. -
తగ్గిన దిగుబడి.. ముగిసిన సీజన్
[ 12-06-2024]
-
ఎత్తిపోతలపై పట్టింపేదీ?
[ 12-06-2024]
రెండు వేల ఎకరాల బీడు భూములను సస్యశ్యామలం చేయాలన్న తలంపుతో మల్లాపూర్ మండలం ఒబులాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన సోమేశ్వర ఎత్తిపోతల పథకం అధికారులు, ప్రజాప్రతినిధుల పట్టింపులేని కారణంగా నిరుపయోగంగా మారింది. -
అసంపూర్తి పనులు.. మౌలిక వసతుల కరవు
[ 12-06-2024]
-
పల్లెల నుంచి బడులకు వచ్చేదెలా!
[ 12-06-2024]
మహిళలకు ఉచిత ప్రయాణ సేవలు అందిస్తున్న ఆర్టీసీ అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో రవాణా సౌకర్యాలను మెరుగు పరచడంపై దృష్టి సారించడం లేదు. దీంతో ఆయా గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. -
ఒప్పంద కార్మికుల విభజన.. తప్పని ఆందోళన
[ 12-06-2024]
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్, కార్పొరేషన్లలో పనిచేస్తున్న వివిధ విభాగాల్లోని ఒప్పంద కార్మికులు, ఉద్యోగులను రెండు విభాగాలుగా విభజించి వేతనాలు చెల్లించేలా ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో 970పై కార్మికవర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
పూడిక నుంచి రక్షణ ఎలా?
[ 12-06-2024]
మధ్యమానేరు జలాశయంలోకి పూడిక చేరకుండా చేపట్టే నియంత్రణ చర్యలేవీ ముందుకు సాగడం లేదు. నిర్మాణం పూర్తయిన 2017 సెప్టెంబరు నుంచి జలాశయంలో నీటిని నింపడం ప్రారంభించారు. దీని పూర్తి సామర్థ్యం 27.873 టీఎంసీలుగా కాగా, ఏటా వర్షాలకు నీటి నిల్వతో కళకళలాడుతోంది. -
19న మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు
[ 12-06-2024]
జిల్లా మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు ఈనెల 19వ తేదీన కరీంనగర్లో నిర్వహిస్తున్నట్లు ఎన్నికల అధికారి సహకార శాఖ డిప్యూటీ రిజిస్ట్రార్ సి.హెచ్.మనోజ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
చంద్రబాబు ప్రమాణ స్వీకారం.. భారీగా చేరుకుంటున్న కార్యకర్తలు
-
1995లో తోడల్లుడు.. ఇప్పుడు వదిన
-
ఎన్నికల ముందే రూ.998 కోట్ల ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు
-
మెగా ఫుడ్ పార్క్ భూములు జవహర్రెడ్డి బినామీల పరం!: జనసేన నేత మూర్తి యాదవ్
-
కల్కి సినిమాలో పెరుమాళ్లపాడు ఆలయం
-
వైకాపా తరఫున పందేలు కాసి అప్పులపాలు.. కృష్ణా బ్యారేజీలోకి దూకి ఆత్మహత్య