యువశక్తి కీలకం.. ఉపాధితోనే ప్రోత్సాహం
నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు.
ఉద్యోగ నైపుణ్య శిక్షణతోనే ఇందూరు యువతకు మేలు
యువత చేతిలోనే దేశ భవిత ఉన్నా మానవ వనరుల సమర్థ వినియోగం కొరవడింది. అధిక శాతం యువత ఉపాధి అవకాశాలు లేక కునారిల్లుతోంది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిజామాబాద్ లోక్సభ స్థానంలో యువశక్తిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది.
న్యూస్టుడే, జగిత్యాల ధరూర్క్యాంపు: నిజామాబాద్ లోక్సభా స్థానం పరిధిలో 2011 లెక్కల ప్రకారం మొత్తం జనాభా 19 లక్షలు కాగా తాజాగా వెల్లడైన ఓటరు జాబితా ప్రకారం 18 ఏళ్ల నుంచి 41 ఏళ్ల వయసు యువత 8.39 లక్షల మంది ఉన్నారు. ఓటర్లలో సింహభాగం యువతే కావడంతో వారిని ఆకట్టుకునేందుకు నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో విద్య, ఉద్యోగ, ఉపాధి పరంగా తమ సమస్యలు పరిష్కరించాలని యువ ఓటర్లు కోరుతున్నారు.
అనుబంధ పరిశ్రమలతో ప్రయోజనం
- లోక్సభ స్థానంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు బాసర జోన్ పరిధిలోకే వస్తాయి. నూతన జోనల్ విధానంలో జిల్లా, జోన్, బహుళ జోన్ల కేడర్లలో ప్రత్యక్ష నియామకాలు చేపట్టి 95 శాతం స్థానికులకే అవకాశం కల్పించాలని యువత కోరుతోంది.
- నియోజకవర్గ పరిధిలో దాదాపు 3.20 లక్షల మంది ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం ద్వారా కొలువుల సాధనకు అండగా నిలవాలని నిరుద్యోగులు విన్నవిస్తున్నారు.
- స్థానికంగా తెలంగాణ విశ్వవిద్యాలయం సహా పశువైద్య కళాశాల, వ్యవసాయ కళాశాల, నర్సింగ్ కళాశాల, న్యాక్, పాలిటెక్నిక్, వృత్తివిద్య, ఐటీఐ, ఫుడ్టెక్నాలజీ, సీడ్ టెక్నాలజీ, వ్యవసాయ పాలిటెక్నిక్ తదితర ఇంజినీరింగ్ విద్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో టాస్క్ శిక్షణ అమలవుతున్నా ఎక్కువ మంది ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదు. అన్ని కళాశాలల విద్యార్థులకు ఉపకరించేలా ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో ప్రైవేటు కంపనీలతో ప్రాంగణ ఎంపికలు చేపట్టాలి. ్య ఇక్కడి యువత ఉన్నత చదువులకు, ఉపాధి కోసం విదేశాల బాట పడుతోంది. ముఖ్యంగా గల్ఫ్ వెళ్లే వారు నకిలీ ఏజెంట్ల బారిన పడి మోసపోతున్నారు. అలాగే ఉన్నత విద్య కోసం పేద విద్యార్థులు విదేశాలకు వెళ్లడం ఆర్థిక భారంగా మారింది. ఇతర దేశాలు, ప్రాంతాలకు చెందిన కంపెనీలతో ప్రభుత్వం మధ్యవర్తిత్వం వహించడం ద్వారా తమకు అండగా నిలవాలని యువత ఆశిస్తోంది.
- ఉన్నత విద్యావంతులు కూడా వ్యవసాయంవైపు ఆసక్తి చూపుతున్నారు. వీరు ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకొని దిగుబడులను పెంచేలా ప్రత్యేక శిక్షణ శిబిరాలు నిర్వహిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది.
- వ్యవసాయాధారిత ప్రాంతమైనందున అనుబంధ పరిశ్రమలను నెలకొల్పడం ద్వారా యువతకు ఉద్యోగాల కల్పనతో పాటు, రాయితీ రుణాలు ఇస్తే స్వయం ఉపాధి కల సాకారమవుతుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పట్టుకున్న సొత్తు రూ. 9.17 కోట్లు
[ 16-05-2024]
పార్లమెంటు ఎన్నికల సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో పోలీసులు, ఎన్నికల పర్యవేక్షణ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నగదుతో పాటు ఇతర వస్తువులు పట్టుబడ్డాయి. -
శిథిల వంతెనపై తప్పని ప్రయాణం!
[ 16-05-2024]
రామడుగు మండల కేంద్రంలోని మోతెవాగుపై వంతెన శిథిలమవడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. 1983లో నిర్మించిన వంతెన వరదలకు ఇరువైపులా మట్టి కొట్టుకుపోయింది. -
యువత ఓటింగ్ 37.31 శాతమే!
[ 16-05-2024]
ఓటు హక్కును వినియోగించుకోవడంలో యువత నిర్లిప్తత ప్రదర్శించినట్లు పోలింగ్ సరళిని బట్టి తెలుస్తోంది.. -
తక్కువ వ్యయంతో అధిక ఫలితాల సాధనకు కృషి
[ 16-05-2024]
సాగులో తక్కువ వ్యయంతో అధిక ఫలితాలు సాధించేందుకు రైతాంగానికి కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా శాస్త్రవేత్తలు అవగాహన చేస్తున్నారని జమ్మికుంట కేవీకే సీనియర్ శాస్త్రవేత్త ఎన్.వెంకటేశ్వర్రావు అన్నారు. -
ఇంకుడుగుంతపై నిర్లక్ష్యం
[ 16-05-2024]
నగరంలోని భగత్నగర్లో ఒకరు కొత్తగా జీ+2 ఇంటి నిర్మాణం కోసం అనుమతి తీసుకొని పనులు పూర్తి చేశారు. ఆ సమయంలో ఇంకుడుగుంత నిర్మించేందుకు ఫీజు కూడా చెల్లించారు. -
స్వతంత్రుల ప్రభావమెంత?
[ 16-05-2024]
ప్రతి లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్న స్వతంత్రులు ఓట్ల సాధనలో మాత్రం నామమాత్రంగానే నిలుస్తున్నారు.. ఈసారీ ప్రధాన పార్టీల అభ్యర్థులు తప్పితే మిగతా వారు ప్రచార ప్రక్రియపై దృష్టి పెట్టింది తక్కువ. -
పరిసరాల పరిశుభ్రతే రక్ష
[ 16-05-2024]
వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో వ్యాధుల ముప్పు పొంచిఉంది. విష జ్వరాల బారినుంచి కాపాడుకునేందుకు పరిసరాల పరిశుభ్రత పాటించడం అత్యంత ఆవశ్యకం. -
డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి ఒకరి దుర్మరణం
[ 16-05-2024]
కరీంనగర్-వరంగల్ జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడిన ఘటనలో ప్రమాదవశాత్తు శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన పూదరి శ్రీనివాస్(39) దుర్మరణం చెందాడు. -
ఆదర్శలో ఇంటర్ ప్రవేశాలు
[ 16-05-2024]
ఆంగ్లమాధ్యమంలో విద్యాబోధన.. అధునాతనమైన తరగతి గదులు, ప్రయోగశాలలు.. నిష్ణాతులైన అధ్యాపకులతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నెలకొల్పిన ఆదర్శ పాఠశాలల్లోని ఇంటర్ తరగతులకు ఆదరణ పెరుగుతోంది. -
భూసారం.. పరీక్షలతో ఫలం
[ 16-05-2024]
రైతులందరి భూముల్లోని సారాన్ని తెలుసుకునేలా మట్టిపరీక్షలను తప్పనిసరి చేస్తామని ఇటీవలే రాష్ట్ర వ్యవసాయశాఖమంత్రి ప్రకటించటంతో అన్నదాతల్లో ఆశలు రేకెత్తాయి. -
సగం మందికే ఉపాధి
[ 16-05-2024]
వేసవి తాపంతోపాటు ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నప్పటికీ ఉపాధి పనులకు కూలీల జాతర కొనసాగుతుంది. -
బోర్డులే తప్ప.. కనిపించని ఆటలు
[ 16-05-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంత విద్యార్థులు, యువతలోని క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు గత ప్రభుత్వం పల్లెలు, పట్టణాల్లో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. -
పాఠ్య పుస్తకాలొస్తున్నాయ్
[ 16-05-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలు జిల్లాకు చేరుకున్నాయి. 2023-24 విద్యా సంవత్సరంలో డిసెంబరు నాటికి ప్రభుత్వ పాఠశాలల్లో యూడైస్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగా వీటిని సరఫరా చేసింది. -
ఉత్పత్తిదారులకు నూలు.. నేతన్నలకు మేలు
[ 16-05-2024]
జాతీయ, అంతర్జాతీయ విపణిలో నూలు ధరల హెచ్చుతగ్గులు జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. -
చివరి దశకు యాసంగి రైతుబంధు పంపిణీ
[ 16-05-2024]
జిల్లాలో యాసంగి సీజన్కు సంబంధించి రైతుబంధు నగదు జమ చివరి దశకు చేరుకుంది. అయిదెకరాలలోపు భూమి కలిగిన రైతులకు పెట్టుబడి సొమ్ము గతంలోనే ఖాతాల్లో వేయగా ఆపై విస్తీర్ణం కలిగిన అన్నదాతలకు సాయం జమ చేస్తున్నట్లు ఇటీవల సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. -
నత్తనడకన పనులు.. రాకపోకలకు ఇబ్బందులు
[ 16-05-2024]
రద్దీ మార్గంలో లెవెల్ క్రాసింగ్లు ఎత్తివేసేందుకు రైల్వే శాఖ మంజూరు చేసిన పై వంతెన(ఆర్వోబీ)ల నిర్మాణం నత్తనడకన సాగుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
బంజారాహిల్స్లో నాలాపై కుంగిన రోడ్డు.. రాత్రికి వడగళ్ల వర్షం పడే అవకాశం!
-
అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా: జాన్వీ కపూర్
-
వైకాపా నేత ఇంట్లో పెట్రోల్ బాంబుల కలకలం
-
హైదరాబాద్లో యువతికి అనుమానాస్పద రీతిలో గాయాలు!
-
హైటెక్ మోసగాళ్లు.. 12 సెకన్లలో రూ.200 కోట్లు కొట్టేశారు..!
-
72 గంటలు.. రూ.కోట్లల్లో నోట్ల గుట్టలు