చట్టసభల్లో చక్కని చోటు!
విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నలుగురు, భాజపా నుంచి ముగ్గురు, జేడీఎస్ పక్షాన ఒకరు చొప్పున మహిళా ప్రతినిధులు ఈసారి విధానసౌధలో అడుగు పెట్టనున్నారు.
బెళగావి గ్రామీణలో విజయం సాధించిన లక్ష్మీ హెబ్బాళ్కర్తో మద్దతుదారులు
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : విధానసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నలుగురు, భాజపా నుంచి ముగ్గురు, జేడీఎస్ పక్షాన ఒకరు చొప్పున మహిళా ప్రతినిధులు ఈసారి విధానసౌధలో అడుగు పెట్టనున్నారు. మరో స్వతంత్య్ర అభ్యర్థి లతా మల్లికార్జున (హరపనహళ్లి) స్వతంత్రంగా విజయం సాధించారు. ఈసారి ఎన్నికల బరిలో 2615 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా అందులో మహిళల సంఖ్య 184. కాంగ్రెస్ అభ్యర్థులు.. బెళగావి గ్రామీణ నియోజకవర్గంలో లక్ష్మీ హెబ్బాళ్కర్, కేజీఎఫ్లో రూపాకళ, ముడిగెరెలో నయనా జ్యోతి విజయం సాధించారు. మహదేవపురలో భాజపా అభ్యర్థి మంజుళా లింబావళి, సుళ్యలో భగీరథి మురళయ్య, నిప్పాణిలో శశికళ జొల్లె, దేవదుర్గలో జేడీఎస్ అభ్యర్థి కరెమ్మ నాయక్ విజయం సాధించారు. ఈ తొమ్మిది మందిలో ఐదుగురు తొలిసారిగా సభాపర్వంలో అడుగు పెట్టనున్నారు. జయనగరలో సౌమ్యారెడ్డి ఆధిక్యంలో ఉన్నా.. ఇంకా ఫలితం ప్రకటించలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లింగాయత్ల గ్యారంటీ.. విజయానికి దివిటీ
[ 03-05-2024]
కన్నడనాట ఈనెల 7న జరగనున్న 14 నియోజకవర్గాల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు లింగాయత్ల ప్రాబల్యం ఉన్నవే! ఏప్రిల్ 26న ఎన్నికలు నిర్వహించిన 14 క్షేత్రాల్లో ఒక్కలిగల బలం ఎక్కువగా ఉంటే.. మలివిడత ఆ ఘనత లింగాయత్లదే. -
పెద్ద కుటుంబానికి తలవంపులు
[ 03-05-2024]
లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణ సిట్ అధికారుల ముందు గురువారం విచారణకు హాజరు కాలేదు. హాసన నుంచి భార్య భవానీతో కలిసి బెంగళూరుకు చేరుకున్న ఆయన పద్మనాభనగరలోని తండ్రి, మాజీ ప్రధాని దేవేగౌడ నివాసానికి వెళ్లారు. -
రాజకీయ వింతలు.. ప్రచారం కొత్తపుంతలు
[ 03-05-2024]
రాష్ట్రంలో రెండోదశ ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న కొద్దీ నేతల నోట ప్రజా సంక్షేమం, ప్రగతి మాట కంటే వివాదాస్పద అంశాలే దొర్లుతున్నాయి. ఎన్నికల ముందు ప్రణాళికల్లో రచించుకున్న దీర్ఘకాలిక లక్ష్యాల కంటే రోజువారీ సంఘటన అంశాలతో నేతలు ప్రచారాన్ని నెగ్గుకొస్తున్నారు. -
ప్రేమించలేదని.. వివాహిత ఇంటికి నిప్పు
[ 03-05-2024]
తనను పెళ్లి చేసుకోవాలంటూ ఒక వివాహితను వేధిస్తూ.. ఆమె అందుకు నిరాకరించడంతో ఇంటికి నిప్పు పెట్టిన అర్బాజ్ అనే పిచ్చి ప్రేమికుడ్ని సంపిగెహళ్లి ఠాణా పోలీసులు అరెస్టు చేశారు. -
సిద్ధు సర్కారు అన్ని రంగాల్లో విఫలం
[ 03-05-2024]
రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని భాజపా అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి బి.ఎస్.యడియూరప్ప ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి లోక్సభ భాజపా అభ్యర్థి బి.శ్రీరాములు తరఫున యడియూరప్ప కురుగోడు తాలూకాలో ప్రచారం నిర్వహించారు. -
కల్యాణ్ జువెలరీ దుకాణంలో అగ్నిప్రమాదం
[ 03-05-2024]
బళ్లారి నగరం తేరువీధిలో మార్టిన్ మార్గంలో ఉన్న కల్యాణ్ జువెలరి దుకాణంలో గురువారం సాయంత్రం జరిగిన అగ్నిప్రమాదంలో ఐదుగురు కార్మికులు గాయపడ్డారు. -
హరపనహళ్లిని ప్రగతి దారిలో నడిపించేదెవరు?
[ 03-05-2024]
దావణగెరె లోక్సభ నియోజకవర్గం, ప్రస్తుతం విజయనగర జిల్లా పరిధిలోకి వచ్చే, వెనుకబడిన తాలూకా హరపన హళ్లి అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాధాన్యం ఉంది. ఇప్పటి వరకు హరపన హళ్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలుగా గెలిచివారిలో సగంకన్నా ఎక్కువ మంది స్థానికేతరులే కావడం ప్రత్యేకం. -
ఓటేస్తే..ఉచితంగా నేత్రాలంకరణ
[ 03-05-2024]
తమకే ఓటు వేయాలని ఓటర్లకు తాయిలాలు ఇచ్చేవారే ఎక్కువ. ఇక్కడో యువతి ఓటు శాతం పెరగాలని ఓటేసి వచ్చిన మహిళలకు ఉచితంగా ఐబ్రో అలంకరణ భాగ్యాన్ని కల్పిస్తానని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
China: చంద్ర శిలల సేకరణకు బయల్దేరిన చైనా..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఘోర బస్సు ప్రమాదం.. పాక్లో 20 మంది దుర్మరణం
-
ప్రభాకర్రావు కోసం పోలీసుల వేట .. అరెస్టు వారెంట్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్
-
50 కోట్ల ప్రయాణికుల మైలు రాయిని దాటిన హైదరాబాద్ మెట్రో
-
వివాహిత ఇంటికి బాంబు పార్సిల్ పంపిన ప్రియుడు.. భర్త, కుమార్తె మృతి