భాజపా తీరు ప్రమాదకరం
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నాయకులతో వెనుకబడిన వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు.
ప్రజలకు సిద్ధు హెచ్చరిక
ప్రసంగిస్తున్న సిద్ధరామయ్య.. చిత్రంలో అభ్యర్థి సంయుక్త పాటిల్
బాగలకోటె, న్యూస్టుడే : ప్రధానమంత్రి నరేంద్రమోదీ, భాజపా నాయకులతో వెనుకబడిన వర్గాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సూచించారు. రిజర్వేషన్ల విషయంలోనూ అబద్ధాలను ప్రచారం చేసేందుకు ప్రధాని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పేందుకు కాషాయ పార్టీ నాయకులకు ఎటువంటి సిగ్గు లేదన్నారు. మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకిస్తూ భాజపా నాయకుడు రామాజోయిస్ సర్వోన్నత న్యాయస్థానంలో అర్జీ వేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. బాగలకోటె జిల్లా రబకవి బనహట్టిలో లోక్సభ అభ్యర్థి సంయుక్త పాటిల్కు మద్దతుగా నిర్వహించిన బహిరంగ సభలో సిద్ధు శనివారం మాట్లాడారు. దేశంలో మొదటి విడత 102 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయ్యాక ఓడిపోతామని కాషాయ పార్టీ గుర్తించిందన్నారు. అందుకే అబద్ధాలు, ద్వేష ప్రసంగాలు చేస్తున్నారని ఆరోపించారు. వెనుకబడినవర్గాల రిజర్వేషన్లను రద్దు చేసి, వాటిని ముస్లింలకు ఇస్తున్నారని తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారని దుయ్యబట్టారు. సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన సూచన చేసిన తర్వాత కరవు పరిహారాన్ని విడుదల చేసి, దాన్ని తమ ఔదార్యంగా ప్రకటించుకోవడం సిగ్గు చేటన్నారు. భాజపా అభ్యర్థి గద్దిగౌడర్ను ఓడించాలని ఓటర్లను కోరారు. రెండు దశాబ్దాలుగా స్థానికుల సమస్యలను పరిష్కరించని గద్దిగౌడర్తో ఓటర్లకు అవసరం లేదన్నారు. మంత్రులు తిమ్మాపూర్, శివానంద పాటిల్, పార్టీ నేతలు లక్ష్మణ సవది, వినయ్ కులకర్ణి, ఎస్ఆర్పాటిల్, ఉమాశ్రీ, విజయానంద కాశప్పనవర్, అజయ్ కుఆర్, సునీత పాటిల్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగేళ్ల డిగ్రీకి తిలోదకాలు
[ 11-05-2024]
రాష్ట్రంలో ప్రభుత్వాలు మారేకొద్దీ వారి విధానాలకు అనుగుణంగా పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు మాత్రమే మారతాయనుకుంటే పొరపాటే. చదువులు కూడా ప్రభుత్వాలకు అనుగుణంగా మార్పుబాటలో నడుస్తున్నాయి. -
మిత్రుల పయనమెటో?
[ 11-05-2024]
రాష్ట్రంలో భారతీయ జనతాపార్టీ- జనతాదళ్ మైత్రితో రాజకీయ వాతావరణం ఆసక్తిగా మారింది. లోక్సభ ఎన్నికల కోసం ఈ రెండు పార్టీల పొత్తు కాంగ్రెస్ను కాస్త ఆందోళనకు గురి చేసినా.. సరిగ్గా ఎన్నికల సమయంలో పొత్తు చేసుకున్న మిత్రుల మధ్య అలజడి మొదలైంది. -
మన పోలీసులే భేష్
[ 11-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ లైంగిక దౌర్జన్యాలకు సంబంధించిన కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించవలసిన అవసరం లేదని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. దర్యాప్తు చేసేందుకు కర్ణాటక పోలీసులు సమర్థవంతులని పేర్కొన్నారు. -
వారిల్లు చక్కదిద్దుకోనివ్వండి..
[ 11-05-2024]
‘లోకపు వంకరను మీరెందుకు సరి చేస్తారు? ముందు మీ ఇంటి సమస్యను పరిష్కరించుకోండి’ అనే బసవేశ్వరుని వచనాన్ని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఉటంకించారు. -
జిందాల్ ఉక్కు పరిశ్రమలో ఘోర ప్రమాదం
[ 11-05-2024]
సండూరు తాలూకా తోరణగల్లు సమీపంలోని జిందాల్ స్టీల్ప్లాంట్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు ఉద్యోగులు దుర్మరణం చెందారు. ఈ దుర్ఘటన శుక్రవారం ఉదయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
కానరాని కావేరి
[ 11-05-2024]
చల్లని జలవేణి.. కావేరి మాత కానరాని దయనీయ పరిస్థితి. నిత్యం నీటి గలగలలతో కళకళలాడే జలదేవేరి అడుగంటి పోయింది. కనీసం చిన్న పాయల్లోనూ ప్రవాహం కానరాదు. ఎగువన కొడగు జిల్లాలో వానలు ప్రారంభమైనాయన్న మాటేగానీ.. ప్రవాహం కదలిన దాఖలాలు కరవు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
[ 11-05-2024]
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం సాయంత్రం బళ్లారి నగరంలో జరిగింది. గాయపడిన ఇద్దరు వ్యక్తులు గోవిందరాజులు(37), రంజిత్(27)గా గుర్తించారు. -
మహ్మద్ ఫర్దీన్.. సంస్కృతంలో శభాష్!
[ 11-05-2024]
రాజధాని నగరంలోని హొంబేగౌడ నగర పాలికె పాఠశాలలో చదివి, పదో తరగతి పరీక్షలు రాసిన మహ్మద్ ఫర్దీన్ పాషాకు సంస్కృతంలో 125కు 125 మార్కులు వచ్చాయి. పరీక్షల్లో 625కు 549 మార్కులతో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణుడయ్యాడు. -
ఆమె ప్రతిభను అడ్డుకోలేని వైకల్యం
[ 11-05-2024]
దావణగెరె సిద్ధగంగ పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని పి.యుక్తి 625కి 593 మార్కులు సాధించింది. పుట్టుకతోనే దృష్టి లోప సమస్యలు ఉన్న ఆమె ప్రతిభను వైకల్యం అడ్డుకోలేకపోయింది. -
తెలుగు రాష్ట్రాలకు ఓటర్ల పయనం
[ 11-05-2024]
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఓటు హక్కు ఉన్న వారు బెంగళూరు నుంచి శుక్రవారం సాయంత్రం తమ నియోజకవర్గాలకు పయనమయ్యారు. భద్రత కోసం పోలీసులు, హోం గార్డులకు ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎస్ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచింది.