చెలరేగిన నిరసన ప్రజ్వాల
లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన లోక్సభ సభ్యుడు, జనతాదళ్ యువ నాయకుడు ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలని యువ కాంగ్రెస్ సమితి డిమాండు చేసింది.
బెంగళూరులో ప్రజ్వల్ దిష్టి బొమ్మకు నిప్పంటించిన ఆందోళనకారులు
బెంగళూరు (సదాశివనగర), న్యూస్టుడే : లైంగిక దౌర్జన్యం, వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన లోక్సభ సభ్యుడు, జనతాదళ్ యువ నాయకుడు ప్రజ్వల్, ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణలపై కఠిన చర్యలు తీసుకోవాలని యువ కాంగ్రెస్ సమితి డిమాండు చేసింది. ప్రజ్వల్, రేవణ్ణ, కుమారస్వామి, దేవేగౌడ చిత్రాలు ఉన్న మాస్కులు ధరించి రేసు కోర్సు రోడ్డులోని పార్టీ కార్యాలయం వద్ద ఆదివారం ధర్నాకు దిగారు. ప్రజ్వల్ దిష్టిబొమ్మకు నిప్పంటించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజ్వల్పై ఆరోపణలు ఉన్నప్పటికీ దళపతులు, వారి మిత్రపక్షం భాజపా మౌనంగా ఉన్నట్లు ఆందోళనకు నేతృత్వం వహించిన పీసీసీ ప్రధాన కార్యదర్శి ఎస్.మనోహర్ ఆరోపించారు. లైంగిక దౌర్జన్యానికి పాల్పడి, వాటిని చరవాణి కెమెరాలతో చిత్రీకరించి బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. గతంలోనూ పలువురు యువతులపై ప్రజ్వల్ ఇదే తరహా లైంగిక దౌర్జన్యానికి పాల్పడినా, ఎవరూ ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయలేకపోయారని వివరించారు. పార్టీ నేతలు ఆనంద్, హేమరాజు, రామకృష్ణ, ఉమేశ్, రంజిత్ చంద్రశేఖర్, ఉమాబాయి తదితరులు ధర్నాలో పాల్గొన్నారు.
సంబంధం లేదు.. లోక్సభ సభ్యుడు ప్రజ్వల్ రేవణ్ణకు- జనతాదళ్కు ఎటువంటి సంబంధ లేదని మాజీ మంత్రి జీటీ దేవేగౌడ వ్యాఖ్యానించారు. ప్రజ్వల్తో భాజపాకు, జనతాదళ్కు ఎటువంటి సంబంధం లేదన్నారు. సిట్ దర్యాప్తుతో వాస్తవాలు బయటకు వస్తాయని, నేరం చేసి ఉంటే వారికి శిక్ష పడుతుందని పేర్కొన్నారు.
పరువు తీశారు
లోక్సభ సభ్యునిగా ఉంటూ పలువురు మహిళలు, యువతులపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడిన ప్రజ్వల్ రేవణ్ణ దేశం పరువు తీశారని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ దుయ్యబట్టారు. ఆయన ఆదివారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ దీనిపై దళ్, భాజపా నాయకులు వివరణ ఇవ్వాలని డిమాండు చేశారు. ప్రజ్వల్ పేరిట వచ్చిన వీడియోలపై విపక్ష నేత అశోక్, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె ఎందుకు మౌనాన్ని ఆశ్రయించారని ప్రశ్నించారు. హస్తిన నుంచి దీనికి సంబంధించి తనకు రెండు రోజులుగా ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు సిట్ ఏర్పాటైందని తెలుసుకున్న తర్వాత ప్రజ్వల్ జర్మనీకి పరారయ్యాడని గుర్తించామని హోం మంత్రి డాక్టర్ జీ పరమేశ్వర్ తెలిపారు. నోటీసులు జారీ చేయడం, విచారణ తదితర అంశాలను ప్రత్యేక దర్యాప్తు దళం చూసుకుంటుందని, దీనిలో ప్రభుత్వ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. ప్రజ్వల్పై వచ్చిన ఆరోపణలపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ నోరు విప్పాలని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ కర్ణాటకకు వచ్చి ప్రజలను దారి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారని తన ఎక్స్కార్ప్ ఖాతాలో తప్పుపట్టారు. మంగళసూత్రాలు, ముస్లింలకు రిజర్వేషన్, ప్రణాళికకు సంబంధించిన అబద్ధాలు చెప్పే బదులుగా కన్నడిగులకు వాస్తవాలు చెప్పండి అంటూ హితవు పలికారు. మనసును నొప్పించే ఘటన హాసన జిల్లాలో చోటు చేసుకుందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నేత ఆయనూరు మంజునాథ్ శివమొగ్గలో వ్యాఖ్యానించారు. ఇంట్లో పని చేసేందుకు వచ్చిన మహిళతో పాటు, పలువురు యువతులను బెదిరించి ఒక రాజకీయ నాయకుడు అత్యాచారానికి పాల్పడడం శోచనీయమని ఆక్రోశించారు.
ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేయాలంటూ డీజీపీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ మహిళా కార్యకర్తల నిరసన
మోదీజీ స్పందించండి
బెంగళూరు (యశ్వంతపుర), న్యూస్టుడే : హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అనేక మంది ఆడబిడ్డల జీవితాలు నాశనం చేసినట్లు అశ్లీల వీడియోలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించాలని కాంగ్రెస్ మహిళా నేతలు డిమాండు చేశారు. బెంగళూరులోని కాంగ్రెస్భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో అధికార ప్రతినిధులు కవితారెడ్డి, మంజుళనాయుడు మాట్లాడారు. మాజీ ప్రధాని కుటుంబ వ్యవహారాలు ప్రజల్లో చర్చకు కారణమైనట్లు వివరించారు. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రాత్రికి రాత్రే విదేశాలకు వెళ్లిపోవడాన్ని ప్రశ్నించారు. ప్రతిదానికీ స్పందించే భాజపా నాయకులు శోభా కరంద్లాజె, సీటీరవి, విజయేంద్ర, బసవరాజ పాటిల్ యత్నాళ్, ఆర్.అశోక్ నోర్లు పెగలవెందుకని నిలదీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజ్వల్.. జాడే తెలియదాయె
[ 13-05-2024]
లైంగిక దౌర్జన్యాలకు పాల్పడిన ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కోసం ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో కాపు కాశారు. -
కమలనాథుల కలలు కల్లలే
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైన మెజార్టీ సాధించి కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తుందని పీసీసీ అధ్యక్షుడు- ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. -
కుటుంబ కథాచిత్రంగా జట్టి
[ 13-05-2024]
ప్రముఖ కథానాయిక రాగిణి ద్వివేది నటిస్తున్న ‘జట్టి’ చిత్ర నిర్మాణం వేడుకగా ప్రారంభమైంది. ఇటీవల చిత్రం ఫస్ట్లుక్ను విడుదల చేశారు. -
బాబు గెలుపునకు మేముసైతం
[ 13-05-2024]
ఈ నెల ఏడున జరిగిన పోలింగ్తో రాష్ట్రంలో రెండు విడతల పోలింగ్ పరిసమాప్తమైంది. ఇక్కడ పోలింగ్ ముగిసిన వెంటనే సింధనూరులోని అనేక మంది తెలుగు ప్రజలు ఆంధ్రప్రదేశ్లోని తమ స్వస్థలాలకు వెళ్లి -
సామాజిక మాధ్యమాలతో అప్రమత్తం
[ 13-05-2024]
సామాజిక మాధ్యమాలను వినియోగించుకునే వారు జాగరూకతతో ఉండాలని రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ నాగలక్ష్మి చౌదరి పిలుపునిచ్చారు. -
రైతులకే సర్కారు వెన్నుదన్ను
[ 13-05-2024]
రాష్ట్రంలో కరవు నివారణకే ప్రాధాన్యమిస్తామని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు. రైతుల ఇక్కట్లను పరిగణలోనికి తీసుకుని- వారికి సంఘీభావంగా ఈనెల 15న తన పుట్టినరోజు వేడుకలను రద్దు చేసుకుంటున్నానని, కాంగ్రెస్ కార్యకర్తలు, -
ప్రజ్వల్కు మోదీ అండ: కాంగ్రెస్
[ 13-05-2024]
హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జనతాదళ్)ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ రక్షిస్తున్నారని కర్ణాటక కాంగ్రెస్ ఆరోపించింది. -
మహిళ విషాదాంతం..
[ 13-05-2024]
ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి చెట్టుకొమ్మ విరిగి పడడంతో సవిత (48) అనే మహిళ మృతి చెందింది. ఎన్ఆర్పుర తాలూకా కట్టిమని గ్రామంలో ఆదివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్