భాజపాకు మాదిగలు ఓటేయొద్దు
అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు.
తప్పుదారి పట్టిస్తున్న మందకృష్ణ, మోత్కుపల్లి
ఐకాస వ్యవస్థాపకుడు పిడమర్తి రవి
మాట్లాడుతున్న పిడమర్తి రవి, చిత్రంలో వక్కలగడ్డ సోమచంద్రశేఖర్
ఖమ్మం ఖానాపురం హవేలి, న్యూస్టుడే: అధికారంలోకి వస్తే రాజ్యాంగం రద్దు చేస్తామని, రిజర్వేషన్లు తీసేస్తామని బహిరంగంగా ప్రకటిస్తున్న భాజపాకు మాదిగలు ఓటు వేయవద్దని మాదిగ ఐకాస వ్యవస్థాపకుడు, కాంగ్రెస్ నేత డా.పిడమర్తి రవి పిలుపునిచ్చారు. ఖమ్మం ప్రెస్క్లబ్లో విలేకర్ల సమావేశంలో గురువారం మాట్లాడారు. రాష్ట్రంలో మందకృష్ణ మాదిగ, మోత్కుపల్లి నరసింహులు మాదిగలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు, హక్కులను కల్పించింది కాంగ్రెస్ పార్టీయే అన్నారు. భాజపా అధికారంలోకి వస్తే మొదటి దెబ్బ ముస్లింలపై, రెండో దెబ్బ దళితులపైన పడుతుందన్నారు. మోదీ రామాలయం కట్టి ఓట్లు అడుగుతున్నారని.. ఎస్సీ వర్గీకరణ చేయకుండానే మాదిగలను ఎలా ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో వర్గీకరణ కేసు రిజర్వు అయిందని, తీర్పు అనుకూలంగా వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే దాన్ని అమలుచేయాల్సి ఉంటుందన్నారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలో ఇండియా కూటమి గెలిస్తే మందకృష్ణ ఎక్కడికి పోతార[ని ప్రశ్నించారు. రానున్న రోజుల్లో మాదిగలకు పదవులు ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారన్నారు. రాష్ట్రంలో రెండుచోట్ల సీటు కేటాయించకపోవడం వల్ల మాదిగలకు వచ్చిన నష్టం ఏమీ లేదని, భాజపా గెలిస్తే భవిష్యత్తే లేకుండా చేస్తారని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా మాదిగలు కాంగ్రెస్కు మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. మాదిగ నేత వక్కలగడ్డ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఖమ్మంలో 3.50 లక్షల మంది మాదిగలు అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశించే స్థాయిలో ఉన్నారని తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు గడ్డ యాదయ్య, మహా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తపాక నర్సింహారావు, మాదిగ ఐకాస నాయకులు మోదుగు జోగారావు, తెలంగాణ బహుజన సమితి రాష్ట్ర కన్వీనర్ గజ్జెల్లి మల్లికార్జున్, మాదిగ విద్యార్థి ఓయూ ఐకాస అధ్యక్షుడు జోగు గణేశ్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పదేళ్ల ప్రస్థానం.. భవిష్యత్తుకు స్ఫూర్తిదాయకం: కలెక్టర్
[ 03-06-2024]
తెలంగాణ దశాబ్ది ముంగిట నిలిచిన ఉజ్వల సందర్భంలో 60 ఏళ్ల పోరాట చరిత్ర, పదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని తలుచుకుంటూ... భవిష్యత్తు పురోగమనానికి ప్రేరణగా మలుచుకుందామని కలెక్టర్ గౌతమ్ అన్నారు. -
కుంచె కదిపితే.. జీవమొలికే చిత్రం!
[ 03-06-2024]
డే: వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు.. కుంచె పట్టారంటే అద్భుతమైన కళాకారుడు. చిత్ర కళల్లో నూతన ఒరవడులు సృష్టించి ప్రత్యేక చిత్రాలు రూపొందించటం ఆయన ప్రత్యేకత. -
వేసవిలో... దాహార్తి తీర్చే నేస్తం!
[ 03-06-2024]
‘దాహం తీర్చడం గొప్ప సేవ, అదృష్టంగా భావిస్తున్నా. పింఛనులో కొంత మొత్తాన్ని సంచార చలివేంద్రానికి ఖర్చుచేస్తున్నా. ఎండకాలంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైతే చాలు, నా వాహనం బయటకు బయల్దేరుతుంది. -
ఇద్దరి ప్రాణాలు తీసిన నీటి ట్యాంకర్
[ 03-06-2024]
సంతోషంగా హైదరాబాద్ నగరాన్ని తిలకించేందుకు వచ్చిన సందర్శకుల్లో ఇద్దరిని వాటర్ ట్యాంకర్ రూపంలో వచ్చిన మృత్యువు కబళించిన ఘటన ఇది. నార్సింగి ఇన్స్పెక్టర్ హరికృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
వడదెబ్బతో ఐదుగురి దుర్మరణం
[ 03-06-2024]
ఉమ్మడి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆదివారం వడదెబ్బతో ఐదుగురు మృత్యువాత పడ్డారు. -
ప్రజాతీర్పు..లెక్కల కూర్పు
[ 03-06-2024]
లోక్సభ స్థానాల ఓట్ల లెక్కింపు క్రతువుకు రంగం సిద్ధమైంది. కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం సజావుగా సాగేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుచేయాలని నిర్ణయించింది.