కనుమరుగైన హెలికాప్టర్ నియోజకవర్గం
భద్రాచలం లోక్సభ స్థానానికి హెలికాప్టర్ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది.
భద్రాచలం, న్యూస్టుడే: భద్రాచలం లోక్సభ స్థానానికి హెలికాప్టర్ నియోజకవర్గంగా పేరుండేది. ఈ స్థానంలో వచ్చిన మార్పులు అన్నీఇన్నీ కావు. దేశ ప్రధానులు సైతం ఇక్కడి ఎంపీలను పేరు పెట్టి పిలిచేవారంటే అది నాయకుల గొప్పతనంతో పాటు ఈస్థానానికి ఉన్న ప్రత్యేకతను చాటుతుంది. కేవలం విస్తీర్ణపరంగా కాకుండా దండకారణ్యంగా ఈ నియోజకవర్గం ప్రసిద్ధి చెందింది. తొలినాళ్లలో సమైక్య ఆంధ్రప్రదేశ్లోని విశాఖ సమీపంలో గల గోలుగొండ నియోజకవర్గంలో భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ ఉండేది. 1962 లోక్సభ ఎన్నికల సమయంలో గోలుగొండ నియోజకవర్గాన్ని రద్దు చేశారు. అప్పుడు మన్యం ప్రాంతాలను కలుపుతూ విశాఖ సమీపంలోని నర్సీపట్నం లోక్సభ నియోజకవర్గం ఏర్పడగా అందులో భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ ఉండేది. ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో 1967లో భద్రాచలం లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, బూర్గంపాడు, విశాఖ జిల్లాలోని చింతపల్లి, పాడేరు, తూర్పుగోదావరి జిల్లాలోని ఎల్లవరం, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం, గోపాలపురం అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండేవి.
దేశంలోనే పెద్దది..!: భద్రాచలం లోక్సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రచారం చేయాలంటే అభ్యర్థులకు ఎక్కువ సమయం పట్టేది. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్ ఒక్కో మూలకు ఉండటంతో వ్యయప్రయాసలు తప్పేవి కాదు. అప్పట్లో రహదారి సదుపాయాలు అంతంతమాత్రమే. చాలాచోట్ల వాగులపై వంతెనలు ఉండేవి కాదు. వాహనాల్లో వెళ్లినా ఒకచోటు నుంచి మరోచోటుకు చేరుకోవాలంటే రోజంతా ప్రయాణానికే సరిపోయేది. భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని వాజేడు మండలం నుంచి పాడేరుకు 400 కి.మీ దూరం ఉంటుంది. హెలికాప్టర్లో తిరిగితేనే ప్రచారం సాధ్యమవుతుందని నాయకులు చమత్కరించుకునేవారు. ఇక్కడ నెగ్గిన వారిని సరదాగా భద్రాచలం ఎంపీ అనడానికి బదులు హెలికాప్టర్ నియోజకవర్గ ఎంపీ అని తోటి సభ్యులు పిలిచేవారు. హెలికాప్టర్లో తిరిగితేనే ఇక్కడి ప్రజలను కలవడం కుదురుతుందన్న ఉద్దేశంతో అలా అనేవారు. రాజకీయ నాయకులు సైతం దీన్ని అదేవిధంగా పిలుచుకొని మురిసిపోయేవారు. ఎంతో చరిత్ర గల ఇలాంటి ఎంపీ స్థానం 2009లో రద్దయ్యింది. ప్రస్తుతం మహబూబాబాద్ లోక్సభ నియోజకవర్గంలో భద్రాచలం అసెంబ్లీ సెగ్మెంట్ భాగమైంది. ఎన్నో మార్పులు చోటుచేసుకున్న ఈ ప్రాంతంలో విభిన్న సంప్రదాయాలు కనిపిస్తుంటాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రేపు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్
[ 12-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్ను సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు నిర్వహించనున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టరేట్లో శనివారం మాట్లాడారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో వాహనాలు ఆపేయాలన్నారు. -
పోలింగ్ ముగిసే వరకు ‘నిశ్శబ్దం’
[ 12-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రచార పర్వం శనివారం సాయంత్రం ముగిసింది. సోమవారం ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ జరగనుంది. పోలింగ్ క్రతువు ముగింపునకు 48 గంటల ముందు నుంచి నిశ్శబ్ద కాలం (సైలెంట్ పీరియడ్) అమల్లోకి వస్తుంది. -
గళాలు.. బలాలు
[ 12-05-2024]
ప్రముఖులు గెలుపొందిన నేల.. పలు సందర్భాల్లో భిన్నమైన ఫలితానిచ్చిన నియోజకవర్గం ఖమ్మం పార్లమెంటరీ స్థానం.. అతిరథుల పోటీ నేపథ్యంలో ఈసారి ప్రచారం హోరాహోరీగా సాగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక అంశంతోనే నియోజకవర్గం, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ ఆకర్షించింది. -
పోలింగ్కు సర్వం సిద్ధం
[ 12-05-2024]
ఓటుహక్కు ఆవశ్యకతను వివరిస్తూ నగరంలోని వివిధ కూడళ్లలో నిలువెత్తు బ్యాలెట్ యూనిట్ల ఫ్లెక్సీలు అమర్చారు. తప్పనిసరిగా ఓటేయాలని ప్రజలను చైతన్యపరుస్తున్నారు. -
‘రాహుల్ని ప్రధాని చేయటమే లక్ష్యం’
[ 12-05-2024]
శాసనసభ ఎన్నికల ఫలితాలు ఖమ్మం, మహబాబూబాద్ లోక్సభ స్థానాల్లో పునరావృతమవుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
అందుబాటులో ఉన్నా.. ఆశీర్వదించండి: నామా
[ 12-05-2024]
ఖమ్మం జిల్లా గొంతుకగా పనిచేసే తనను మరోసారి ఆశీర్వదించి లోక్సభకు పంపించాలని భారాస అభ్యర్థి నామా నాగేశ్వరరావు కోరారు. ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో శనివారం మాట్లాడారు. -
ఒక్క అవకాశమివ్వండి: తాండ్ర
[ 12-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో భాజపాకు ఒక్క అవకాశమివ్వాలని ఆ పార్టీ అభ్యర్థి తాండ్ర వినోద్రావు కోరారు. కులమతాలకు అతీతంగా తనను ఆశీర్వదించాలని బహిరంగ లేఖ ద్వారా శనివారం విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబు గెలుపు కోసం రాజశ్యామల యాగం
[ 12-05-2024]
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుష్ట పాలన అంతమై చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలని ఆకాంక్షిస్తూ రాజశ్యామల యాగం నిర్వహించినట్టు తెదేపా తెలంగాణ రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి గొల్లపూడి రామారావు అన్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
[ 12-05-2024]
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన కారేపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది. కారేపల్లి అడ్డరోడ్డుకు చెందిన చింతా విజయలక్ష్మి(38) కారేపల్లిలోని సాయిబాబా ఆలయ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు తన చిన్నకుమారుడు వరుణ్సాయితో కలిసి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. -
సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి: కలెక్టర్
[ 12-05-2024]
అర్హులందరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కలెక్టర్ ప్రియాంక అల కోరారు. కొత్తగూడెంలో శనివారం మాట్లాడారు. తుది దశ ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందికి పోలింగ్ కేంద్రాలను కేటాయించామన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఒంగోలులో 6 లారీల బియ్యం పట్టివేత.. ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్నట్లు గుర్తింపు
-
డిన్నర్ డేట్లో విరాట్ అనుష్క.. ఫొటోలు వైరల్
-
నటిగా ఎదగడానికి కారణం ఈ చిత్రం: కృతి సనన్
-
విజయవాడలో బస్సుల కొరత.. ఆర్టీసీ తీరుపై ప్రయాణికుల మండిపాటు
-
ఫ్యాన్స్కు ‘సండే’ ఫన్.. నాలుగు టీమ్ల్లో ఎవరిది విన్?
-
ఇజ్రాయెల్కు ఇరాన్ ‘అణు’ బెదిరింపులు..