భారాస పదేళ్ల పాలనలో అన్నీ వైఫల్యాలే: రఘురాంరెడ్డి
పదేళ్ల భారాస పాలన వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు.
అశ్వారావుపేటలో మాట్లాడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి
అశ్వారావుపేట, న్యూస్టుడే: పదేళ్ల భారాస పాలన వైఫల్యాలమయం అని ఖమ్మం లోక్సభ స్థానం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అశ్వారావుపేట పోలీసు స్టేషన్ కూడలిలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సభలో రఘురాంరెడ్డి ప్రసంగించారు. భాజపా పదేళ్ల పాలనలో అధిక ధరలతో ప్రజలు కష్టాలపాలయ్యారని వ్యాఖ్యానించారు. రూ.400 ఉన్న గ్యాస్ ధర రూ.1,000కి పెరిగిందన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని, కానీ కోటి మంది కొలువులు కోల్పోవాల్సి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ సంస్థలన్నీ మూసివేసి కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేశారని విమర్శించారు. ఆగస్టు 15 వరకు రూ.2లక్షల చొప్పున రైతుల రుణాలను సీఎం రేవంత్రెడ్డి మాఫీ చేయనున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే అయిదు అమలవుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ మాటిస్తే తప్పక అమలు చేస్తుందనేందుకు ఇదే నిదర్శనమని వివరించారు. ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మాట్లాడుతూ శాసనసభ ఎన్నికల్లో తనకు వచ్చిన ఆధిక్యం కంటే రెట్టింపు మెజారిటీతో రఘురాంరెడ్డిని గెలిపించాలని కోరారు. మువ్వా విజయబాబు మాట్లాడుతూ చేయిచేయి కలిపి కాంగ్రెస్కు విజయం చేకూర్చాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకి వచ్చాక 30లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను రాహుల్గాంధీ తీసుకుంటారని పేర్కొన్నారు. మద్దినేని స్వర్ణకుమారి, జూపల్లి రమేష్, తుమ్మా రాంబాబు, సుంకవల్లి వీరభద్రరావు, సీపీఐ, సీపీఎం నాయకులు సయ్యద్ సలీం, కొక్కెరపాటి పుల్లయ్య పాల్గొన్నారు. అశ్వారావుపేటలో ఆదివారం సాయంత్రం జరిగిన రఘురాంరెడ్డి రోడ్షోకు తుమ్మల వర్గీయులు, పలువురు కాంగ్రెస్ నాయకులు గైర్హాజరయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎవరి లెక్కలు వారివే..
[ 15-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో 35 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. 16,31,039 మంది ఓటర్లకు 12,41,135 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ ముగియటంతో ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఎవరికి వారే గెలుపు లెక్కల్లో మునిగితేలుతున్నారు. -
మూడంచెల భద్రత.. పకడ్బందీ పర్యవేక్షణ
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రతువు సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం లోక్సభ స్థానం ఈవీఎంలను పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూం, మహబూబాబాద్ స్థానం ఈవీఎంలను అక్కడి సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో ఎన్నికల అధికారులు భద్రపరిచారు. -
బీకాంతో ఎక్కువ మంది దోస్త్
[ 15-05-2024]
డిగ్రీలోకి ప్రవేశించాలనుకొనే విద్యార్థులకు ‘దోస్త్’ పిలుస్తోంది. విద్యార్థి జీవితంలో డిగ్రీ దశ అత్యంత కీలకమైనది. ఇక్కడ చూపిన ప్రతిభాపాటవాల ఆధారంగానే భవిష్యత్తు చదువులు.. ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. -
ఈవీఎంల తరలింపు పూర్తి: కలెక్టర్
[ 15-05-2024]
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లు, ఈవీఎంలను లోక్సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా.సంజయ్ జి.కోల్టేతో కలిసి మంగళవారం పరిశీలించారు. -
భారాసకు చావా రామకృష్ణ రాజీనామా
[ 15-05-2024]
భారత రాష్ట్ర సమితికి ఎర్రుపాలెం మండలంలోని సఖినవీడు గ్రామానికి చెందిన జిల్లా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ చావా రామకృష్ణ రాజీనామా చేశారు. ఈమేరకు జిల్లా అధ్యక్షుడు, మధిర పార్టీ ఇన్ఛార్జికి మంగళవారం లేఖ రాశారు. -
అత్యధిక శాతం ఓట్లు పురుషులవే..
[ 15-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఓటుహక్కు వినియోగంలో పురుషులతో పోల్చితే అతివలు వెనుకబడ్డారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ ఇదే మాదిరిగా ఓటేయటం గమనార్హం. -
కాంగ్రెస్ పార్టీదే విజయం: కంచర్ల
[ 15-05-2024]
భద్రాద్రి జిల్లాలో అత్యధిక మంది ఓటర్లు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే ఓటేశారని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అన్నారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. -
మరోసారి ఆదర్శం..
[ 15-05-2024]
-
పామాయిల్ నూతన కర్మాగార నిర్మాణ బాధ్యత నాదే: తుమ్మల
[ 15-05-2024]
వేంసూరు మండలంలో పామాయిల్ నూతన కర్మాగార నిర్మాణ బాధ్యత తనదేనని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేంసూరు తదితర మండలాల రైతులతో ఆయన మంగళవారం మాట్లాడారు. -
భారీగా తగ్గిన బ్రహ్మోత్సవాల ఆదాయం
[ 15-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించినా ఆదాయం ఆశాజనకంగా రాలేదు. గత ఏడాదితో పోల్చితే భారీగా తగ్గింది. -
అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు నష్టం
[ 15-05-2024]
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
స్వచ్ఛంద ముసుగులో రూ.కోట్లు దోపిడీ
[ 15-05-2024]
‘మా దగ్గర తొమ్మిది రకాల కోర్సులు ఉన్నాయి... దీనికి కేంద్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ సంస్థతో ధ్రువీకరణ పత్రాలు అందిస్తాం.. వీటితో బ్యాంకు రుణాలు పొందడంతో పాటు, స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని’ ఏటా రూ.లక్షల ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేస్తున్న తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ఫ్లాష్... ఫ్లాష్... నిశిరాత్రిలో ఘోరం.. అయిదుగురి సజీవదహనం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో