ధర బాగుంది.. ధాన్యం బయటే అమ్మేద్దాం!
యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు.
పాల్వంచ మండలం రంగాపురంలో ధాన్యం కొనుగోలు
కొత్తగూడెం వ్యవసాయం, న్యూస్టుడే: యాసంగిలో వరి అత్యధిక విస్తీర్ణం సాగైన జిల్లాల్లో భద్రాద్రి కొత్తగూడెం ఒకటి. ప్రాజెక్టులు, ప్రధాన చెరువులు, వాగులు, గొట్టపు బావుల కింద సుమారు 60 వేల ఎకరాల్లో నాట్లు వేశారు. మార్కెట్ డిమాండ్ కారణంగా ఎక్కువ మంది సన్నాలు సాగు చేశారు. గత రెండు వారాలుగా కోతలు జోరందుకున్నాయి. దీనికి అనుగుణంగా కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ, పౌర సరఫరాలు, సహకార శాఖల అధికారులు ధాన్యం సేకరణకు 136 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కోతలు ప్రారంభమై దాదాపు మూడు వారాలు కావొస్తుండగా, పలుచోట్ల కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చేందుకు రైతులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరకు మించి బహిరంగ మార్కెట్లో ప్రైవేటు వ్యాపారులే సరకు కొంటున్నారు.
దళారుల వైపు రైతుల మొగ్గు
ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు 20 శాతం మంది లోపే రైతులు ధాన్యం తీసుకొస్తున్నారని అంచనా. ‘ఏ’ గ్రేడ్ రకానికి క్వింటాకు రూ.2,203 మద్దతు ధర కల్పిస్తున్నారు. ప్రైవేటుగా వ్యాపారులు క్వింటా పచ్చి ధాన్యాన్ని రూ.2,700 నుంచి రూ.2,900 వరకు కొనుగోలు చేస్తున్నారు. అన్నదాతకు సగటున ఒక క్వింటాకు రూ.600 వరకు అదనంగా మిగులుతోంది. దొడ్డు రకాలకూ బయట బాగానే డిమాండ్ ఉంటోంది. వాటికి కూడా బహిరంగ మార్కెట్లో క్వింటాకు రూ.200 వరకు ఎక్కువ ధర పలుకుతోంది. కోత పూర్తయిన వెంటనే తేమశాతంతో నిమిత్తం లేకుండా కాంటా వేసి లోడు చేస్తుండటంతో కల్లాల్లోనే ధాన్యం అమ్మేస్తున్నారు. ప్రభుత్వ కేంద్రాలకు తరలిస్తే అకాల వర్ష భయంతో పాటు టార్పాలిన్, గోనె సంచులు, కాంటా రుసుము, రవాణాలో జాప్యం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు చెబుతున్నారు. ప్రైవేటుగు విక్రయిస్తే ఎక్కువగా తూకాల్లో తేడాలుంటాయి. ఇలా జరగకుండా సంబంధిత అధికారులు తనిఖీలు చేయాలి.
- ‘ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతుల నుంచి వెంటనే ధాన్యం సేకరిస్తున్నాం. జాప్యం లేకుండా మిల్లులకు తరలిస్తున్నాం. ఒకవేళ వర్షాలువచ్చినా ఇబ్బందుల్లేకుండా రాశులు కప్పి ఉంచేందుకు టార్పాలిన్ పట్టాలను సిద్ధంగా ఉంచాం’ అని జిల్లా వ్యవసాయశాఖ అధికారి బాబురావు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడంచెల భద్రత.. పకడ్బందీ పర్యవేక్షణ
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ క్రతువు సోమవారం ప్రశాంతంగా ముగిసింది. ఖమ్మం లోక్సభ స్థానం ఈవీఎంలను పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలోని స్ట్రాంగ్ రూం, మహబూబాబాద్ స్థానం ఈవీఎంలను అక్కడి సాంఘిక సంక్షేమ బాలికల కళాశాలలోని స్ట్రాంగ్ రూంలో ఎన్నికల అధికారులు భద్రపరిచారు. -
బీకాంతో ఎక్కువ మంది దోస్త్
[ 15-05-2024]
డిగ్రీలోకి ప్రవేశించాలనుకొనే విద్యార్థులకు ‘దోస్త్’ పిలుస్తోంది. విద్యార్థి జీవితంలో డిగ్రీ దశ అత్యంత కీలకమైనది. ఇక్కడ చూపిన ప్రతిభాపాటవాల ఆధారంగానే భవిష్యత్తు చదువులు.. ఉద్యోగావకాశాలు ఆధారపడి ఉంటాయి. -
ఈవీఎంల తరలింపు పూర్తి: కలెక్టర్
[ 15-05-2024]
స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ పూర్తయిందని కలెక్టర్ గౌతమ్ తెలిపారు. పొన్నెకల్లులోని శ్రీచైతన్య ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రం, స్ట్రాంగ్ రూమ్లు, ఈవీఎంలను లోక్సభ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా.సంజయ్ జి.కోల్టేతో కలిసి మంగళవారం పరిశీలించారు. -
భారాసకు చావా రామకృష్ణ రాజీనామా
[ 15-05-2024]
భారత రాష్ట్ర సమితికి ఎర్రుపాలెం మండలంలోని సఖినవీడు గ్రామానికి చెందిన జిల్లా నాయకుడు, ఏఎంసీ మాజీ ఛైర్మన్ చావా రామకృష్ణ రాజీనామా చేశారు. ఈమేరకు జిల్లా అధ్యక్షుడు, మధిర పార్టీ ఇన్ఛార్జికి మంగళవారం లేఖ రాశారు. -
అత్యధిక శాతం ఓట్లు పురుషులవే..
[ 15-05-2024]
ఖమ్మం లోక్సభ స్థానంలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు. కానీ ఓటుహక్కు వినియోగంలో పురుషులతో పోల్చితే అతివలు వెనుకబడ్డారు. ప్రతి శాసనసభ నియోజకవర్గంలోనూ ఇదే మాదిరిగా ఓటేయటం గమనార్హం. -
కాంగ్రెస్ పార్టీదే విజయం: కంచర్ల
[ 15-05-2024]
భద్రాద్రి జిల్లాలో అత్యధిక మంది ఓటర్లు లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్కే ఓటేశారని జడ్పీ ఛైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు అన్నారు. కొత్తగూడెంలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. -
మరోసారి ఆదర్శం..
[ 15-05-2024]
-
పామాయిల్ నూతన కర్మాగార నిర్మాణ బాధ్యత నాదే: తుమ్మల
[ 15-05-2024]
వేంసూరు మండలంలో పామాయిల్ నూతన కర్మాగార నిర్మాణ బాధ్యత తనదేనని వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతులకు హామీ ఇచ్చారు. దమ్మపేట మండలం గండుగులపల్లిలో ఉమ్మడి ఖమ్మం జిల్లా వేంసూరు తదితర మండలాల రైతులతో ఆయన మంగళవారం మాట్లాడారు. -
భారీగా తగ్గిన బ్రహ్మోత్సవాల ఆదాయం
[ 15-05-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఏప్రిల్ 9 నుంచి 23 వరకు శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించినా ఆదాయం ఆశాజనకంగా రాలేదు. గత ఏడాదితో పోల్చితే భారీగా తగ్గింది. -
అకాల వర్షాలతో ఉద్యాన పంటలకు నష్టం
[ 15-05-2024]
రాష్ట్రంలో అకాల వర్షాలతో పంటలు, పండ్లు, కూరగాయల తోటలకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి నివేదిక పంపాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను వ్యవసాయ, సహకార, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. -
స్వచ్ఛంద ముసుగులో రూ.కోట్లు దోపిడీ
[ 15-05-2024]
‘మా దగ్గర తొమ్మిది రకాల కోర్సులు ఉన్నాయి... దీనికి కేంద్ర ప్రభుత్వ నైపుణ్య శిక్షణ సంస్థతో ధ్రువీకరణ పత్రాలు అందిస్తాం.. వీటితో బ్యాంకు రుణాలు పొందడంతో పాటు, స్వయం ఉపాధి పొందే అవకాశం ఉందని’ ఏటా రూ.లక్షల ప్రభుత్వ ధనాన్ని స్వాహా చేస్తున్న తీరు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో అగ్ని ప్రమాదం.. ఐదుగురు మృతి
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (15/05/24)
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
అమెరికాలో చైనా ‘సైన్యం’.. ట్రంప్ ప్రచారంపై రచ్చ!
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
బికినీలో అనన్య పాండే.. కాబోయే భర్తతో వరలక్ష్మి ఫొటో