బాధితులకు భరోసా.. పోక్సో ఈ బాక్స్
నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి.
అశ్వారావుపేట గ్రామీణం, అన్నపురెడ్డిపల్లి, న్యూస్టుడే: నిత్యం ఎక్కడో ఓ చోట బాలికలు, అభంశుభం తెలియని చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ఆకృత్యాలకు పాల్పడే వారిపై ఫిర్యాదుకు బాధితులు వెనుకాడుతుండటంతో శిక్ష నుంచి వారు తప్పించుకోగలుగుతున్నారు. చాలామంది నేరం చేసిన వారికి భయపడి ఫిర్యాదు చేయడం లేదు. ధైర్యంగా కొందరు ముందుకు వచ్చి ఫిర్యాదు చేసినా నేరం చేసిన వారి నుంచి బాధితులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బాలికలు, చిన్నారులు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్టను వేసేందుకు నేరగాళ్లను శిక్షించడంతో పాటు, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచేందుకు ‘పోక్సో ఈ బాక్స్’ అనే ప్రత్యేక యాప్ను రూపొందించింది.
దిల్లీ కేంద్రంగా చర్యలు..
బాధితులు చేసిన ఫిర్యాదులపై దిల్లీలో కేంద్ర ప్రత్యేక బృందం పర్యవేక్షిస్తుంది. యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులు స్త్రీ, శిశు సంక్షేమాధికారి రాష్ట్ర కార్యాలయానికి, జిల్లా కేంద్రానికి సమాచారం పంపుతారు. బాలల సంరక్షణ అధికారి, సిబ్బందీ సహకరించి వెంటనే విచారణ చేపడతారు. క్షేత్రస్థాయిలో విచారణ చేసే అధికారులకు ఫిర్యాదు ఎవరు చేశారన్న సమాచారమూ తెలియదు. దీంతో పారదర్శకతతో విచారణ సాగి.. పోలీసుల సహకారంతో కేసును నమోదు చేస్తారు. ఎప్పటికప్పుడు విచారణ, కేసుకు సంబంధించిన పురోగతి వివరాలను వారు ఉన్నతాధికారులకు పంపించాల్సి ఉంటుంది. ఫిర్యాదుదారులకు రక్షణ, నేరానికి పాల్పడిన వారికి శిక్ష పడేలా యంత్రాంగం తోడ్పాటునిస్తుంది. దీంతో బాధితులకు న్యాయం జరుగుతుంది. అఘాయిత్యానికి గురైన వారు తప్పక ఈ యాప్ను ఉపయోగించుకోవాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు.
ఫిర్యాదు చేసే విధానం ఇలా..
స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ‘పోక్సో ఈ-బాక్స్’ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలి. అక్కడ వెంటనే ఫిర్యాదుల విభాగం ముఖచిత్రం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి. సాధారణంగా చిన్నారులకు ఎదురయ్యే ఆరు రకాల హింసలకు సంబంధించిన చిత్రాలు కనిపిస్తాయి. హింస స్వభావాన్ని గమనించి ఆ చిత్రంపై క్లిక్ చేయాలి. అనంతరం ఫిర్యాదు పత్రంలో బాధితుల వివరాలు, జరిగిన సంఘటనకు సంబంధించిన వివరాలను సంబంధిత ట్యాబ్లో పొందుపర్చి సమర్పించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సమస్యలు పరిష్కరించాలని ఓటర్ల నిరసన
[ 13-05-2024]
ఇల్లందు మండలం లచ్చగూడెం పంచాయతీ కొమ్ముగూడెం తండాలో తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించడం లేదని గ్రామస్థులు పోలింగ్ బహిష్కరించారు. -
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేడే
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల పోలింగ్కు సర్వం సిద్ధమైంది. ఖమ్మం లోక్సభ స్థానంలో 35 మంది బరిలో నిలవగా 16,31,039 మంది ఓటేయనున్నారు. -
మీ ఓటు.. మీ స్వరం
[ 13-05-2024]
సమర్థవంతులైన ప్రజాప్రతినిధుల ఎన్నిక ఓటర్ల చైతన్యంతోనే సాధ్యమవుతుంది. -
వేరొకరు వేస్తే ఏం చేయాలి!
[ 13-05-2024]
ఓటరు తన ఓటుహక్కు వినియోగించుకునే సందర్భంగా ఎదురయ్యే సమస్యలు, వాటి పరిష్కార మార్గాలను పరిశీలిస్తే.. -
పోలింగ్ ఏజెంట్లుగా ఎవరుండొచ్చు!
[ 13-05-2024]
ప్రతి పోలింగ్ కేంద్రాన్ని స్వయంగా అభ్యర్థి పరిశీలించే అవకాశం ఉండదు. -
బాధ్యత భుజానికెత్తుకుంది..
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ఎన్నికల సంఘం ఓటర్లకు పలు సదుపాయాలను అందుబాటులోకి తెచ్చింది. -
ఎంపికలోనే అంతా..
[ 13-05-2024]
నేడే లోక్సభ పోలింగ్. ఎంపీగా గెలిచిన అభ్యర్థి దిల్లీ వెళ్లి కూర్చుంటారు. మనకు ఒరిగేదేముందనే అనాసక్తిని వీడాలి. -
మందు ప్రభావం అంతంతే..
[ 13-05-2024]
పోలింగ్ మరి కొద్ది గంటల్లో ప్రారంభం కానుండగా ఆబ్కారీశాఖ అక్రమ మద్యం జాడ కోసం ముమ్మర తనిఖీలు చేపట్టింది. -
ఓటరన్నా.. మీ బాధ్యతలివే
[ 13-05-2024]
ఓటరు పోలింగ్ కేంద్రం సిబ్బంది, భద్రత బలగాలకు సహకరించాలి. -
అస్త్రశస్త్రాలు సిద్ధం..
[ 13-05-2024]
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ సామగ్రిని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో ఆదివారం సిబ్బందికి పంపిణీ చేశారు. -
ఇదిగో.. నోటా వాటా
[ 13-05-2024]
స్వేచ్ఛగా ఓటేసే హక్కును రాజ్యాంగం కల్పించింది. -
ఓటర్లను ప్రలోభపెడితే కఠిన చర్యలు: కలెక్టర్
[ 13-05-2024]
ఓటర్లను ప్రలోభపరిచినా, భయభ్రాంతులకు గురిచేసినా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గౌతమ్ ఆదివారం హెచ్చరించారు.
తాజా వార్తలు (Latest News)
-
భాజపా సీనియర్ నేత సుశీల్ కుమార్ మోదీ కన్నుమూత
-
గుజరాత్ ఆశలపై నీళ్లు చల్లిన వరుణుడు.. కోల్కతాతో మ్యాచ్ రద్దు
-
రాహుల్తో చర్చకు భాజపా రెడీ.. యువ నాయకుడికి అవకాశం
-
మహిళ కిడ్నాప్ కేసు.. హెచ్డీ రేవణ్ణకు బెయిల్
-
అది టీకప్పులో తుపానులాంటిది.. కేఎల్ రాహుల్-సంజీవ్ గోయెంకా ఎపిసోడ్పై ఎల్ఎస్జీ
-
కుప్పకూలిన భారీ హోర్డింగ్.. ఎనిమిది మంది మృతి