logo

3న నామినేషన్‌ వేస్తా: తీన్మార్‌ మల్లన్న

ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌) ఖమ్మంలో  ఆదివారం ప్రచారం నిర్వహించారు.

Updated : 29 Apr 2024 06:11 IST

మల్లన్నను సన్మానించిన మున్నూరుకాపు సంఘం నాయకులు

ఖానాపురం హవేలి: ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తీన్మార్‌ మల్లన్న(చింతపండు నవీన్‌) ఖమ్మంలో  ఆదివారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్‌ నాయకులతో పాటు వివిధ కుల సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులను కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నానని తెలిపారు. మే 3న నామినేషన్‌ వేయనున్నట్లు చెప్పారు.  మామిళ్లగూడెంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో మున్నూరు కాపు సంఘం నాయకులతో సమావేశమయ్యారు. మల్లన్నను ఆసంఘం నాయకులు సన్మానించారు.   సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆకుల గాంధీ, శెట్టి రంగారావు,  కార్పొరేటర్లు రాపర్తి శరత్‌, మాడూరి ప్రసాద్‌, తాళ్లూరి హనుమంతరావు, ఎంపీపీ మాజీ సభ్యురాలు పగడాల మంజుల, కాంగ్రెస్‌  నాయకులు కొత్త సీతారాములు, పొదిల రవికుమార్‌, ప్రైవేటు పాఠశాలల సంఘం సభ్యులు శెట్టి భాస్కర్‌,  మరిశెట్టి వెంకటేశ్వర్లు, మేకల భిక్షమయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని