logo

అక్రమ మద్యం పట్టివేత

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 18 Apr 2024 18:48 IST

కౌతాళం: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై నరేంద్ర కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. డీఎస్పీ యెమ్మిగనూరు సీతారామయ్య ఆదేశాలతో కౌతాళం ఎస్సై నరేంద్ర కుమార్ రెడ్డి సిబ్బందితో కలిసి బాపురం చెక్‌పోస్ట్‌ సమీపంలో తనిఖీలు నిర్వహించారు. కర్ణాటక మాన్వికి చెందిన రంగా, కోసిగి మండలం కడిదొడ్డి గ్రామానికి చెందిన బొజ్జయ్యలు అక్రమంగా తరలిస్తున్న మద్యంతోపాటు ఒక ద్విచక్ర వాహనాన్ని, సైకిల్‌ను స్వధీనం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని