ఘాట్ రోడ్డుకు ‘జగన్’ గండం
ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే కర్నూలు- గుంటూరు రహదారే కీలకం. ఇది నల్లమల మీదుగా వెళ్తోంది.
‘విస్తరణను’ అడవిలో వదిలేసిన సర్కారు
ఉమ్మడి కర్నూలు జిల్లా వాసులు రాష్ట్ర రాజధానికి వెళ్లాలంటే కర్నూలు- గుంటూరు రహదారే కీలకం. ఇది నల్లమల మీదుగా వెళ్తోంది. ఆత్మకూరు- దోర్నాల మధ్య ఘాట్ రోడ్డులో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఆత్మకూరు నుంచి దోర్నాల మధ్య 58 కి.మీ ఉండగా అందులో దాదాపు 40 కి.మీ మేర అటవీమార్గం ఉంది. 15 కి.మీ మేర దారంతా ఛిద్రమైంది.
బాబు ఆమోదం
కర్నూలు- గుంటూరు ఎన్హెచ్ 340సి విస్తరించాలని జిల్లా పాలకులు విన్నవించడంతో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఆమోద ముద్ర వేశారు. 2016- 18 వరకు పలుమార్లు సర్వే చేయించారు.. విస్తరణకు ‘మార్గం’ సుగమం చేశారు.
జగన్ అటకెక్కించి
2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు పనులను అటకెక్కించింది.. వాహనాల రద్దీ తక్కువగా ఉందంటూ పక్కన పెట్టారు. ఇక్కడి ప్రజల విన్నపం మేరకు ఎన్నికలు సమీపించాక హడావుడిగా కర్నూలు నుంచి ఆత్మకూరు వరకు మాత్రమే పనులు చేపడుతున్నారు. మిగిలిన 38 కి.మీ అడవి మార్గాన్ని వదిలేశారు.
అడిగేవారు లేక
కర్నూలు నుంచి వెంకటాపురం వరకు విస్తరణ పనులు జరుగుతున్నాయి. అక్కడి నుంచి అడవి మార్గంలో రోడ్డు విస్తరణకు అడుగులు పడలేదు. అనుమతుల కోసం దిల్లీ అటవీశాఖ ప్రధాన కార్యాలయానికి అధికారులు నివేదిక పంపించారు. అక్కడి అధికారులు పట్టించుకోలేదు. సీఎం జోక్యం చేసుకుంటే తప్ప అటవీ శాఖ అనుమతులు ఇచ్చే పరిస్థితి ఉండదు. పలుమార్లు దిల్లీ వెళ్లిన జగన్ ఈ రోడ్డు విస్తరణపై ఒక్కసారి కూడా మాట్లాడలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఆత్మకూరు, న్యూస్టుడే :
124 కి.మీల్లో విస్తరిస్తున్నది 72 కి.మీలే
కర్నూలు- గుంటూరు (ఎన్హెచ్ 340సి) రహదారిని విస్తరించేందుకు 2016లో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు నంద్యాల కేంద్రంగా ఓ కన్సల్టెంట్ను నియమించారు. సమగ్ర నివేదిక ఇవ్వాలని కోరడంతో ఎన్హెచ్ఏఐ పీడీ సర్వే చేపట్టారు. మళ్లీ 2018లో వాహన రద్దీపై సర్వే చేపట్టారు. అన్నింటిని పరిగణనలోకి తీసుకుని కర్నూలు నుంచి దోర్నాల వరకు 124.00 కి.మీ పొడవున రోడ్డు విస్తరణకు ప్రణాళికలు రూపొందించారు. గార్గేయపురం నుంచి ఆత్మకూరు మండలం పిన్నాపురం వరకు 73.600 కి.మీ. మేర నాలుగు వరుసల రోడ్డును ప్రతిపాదించారు. ప్రస్తుతం నన్నూరు టోల్ప్లాజా నుంచి ఆత్మకూరు వరకు నాలుగు వరుసల రహదారి (ఎన్హెచ్ 340సీ) నిర్మాణం చేపడుతున్నారు. రూ.1200 కోట్ల వ్యయంతో సుమారు 72 కి.మీ మేర పనులు చేస్తున్నారు.
2016లోనే సర్వే పూర్తి
విస్తరణ పనుల్లో భాగంగా నల్లమల ఘాట్లో రహదారిని 10 మీటర్లు వెడల్పు చేసేందుకు 2016లో సర్వే చేపట్టారు. పిన్నాపురం- సంజీవనగర్ తండాల మధ్య పల్లెకట్ట వద్దనున్న 10వ నంబరు కి.మీ నుంచి ప్రకాశం జిల్లా కొత్తూరు వరకు 38.80 కి.మీలు రహదారి విస్తరణకు ప్రతిపాదించారు. ఇందులో 7 మీటర్ల వెడల్పుతో తారురోడ్డు, ఇరువైపులా 1.5 మీటర్ల చొప్పున ఫుట్పాత్ నిర్మాణానికి గతంలో సర్వే చేశారు. ఘాట్లో కొండల మధ్య కొన్నిచోట్ల 5 మీటర్ల దారికే అవకాశం ఉండటంతో అంత మేరకే చేపట్టాలని ప్రతిపాదించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీటికి ఎన్నికల కోడ్ వర్తించదా?
[ 11-05-2024]
ఆదోని నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి సాయి ప్రసాద్ రెడ్డి.. ఓటర్లకు సీఎం జగన్ ఫొటోతో పాటు తన చిత్రాలను ఓటర్ స్లిప్పులపై ముద్రించి పంపిణీ చేస్తున్నారు. -
రాష్ట్రంలో అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపుదాం: జేపీ నడ్డా
[ 11-05-2024]
దేశంలో మోదీ ప్రభుత్వం వెలుతురు పంచుతుంటే.. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం చీకటి పంచుతోందన్నారు భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. -
ఆడా అంటివి.. యాడుంది ప్రగతి జాడ
[ 11-05-2024]
కరవు కాటకాలు, వలసలతో విలవిలలాడే కర్నూలు పశ్చిమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామంటూ తెరపైకి తీసుకొచ్చిన ‘ఆదోని ఏరియా డెవలప్మెంట్ అథారిటీ’ (ఆడా)ను ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది -
రాష్ట్రాన్ని జగన్ ఎడారిగా మార్చారు
[ 11-05-2024]
జిల్లా ప్రజలకు ఏమి చేస్తామో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చెప్పలేకపోయారని.. పచ్చని చెట్లను నరికించి రాష్ట్రాన్ని ఎడారిగా మార్చిన జగన్కు చంద్రబాబును విమర్శించే అర్హత లేదని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి అన్నారు. -
చదువులమ్మ వాకిట అవస్థల పాఠం
[ 11-05-2024]
ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని, కార్పొరేట్ స్థాయిలో సౌకర్యాలు కల్పిస్తూ.. విద్యనందిస్తున్నామని చెబుతోంది జగన్ ప్రభుత్వం. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా ఉంది పరిస్థితి. -
ప్రగతి నినాదం... విధ్వంస విధానం.. ఏది కావాలో ఎంచుకో
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల ఘట్టం చివరి దశకొచ్చింది.. నేటితో ప్రచారం ముగియనుంది.. ‘తెర’ వెనక మంతనాలు మొదలు కానున్నాయి.. మహిళా సంఘాలకు ఎర వేస్తారు.. -
వైకాపాకు ఉద్యోగుల పోటు
[ 11-05-2024]
ప్రభుత్వం ఆటంకం కల్పించే యత్నాలను ఛేదించి.. హక్కు వినియోగానికి బారులు తీరారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రలోభాలకు లొంగలేదు.. బారులు తీరి పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు.. -
సాయంత్రం 6 వరకు పోలింగ్
[ 11-05-2024]
‘సార్వత్రిక ఎన్నికలను జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నాం. పోలింగ్కు ముందు 72 గంటలు అత్యంత కీలకం. -
సీమంతైనా మేలు చేయని జగన్
[ 11-05-2024]
కృష్ణా వెనుక జలాల ఆధారంగా నిర్మించిన రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కారు పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. లక్షలాది ఎకరాలకు సాగునీరు, వేలాది గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన జల వనరులను గాలికొదిలేసింది. -
అరాచకపాలనకు ముగింపు పలకాల్సిందే: తెదేపా
[ 11-05-2024]
మే 13న జరిగే పోలింగ్తో రాష్ట్రంలో వైకాపా అరాచకపాలనకు ముగింపు పలకాల్సిందేనని డోన్ నియోజకవర్గ తెదేపా అభ్యర్థి కోట్ల జయసూర్యప్రకాశ్ రెడ్డి తెలిపారు. -
అవుకు అధికారంలో అలజడి
[ 11-05-2024]
నంద్యాల జిల్లా అవుకులో వైకాపా నాయకులు శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ రసాబాసగా మారడంతో కార్యకర్తలు, నాయకులు తీవ్ర విస్మయానికి గురయ్యారు. వైకాపా నాయకుల మధ్య ఆధిపత్యపు పోరే ఇందుకు ప్రధాన కారణమని చెబుతున్నారు. -
యువకుడి ఆత్మహత్య
[ 11-05-2024]
కర్నూలులోని ఎఫ్సీఐ కాలనీకి చెందిన గుండ్రెడ్డి జయచంద్రారెడ్డి (23) ఆత్మహత్య చేసుకున్నారు. నంద్యాల జిల్లా బేతంచెర్లకు చెందిన మహేశ్వరరెడ్డి, మాధవి దంపతులు తమ పిల్లల చదువుల కోసం కర్నూలు వచ్చారు. -
పతాకస్థాయికి ప్రలోభాల పర్వం
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్నకొద్దీ ఉమ్మడి జిల్లాలో ప్రధాన పార్టీల నేతలు ప్రలోభాల ప్రక్రియకు తెరతీశారు. రాత్రి వేళల్లో ఇంటింటికి తిరుగుతూ ఓటరు స్లిప్పులు పరిశీలించి డబ్బులు అందజేస్తున్నారు. -
ఎన్నికల నిర్వహణకు పంచాయతీ నిధులు
[ 11-05-2024]
అయిదేళ్ల జగన్ పాలనలో పంచాయతీ నిధులన్నీ పక్కదారి పట్టాయి. గ్రామాల్లో కనీసం వసతులు కల్పించేందుకు వీలులేని పరిస్థితి. చాలా ప్రాంతాల్లో సర్పంచులు అప్పులు చేసి పనులు చేయించారు. -
వైకాపాకు ఉద్యోగుల పోటు
[ 11-05-2024]
ప్రభుత్వం ఆటంకం కల్పించే యత్నాలు ఛేదించి.. హక్కు వినియోగానికి బారులు తీరారు.. అధికార పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రలోభాలకు లొంగలేదు.. బారులు తీరి పోస్టల్ బ్యాలట్ను వినియోగించుకున్నారు.