logo

గూడ్స్ రైలు బోగీలో మంటలు...

గూడ్స్‌ రైలు బోగీలో మంటలు వచ్చిన చెలరేగిన ఘటన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమ్‌కల్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది.

Updated : 28 Apr 2024 12:17 IST

చిప్పగిరి: గూడ్స్‌ రైలు బోగీలో మంటలు వచ్చిన చెలరేగిన ఘటన కర్నూలు జిల్లా చిప్పగిరి మండలం నేమ్‌కల్ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. గుంతకల్లుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది ఇదూరు బాష, ఫయాజ్‌, సాయి, రవి తదితరులు మంటలను ఆర్పివేశారు. రైల్వేస్టేషన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలులోని ఓ బోగీలో స్వల్పంగా మంటలతో పొగలు వచ్చాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో బోగీల్లో ఇలా రావడం సాధారణమేనని స్టేషన్‌ మాస్టర్‌ ముజేష్‌కుమార్‌ తెలిపారు. ఈ నెలలో ఇది రెండోసారి అని చెప్పారు. రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేదన్నారు. ఒక లైన్‌లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని