అనుమానాస్పద స్థితిలో విలేకరి మృతి
ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఆత్మకూరు పట్టణం, న్యూస్టుడే : ఆత్మకూరుకు చెందిన నెత్తికొప్పుల మహేష్(48) సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విలేకరిగా పని చేస్తున్న మహేశ్ పట్టణ శివారులోని ఆర్డీటీ కాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఆదివారం సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొని రాత్రి ఇంటికి వచ్చి నిద్రించారు. సోమవారం తెల్లవారి చూసేసరికి మహేశ్ నిద్రించిన ఇంట్లో కాకుండా పక్కన ఉన్న ఇంటి వరండాలో మృతిచెంది పడిఉన్నారు. మృతుని ఒంటిపై దెబ్బలు ఉండటంతో ఎవరైనా హత్య చేశారా, అనారోగ్యంతో మరణించాడా అని అనుమానంగా ఉందన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలు పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. మృతుడి తల్లి సుబ్బమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై వెంకట నారాయణరెడ్డి వెల్లడించారు.
తండ్రి వేధింపులకు కుమార్తె ఆత్మహత్య
రాయదుర్గం, న్యూస్టుడే : తండ్రి రోజూ మద్యం తాగి కుటుంబ సభ్యులను వేధిస్తుండడంతో మనస్తాపానికి గురైన అతని కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. రాయదుర్గం ఇన్స్పెక్టర్ వెంకన్న తెలిపిన వివరాల ప్రకారం.. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఓ గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు తన కుటుంబంతో కలిసి గచ్చిబౌలి టెలికాంనగర్లో నివాసముంటున్నాడు. ఆయన మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా భార్య దగ్గర డబ్బులు తీసుకుని రోజూ తాగి కుటుంబ సభ్యులతో గొడవపడేవారు. తండ్రి తీరుతో విసుగెత్తిన ఆయన కుమార్తె(15) సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఉరేసుకుంది. సమీపంలో ఉండే మృతురాలి అక్క వచ్చి చూసి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటాభిషేకం
[ 15-05-2024]
‘ఓటు’ చైతన్యం వికసించింది.. పల్లెలన్నీ పోలింగ్ కేంద్రాల వైపు అడుగులేశాయి.. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఓటర్లు వరుసలో నిల్చొని ఓర్పుగా ఓటేశారు. యువకులు, వృద్ధులు, మహిళలు ఉత్సాహంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.. -
ఏకపక్ష గ్రామాల్లో ఎగిరిన స్వేచ్ఛా జెండా
[ 15-05-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలు గ్రామాల్లో ఫ్యాక్షన్ పడగ నీడలో నలిగిపోయాయి.. ఆయా గ్రామాల్లో చాలా వరకు వైకాపా పార్టీ నేతల పెత్తనం కొనసాగుతోంది. అక్కడ వారు చెప్పిందే శాసనం.. ఎన్నికల ప్రక్రియకు వచ్చే సరికి ఏకపక్షంగా సాగుతుంది.. -
తిరుగు ప్రయాణంలో తిప్పలు
[ 15-05-2024]
ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఓటు వేసేందుకు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన జనం తిరుగుముఖం పట్టారు. ఫలితంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని బస్టాండ్లు మంగళవారం కిటకిటలాడాయి. -
గెలుపు లెక్కలపై నేతల సమీక్ష
[ 15-05-2024]
పోలింగ్ ముసిగింది.. ఫలితం ‘ఓటు’ యంత్రంలో నిక్షిప్తమైంది.. ఫలితానికి 20 రోజులు నిరీక్షించాలి.. నేతలంతా 56 రోజుల పాటు తీరక లేకుండా గడిపారు.. వ్యూహాలు.. ప్రతి వ్యూహాలు పన్నారు.. -
ఈవీఎంలకు పటిష్ట భద్రతా ఏర్పాట్లు
[ 15-05-2024]
మండలంలోని ఆర్జీఎం, శాంతిరాం ఇంజినీరింగ్ కళాశాలల్లోని ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ డాక్టర్ కె.శ్రీనివాసులు తెలిపారు. -
జగన్ ఇంటికెళ్లడం ఖాయం
[ 15-05-2024]
రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో సాగిన జగన్ రాక్షస పాలనకు ఓటు అనే ఆయుధంతో ప్రజలు చరమగీతం పాడారని కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. -
బుగ్గన అరాచకాలన్నింటిపైనా విచారణ చేస్తాం: కోట్ల
[ 15-05-2024]
మంత్రిబుగ్గన అరాచకాలన్నింటిపైనా విచారణ చేయిస్తామని కేంద్రమాజీమంత్రి కోట్ల సూర్యప్రకాశ్రెడ్డి హెచ్చరించారు. మంగళవారం స్థానిక తెదేపా కార్యాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. -
వాట్సప్ పోస్టు పెట్టారని తెదేపా కార్యకర్తలపై దాడి
[ 15-05-2024]
వాట్సప్లో తమకు వ్యతిరేకంగా పోస్టు పెట్టారన్న అక్కసుతో తెదేపా కార్యకర్తలపై వైకాపా వారు దాడికి పాల్పడిన ఘటన పగిడ్యాల మండలం పడమర ప్రాతకోట గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. -
ద్విచక్రవాహనాల ఢీ.. ఒకరి మృతి
[ 15-05-2024]
తుగ్గలి మండలం రాంపల్లి గ్రామ సమీపంలో ఆర్ఎస్ పెండేకల్లు రహదారిలో జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు.. -
అసంపూర్తి పనులతో అవస్థలు
[ 15-05-2024]
డోన్ పట్టణంలోని ఐటీఐలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల్లో వేగం లేకపోవడంతో ఇవి ఎప్పటికి పూర్తవుతాయోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. -
పంచ్ కొడితే పతకమే..
[ 15-05-2024]
పంచ్ కొడితే పతకాల పంట పండటమే లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ చిన్నారులు. కరాటే సాధనతో శారీరక దృఢత్వంతో పాటుగా మానసికోల్లాసం కలుగుతుందౠ చెబుతున్నారు చిన్నారుల తల్లిదండ్రులు. -
మందుబాబులతో దుకాణాల కిటకిట
[ 15-05-2024]
ఉమ్మడి జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లు మందుబాబులతో మంగళవారం కిటకిటలాడాయి. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు ఉమ్మడి జిల్లాలో 175 మద్యం దుకాణాలు
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
-
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
-
భోజనానికి ముందు టీ, కాఫీ తాగుతున్నారా.. బీ అలర్ట్!
-
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య