నెల రోజుల్లో ధర రెండింతలు
అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల నమోదు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కాతకు వచ్చిన పంటలపై భారీ వర్షం, వడగండ్లు పడటంతో పూర్తిగా దెబ్బతిన్నాయి.
కొనలేని స్థితిలో కూరగాయలు
కల్వకుర్తి మార్కెట్లో ట్రేలలో పోస్తున్న టమాటలు
కల్వకుర్తి పట్టణం, న్యూస్టుడే: అకాల వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల నమోదు కూరగాయల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కాతకు వచ్చిన పంటలపై భారీ వర్షం, వడగండ్లు పడటంతో పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో దిగుబడి పూర్తిగా తగ్గిపోయింది. ప్రస్తుతం మార్కెట్కు రావాల్సిన కూరగాయల్లో సగం కూడా రాకపోవడంతో రోజురోజుకు డిమాండ్ పెరుగుతోంది. దీనికి తోడు శుభకార్యాలు అధికంగా ఉండటంతో కూరగాయల వినియోగం పెరిగింది. ధరలు పెరుగుతున్నా.. రైతుకు మాత్రం దిగబడి తగ్గడంతో పెట్టుబడులు మాత్రమే వచ్చే అవకాశం ఉందంటున్నారు. వినియోగదారులు మాత్రం మార్కెట్లో ఏదీ కొనాలన్నా వెనుకడుగు వేయాల్సి వస్తోందని రూ.500 వెచ్చించినా వారానికి సరిపడా కూరగాయలు రావడం లేదని వాపోతున్నారు. ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.60కి తక్కువ ఏవీ లేవంటున్నారు. అచ్చంపేట, నాగర్కర్నూల్, కొల్లాపూర్లోని అన్ని మార్కెట్లలో ధరలు పెరుగుతూనే ఉన్నాయి. మరో రెండు నెలల పాటు ఇదే పరిస్థితి ఉండనుందని వ్యాపారులు పేర్కొంటున్నారు.
వ్యాపారులకే లాభాలు..
కల్వకుర్తి వ్యవసాయ మార్కెట్ నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు కూరగాయలు సరఫరా జరుగుతుంటాయి. హైదరాబాద్, శ్రీశైలంతో పాటు వారాంతపు సంత ఉండే వివిధ ప్రాంతాలకు వాహనాల్లో వ్యాపారులు తరలిస్తుంటారు. నిత్యం టన్నుల కొద్దీ కూరగాయలు వస్తుండటంతో ప్రత్యేక ట్రేలలో నింపి ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. నియోజకవర్గంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరిగినప్పటికీ నెల రోజులుగా మార్కెట్కు వచ్చే సరకు తగ్గుతుండటం, డిమాండ్ పెరుగుతుండటంతో ధరలు రెండింతలయ్యాయి. సొరకాయ, మునగ, ఆకుకూరల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ధరల పెరుగుదలతో రైతులకు కొంతమేలవుతుండగా వ్యాపారులు అధిక లాభాలు పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రైతు నుంచి కిలో టమాట రూ.12 కొనుగోలు చేసే వ్యాపారులు వినియోగదారులకు కిలో రూ.20కి విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి కూరగాయల్లో వ్యాపారులు అధిక ధరలకు విక్రయించి లాభాలు పొందుతున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగు ప్రాంతాల్లో రెడ్జోన్
[ 02-05-2024]
జోగులాంబ గద్వాల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనంతగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. జిల్లాలోని నాలుగు ప్రాంతాలు రెడ్జోన్ పరిధిలోకి వెళ్లాయి. -
పొరుగుసేవల దరఖాస్తులపై అనుమానాలెన్నో !
[ 02-05-2024]
గద్వాల మెడికల్ కళాశాలలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వివిధ విభాగాలలో పనిచేయడానికి సిబ్బంది నియామకానికి అర్హత గల వ్యక్తుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో స్థానిక అభ్యర్థులకు మాత్రమే అవకాశం కల్పించారు. -
సామాజిక మాధ్యమాలపై నిఘా
[ 02-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియలో భాగంగా అభ్యర్థుల నామపత్రాల దాఖలు గడువు పూర్తి కావడంతో ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన పార్టీల అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. -
తెలుగులోనూ తప్పారు!
[ 02-05-2024]
పదోతరగతి వార్షిక ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో నాగర్కర్నూల్ జిల్లా 21వ స్థానంలో నిలువడం నిరాశ కలిగించింది. విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించడానికి జిల్లా విద్యాశాఖాధికారులు చొరవ చూపలేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
భాజపాతోనే ఎస్సీ వర్గీకరణ సాధ్యం
[ 02-05-2024]
కేంద్రంలో భాజపా మూడోసారి అధికారం చేపడితేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని కేంద్ర ప్రసార, సమాచారశాఖ సహాయమంత్రి మురుగన్ అన్నారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి : ఎస్పీ
[ 02-05-2024]
యువత గంజాయికి బానిసలుగా మారి తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దని, మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్పీ యోగేశ్గౌతం అన్నారు. -
సార్వత్రిక పరీక్షలకు 804 మంది హాజరు
[ 02-05-2024]
సార్వత్రిక పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు 804 మంది విద్యార్థులు హాజరైనట్లు టాస్ కో ఆర్డినేటర్ శ్రీనివాస్ తెలిపారు. -
పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయండి
[ 02-05-2024]
పెండింగ్లో ఉన్న కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలని ఎస్పీ రక్షితకృష్ణమూర్తి ఆదేశించారు. వనపర్తి సర్కిల్ పరిధిలో వనపర్తి పట్టణం, గ్రామీణం, రేవల్లి, వీపనగండ్ల పోలీస్స్టేషన్లకు సంబంధించి పెండింగ్ కేసులపై బుధవారం ఎస్సైలతో ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి