logo

నేడు బీసీ గురుకులాల్లో ప్రవేశానికి పరీక్ష

మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త సుగుణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు.

Published : 28 Apr 2024 04:32 IST

నారాయణపేట పట్టణం, న్యూస్‌టుడే : మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు బీసీ గురుకులాల జిల్లా సమన్వయకర్త సుగుణశ్రీ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలో సాంఘిక సంక్షేమ గురుకుల, క్రిష్ణ గోకులం ఉన్నత, లిటిల్‌ స్టార్స్‌ ఉన్నత, రవితేజ ఉన్నత పాఠశాలల్లో పరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. 1,008 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. ఉదయం 10 నుంచి 12:30 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు వివరించారు. విద్యార్థులు సకాలంలో హాజరు కావాలని కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని