పొరపాటుతో స్వతంత్రం.. తారుమారు
చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది.
2004లో మారిన సమీకరణలు
నాగర్కర్నూల్, న్యూస్టుడే : చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది. దీంతో పరిస్థితులు అనుకూలించకుండా పోయాయి. 2004లో రాష్ట్రంలో కాంగ్రెస్, తెరాస పొత్తులో భాగంగా కలిసి పోటీ చేశాయి. నాగర్కర్నూల్ పార్లమెంట్ స్థానాన్ని తెరాసకు కేటాయించారు. తెరాస అభ్యర్థిగా కేఎస్ రత్నంను కేటాయించారు. బీఫాంను తీసుకొచ్చిన కేఎస్ రత్నం ఎవరైనా ఎత్తుకెళ్తారనే భయంతో తన కూతురి బ్యాగ్లో ఉంచారు. ఈ క్రమంలోనే బీఫాం జత చేయకుండా ఒకటి పార్టీ తరఫున, మరోటి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేశాడు. బీఫాం జత చేయటం మరిచిపోయినట్లుగా గుర్తించి తర్వాత బీఫాంను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఇవ్వడానికి వెళ్లాడు. అప్పటికే సమయం దాటిపోయిందని తీసుకోలేదు. పార్టీ తరఫున వేసిన నామినేషన్ను తిరస్కరించారు. స్వతంత్ర అభ్యర్థిగా వేసిన నామినేషన్ను ఆమోదించారు. తప్పని పరిస్థితుల్లో స్వతంత్ర అభ్యర్థిగానే రంగంలోనే నిలువాల్సి వచ్చింది. టెంకాయ గుర్తుతో ప్రచారం చేశారు. అదే గుర్తుకు ఓటు వేయాలని కేసీఆర్, తెరాస నాయకులు అప్పట్లో ప్రచారం చేశారు. కేఎస్ రత్నంకు 3,05,396 ఓట్లు వచ్చాయి. తెదేపా అభ్యర్థిగా పోటీ చేసిన మంద జగన్నాథం 99,650 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
మరో స్వతంత్ర అభ్యర్థికి అధికంగా ఓట్లు..: 2004లో ఎన్నికల్లోనే మరో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన భగవంతుకు ఊహించకుండా భారీగా ఓట్లు వచ్చాయి. భగవంతు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. ఎంపీ అభ్యర్థిగా రంగంలో ఉన్న భగవంతుకు విమానం గుర్తు కేటాయించారు. అదే సమయంలో కొల్లాపూర్, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల్లో పొత్తులో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులను అక్కడ నిలుపలేదు. కాంగ్రెస్ టిక్కెట్లు దక్కకపోవడంతో కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు, పరిగిలో హరీశ్వర్రెడ్డి స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగారు. వారిద్దరికి విమానం గుర్తు వచ్చింది. అసెంబ్లీకి ఒక గుర్తుకు, పార్లమెంటుకు మరో గుర్తుకు వేయాలని చెబితే నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో అసెంబ్లీకి, పార్లమెంటుకు విమానం గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేసుకున్నారు. దీంతో లోక్సభకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో నిలిచిన భగవంతుకు 1,19,813 ఓట్లు వచ్చాయి. ఫలితాల తర్వాత స్వతంత్ర అభ్యర్థికి భారీగా ఓట్లు వచ్చాయని ఆశ్చర్యం వ్యక్తమైంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పెట్రోల్ బంకులపై పర్యావేక్షణేదీ..!
[ 23-05-2024]
ఉమ్మడి మహబూబ్నగర్లోని పలు పెట్రోల్ బంక్ల్లో చమురు తక్కువగా వస్తుందని, అందులోనూ కల్తీ జరుగుతుందనే ఆరోపణలు వస్తున్నాయి. -
దేవుడి భూముల రక్షణకు చర్యలు
[ 23-05-2024]
మొదట సాగుచేసుకుంటారు.. అనంతరం నెమ్మదిగా తమ పేరుమీదికి మార్చుకుంటారు. అనంతరం అమ్మేస్తుంటారు. దేవాలయ భూముల విషయంలో జరుగుతున్న తంతు ఇది. -
రేపటి నుంచి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు
[ 23-05-2024]
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు యంత్రాంగం ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈసారి ఉమ్మడి జిల్లాలో ఫలితాలు అనుకున్న స్థాయిలో రాలేదు. -
పురపాలిక జాగా.. అక్రమంగా పాగా
[ 23-05-2024]
మహబూబ్నగర్ నడిబొడ్డులో పురపాలక సంఘానికి చెందిన ఖాళీ స్థలాన్ని కొందరు వ్యక్తులు అమ్మేశారు. వారి నుంచి కొనుగోలు చేసిన వ్యక్తి పురపాలక స్థలంలో ఏకంగా ఇంటి నిర్మాణం చేపట్టాడు. -
భూ తగాదాలతో తల్లీకూతుళ్ల ఆత్మహత్య
[ 23-05-2024]
పిల్లలను చదివించుకోవాలనే తపన.. చేతిలో డబ్బులు లేని పరిస్థితి... పంపకాల్లో తన వాటాగా సీలింగ్ భూమి ఇవ్వడంతో దాన్ని అమ్ముకోలేని దుస్థితి. దీనిపై భూతగాదాలు.. -
ముమ్మాటికీ శిఖమే!
[ 23-05-2024]
పట్టాదారులు కుంటలో మట్టి నింపి శిఖం భూమిలో వెంచరు ఏర్పాటుకు యత్నించిన వైనంపై బుధవారం ‘అదును చూసి ఆక్రమణలు’ శీర్షికతో ‘ఈనాడు’లో ప్రచురితమైన కథనానికి నీటి పారుదల శాఖ అధికారులు స్పందించారు. -
మహిళల పెన్నిధి.. చదువుల సన్నిధి!
[ 23-05-2024]
ఉమ్మడి జిల్లాలోనే ఏకైక మహిళా డిగ్రీ కళాశాలగా ఉన్న మహబూబ్నగర్లోని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అనేక ప్రత్యేకతలతో ఆదర్శంగా నిలుస్తోంది. -
కల నెరవేరేలా.. మెళకువలు పెంపొందేలా!
[ 23-05-2024]
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ), మహబూబ్నగర్ జిల్లా క్రికెట్ సంఘం (ఎండీసీఏ) సంయుక్త ఆధ్వర్యంలో 8 ఏళ్ల విరామం తర్వాత ఉమ్మడి జిల్లాలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేశారు. -
ఆహారపు గొలుసుతోనే మానవ మనుగడ
[ 23-05-2024]
ప్రకృతికి హాని చేయకుండా ఆహారపు గొలుసును కాపాడుకుందామని, అప్పుడే అన్ని జీవాలతో పాటు మానవ మనుగడ సాధ్యమని డా.బూర్గుల రామకృష్ణారావు డిగ్రీ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డా.సదాశివయ్య అన్నారు. -
ఎన్నాళ్లకెన్నాళ్లకు..
[ 23-05-2024]
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కాలువలపై ఐదేళ్ల కిందట నిలిచిన కాంక్రీటు పనులు పునః ప్రారంభించారు. వేసవిలో చేపట్టాల్సిన ఈ పనులను కాలువలను తవ్విన గుత్తేదారు విస్మరించారు. -
నిబంధనలకు విరుద్ధంగా వెంచర్లు
[ 23-05-2024]
భూముల ధరలు పెరుగుతండటంతో స్థిరాస్తి వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతూ అమాయక ప్రజలను నట్టేట ముంచుతున్నారు. -
ప్రజాధనం గాలికొదిలేశారు
[ 23-05-2024]
అత్యవసర వైద్యసేవల సమయంలో రోగికి కృత్రిమశ్వాస అందించడం తప్పనిసరి. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ఆక్సిజన్ కోసం ఎన్నో అగచాట్లు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
తాజా వార్తలు (Latest News)
-
పిన్నెల్లి పరారీ.. పోలీసుల అసమర్థతకు నిదర్శనం: ప్రత్తిపాటి
-
‘మంజుమ్మల్ బాయ్స్’నిర్మాణ సంస్థకు ఇళయరాజా లీగల్ నోటీసులు
-
బెంగళూరు రేవ్ పార్టీ.. తెలుగు నటికి డ్రగ్ పాజిటివ్: పోలీసులు
-
కొత్త అధ్యక్షుడి ప్రసంగం ఎఫెక్ట్.. తైవాన్కు చైనా ‘పనిష్మెంట్’..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
డ్రైవింగ్ లైసెన్స్ కొత్త రూల్స్.. టెస్ట్ కోసం ఆర్టీవో ఆఫీసుకు వెళ్లక్కర్లేదు!