రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యం
రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సంఘీభావం ప్రకటిస్తున్న తెజస అధ్యక్షుడు ఆచార్య కోదండరాం, యోగేంద్ర యాదవ్ తదితరులు
పాలమూరు, న్యూస్టుడే : రాజ్యాంగ పరిరక్షణ అందరి కర్తవ్యమని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీసీ చర్చి మైదానంలో భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి నిర్వహించిన సభకు కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని భాజపా రాజ్యాంగాన్ని మారుస్తామని స్పస్టంగా చెప్పిందన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ, దాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. ఈ క్లిష్ట సమయంలో మౌనంగా ఉంటే ప్రమాదంలో పడినట్లేనని, లోక్సభ ఎన్నికల్లో ఓటు ద్వారా భాజపాకు బుద్ధి చెప్పాలన్నారు. దేశంలో అన్ని రకాల వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన జీఎస్టీతో రూ.58లక్షల కోట్ల ఆదాయం ఖజానాకు వస్తున్నా 6.5 శాతం మాత్రమే పేదలకు అందుతోందన్నారు. నిరుద్యోగిత శాతం గణనీయంగా పెరిగిందన్నారు. భాజపా కార్పొరేట్ శక్తులకు వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. అసమానతలను నిర్మూలించడానికి ఇండియా కూటమి పేదల పక్షాన నిలబడిందన్నారు. స్వరాజ్ అభియాన్ సంస్థ వ్యవస్థాపక సభ్యుడు ఆచార్య యోగేంద్ర యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగం వ్యక్తి స్వేచ్ఛను కాపాడే పవిత్ర గ్రంథమన్నారు. దేశాభివృద్ధికి బ్లూ ఫ్రింట్ మాదిరిగా రాజ్యాంగం పని చేస్తుందన్నారు. దేశంలో అభివృద్ధి ఫలాలు ప్రతి ఒక్కరికీ అందేలా రాజ్యాంగంలో పొందుపర్చారని పేర్కొన్నారు. భాజపా నాయకులు మాత్రం రాజ్యాంగాన్ని మార్చుతామని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఆచార్య హరగోపాల్ మాట్లాడుతూ డా.బీఆర్ అంబేడ్కర్ అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని వివిధ దేశాలు తిరిగి రాజ్యాంగాన్ని రాస్తే పాలకులు సమూలంగా మార్చుతామని చెబుతున్నారని పేర్కొన్నారు. ప్రతి వ్యక్తికి సామాజిక హోదాతో పని లేకుండా సమాన అవకాశాలు పొందడానికి, సమానంగా ఎదగడానికి కావాల్సిన రాజ్యాంగం హక్కులు కల్పించిందని తెలిపారు. అలాంటి రాజ్యాంగాన్ని మార్చాలని చూసే భాజపాకు తగిన మూల్యం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆచార్య ఖాసీం, దాసురాం నాయక్, ఐవీ ఆశ్వీరాదం, విల్సన్, అమీర్ అలీ ఖాన్, ఖాలిక్ సాబ్రి సాహెబ్, హఫీజ్, కాచం సత్యనారాయణగుప్త, ఖలీల్, హనీఫ్ మహమ్మద్, వన్నాడ అంజన్న, ప్రసాద్, రవినాయక్, గట్టన్న ముదిరాజ్, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలానగర్ వద్ద రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
[ 11-05-2024]
జిల్లాలోని బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. -
భాజపాలో కొత్త జోష్
[ 11-05-2024]
సభకు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసుశాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతో సభ సాఫీగా ముగిసిపోయింది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాహనాలను అక్కడి సమీపంలో పార్కింగ్ చేయించడం, ట్రాఫిక్ ఆంక్షల మూలంగా సభ సజావుగా ముగిసింది. -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
పాలమూరులో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెర పడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివీ.
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
పొరపాటుతో స్వతంత్రం.. తారుమారు
[ 11-05-2024]
చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది. -
ఏ అభ్యర్థి ఓటు ఎక్కడ..?
[ 11-05-2024]
పార్లమెంట్కు దేశంలోని ఏ లోక్సభ స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని తెలిసిందే. నియోజకవర్గంలోనే ఓటు ఉండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. -
ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందాం: చల్లా
[ 11-05-2024]
స్థానికుడైన ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
భాజపాపై కాంగ్రెస్, భారాస విష ప్రచారం తగదు
[ 11-05-2024]
రిజర్వేషన్లను మార్చే హక్కు, అధికారం ఏ పార్టీలకు లేదని, ఎస్సీ వర్గీకరణ విషయంలో భాజపా నిర్ణయం స్థిరంగా ఉన్నదని స్పష్టం చేశారు. -
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
[ 11-05-2024]
నాగర్కర్నూల్, షాద్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. -
ఓటు సద్వినియోగంతోనే సమస్యలకు పరిష్కారం
[ 11-05-2024]
బల్మూర్ మండలంలో చేపట్టనున్న శ్రీ ఉమామహేశ్వర జలాశయంతో బలహీన వర్గాల ప్రజలు అధికంగా భూములను కోల్పోతున్నారని బాధితులు ఆందోళన బాట బట్టారు. -
మద్యం రేషన్కు గేట్లెత్తారు !
[ 11-05-2024]
నిన్నటివరకు రేషన్ పద్ధతిన సరఫరా చేసిన మద్యానికి శుక్రవారం ఒక్కరోజు గేట్లెత్తేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రూ. 25 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
జగన్ పాలనలో హిందువుల మనోభావాలతో చెలగాటం: శ్రీనివాసానంద సరస్వతి
-
‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ రిలీజ్.. రాజమౌళి ప్రత్యేక సందేశం
-
‘నాదేముంది.. ఇదే చివరిది’.. ఐపీఎల్కు రోహిత్ శర్మ గుడ్బై చెప్పనున్నాడా?
-
చెన్నై మీదుగా ప్రయాణించిన అంతరిక్ష కేంద్రం.. వీడియో వైరల్
-
పాసు పుస్తకాలపై జగన్ బొమ్మా? వీధుల్లోకి వచ్చి నకళ్లను తగులబెట్టండి: చంద్రబాబు పిలుపు
-
ఇది మా స్థాయి ఫీల్డింగ్ కాదు.. 15 పరుగులు అదనంగా ఇచ్చాం: రుతురాజ్