నేడు గురుకుల కళాశాలల్లో ప్రవేశానికి పరీక్ష
మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తెలిపారు.
12 కేంద్రాలు.. 2,755 మంది అభ్యర్థులు
మాట్లాడుతున్న డీఈవో రవీందర్, బీసీ గురుకులాల జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తదితరులు
మహబూబ్నగర్ అర్బన్, న్యూస్టుడే : మహాత్మా జ్యోతిబా ఫులే వెనకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి ఈ నెల 28న టీఎస్ ఆర్జేసీ, ఆర్డీసీ సెట్ - 2024 నిర్వహిస్తున్నట్లు జిల్లా సమన్వయ అధికారి రవిప్రకాశ్ తెలిపారు. శనివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రం ఆర్వీఎం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. జూనియర్ కళాశాలల్లో ప్రవేశానికి 1908, డిగ్రీ కళాశాలల్లో ప్రవేశానికి 847 విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మాధ్యాహ్నం 12.30 గంటల వరకు 12 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణకు సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు డీఈవో రవీందర్ తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టంచేశారు. విద్యార్థులు గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు. కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరని, హాల్ టికెట్ ఉంటేనే కేంద్రంలోకి పంపిస్తారని చెప్పారు. పరీక్ష ముగిసే వరకు అభ్యర్థులు కేంద్రంలోనే ఉండాలని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయిజ, గద్వాల పట్టణాల్లో మంత్రి ప్రచారం
[ 11-05-2024]
జిల్లాలోని అయిజ, గద్వాల పట్టణాల్లో శనివారం మంత్రి దామోదర రాజనర్సింహ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మండలంలో భాజపా ఎన్నికల ప్రచారం
[ 11-05-2024]
వడ్డేపల్లి మండలంలోని కొంకల గ్రామంలో శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ రాజు గౌడ్ ఆధ్వర్యంలో భాజపా నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
బాలానగర్ వద్ద రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
[ 11-05-2024]
జిల్లాలోని బాలానగర్ వద్ద భారీగా మద్యం పట్టుబడింది. -
భాజపాలో కొత్త జోష్
[ 11-05-2024]
సభకు ఎలాంటి అంతరాయం లేకుండా పోలీసుశాఖ పటిష్ఠ ఏర్పాట్లు చేయడంతో సభ సాఫీగా ముగిసిపోయింది. ఏ ప్రాంతం నుంచి వచ్చిన వాహనాలను అక్కడి సమీపంలో పార్కింగ్ చేయించడం, ట్రాఫిక్ ఆంక్షల మూలంగా సభ సజావుగా ముగిసింది. -
నేటితో ప్రచారానికి తెర
[ 11-05-2024]
పాలమూరులో సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి శనివారంతో తెర పడనుంది. సాయంత్రం 5 గంటల తర్వాత సభలు, సమావేశాలు, ఇంటింటి ప్రచారం అన్నింటికీ ముగింపు పలకాలి. -
పాలమూరు ఆత్మగౌరవ ఎన్నికలివీ.
[ 11-05-2024]
సార్వత్రిక ఎన్నికలు ఇద్దరి మధ్యనో, మూడు పార్టీల మధ్యనో జరుగుతున్నవి కాదని.. పాలమూరు ఆత్మగౌరవానికి, ఈ ప్రాంత 70 ఏళ్ల వెనకబాటుతనానికి, వలస పోతున్న వారి కోసం జరుగుతున్నవని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. -
పొరపాటుతో స్వతంత్రం.. తారుమారు
[ 11-05-2024]
చిన్న పొరపాట్లతో సమీకరణలు, ఫలితాలు మారుతుంటాయి. 2004లో నాగర్కర్నూల్ ఎంపీ స్థానానికి కేఎస్ రత్నంను తెరాస అభ్యర్థిగా ప్రకటించినా సకాలంలో భీపాం అందించకపోవడంతో స్వతంత్ర అభ్యర్థిగా రంగంలో నిలువాల్సి వచ్చింది. -
ఏ అభ్యర్థి ఓటు ఎక్కడ..?
[ 11-05-2024]
పార్లమెంట్కు దేశంలోని ఏ లోక్సభ స్థానం నుంచైనా పోటీ చేయవచ్చని తెలిసిందే. నియోజకవర్గంలోనే ఓటు ఉండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. -
ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందాం: చల్లా
[ 11-05-2024]
స్థానికుడైన ప్రవీణ్కుమార్ను గెలిపించుకుందామని ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి పిలుపునిచ్చారు. -
భాజపాపై కాంగ్రెస్, భారాస విష ప్రచారం తగదు
[ 11-05-2024]
రిజర్వేషన్లను మార్చే హక్కు, అధికారం ఏ పార్టీలకు లేదని, ఎస్సీ వర్గీకరణ విషయంలో భాజపా నిర్ణయం స్థిరంగా ఉన్నదని స్పష్టం చేశారు. -
చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్టు
[ 11-05-2024]
నాగర్కర్నూల్, షాద్నగర్, నారాయణపేట, వనపర్తి జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. -
ఓటు సద్వినియోగంతోనే సమస్యలకు పరిష్కారం
[ 11-05-2024]
బల్మూర్ మండలంలో చేపట్టనున్న శ్రీ ఉమామహేశ్వర జలాశయంతో బలహీన వర్గాల ప్రజలు అధికంగా భూములను కోల్పోతున్నారని బాధితులు ఆందోళన బాట బట్టారు. -
మద్యం రేషన్కు గేట్లెత్తారు !
[ 11-05-2024]
నిన్నటివరకు రేషన్ పద్ధతిన సరఫరా చేసిన మద్యానికి శుక్రవారం ఒక్కరోజు గేట్లెత్తేయడంతో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రూ. 25 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
రిషభ్ పంత్పై ఒక మ్యాచ్ వేటు.. రెండున్నర రెట్ల భారీ జరిమానా
-
ఇ-ఫైలింగ్ పోర్టల్లో కొత్త సదుపాయం.. నోటీసులు తెలుసుకోవడం సులువు
-
తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
-
‘‘గౌతమ్ భయ్యా.. మీరు కోల్కతాను వదిలి పెట్టి వెళ్లొద్దు’’
-
అఫ్గాన్లో మెరుపు వరదలు.. 200 మంది మృతి..!
-
జెలెన్స్కీ హత్యకు కుట్ర.. బాడీగార్డ్ చీఫ్పై వేటు వేసిన అధ్యక్షుడు