అలంపూర్ బేనీషా.. ప్రియం
ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది.
తోటల్లో కాత అంతంత మాత్రమే
ర్యాలంపాడులో కాతలేని అలంపూర్ బేనీషా మామిడి తోట
అలంపూర్, న్యూస్టుడే: ప్రఖ్యాతి గాంచిన అలంపూర్ బేనీషా ఈ ఏడాది దొరకడం గగనమే. అత్యంత రుచికరమైన ఈ పండుకు మంచి గిరాకీ ఉంటుంది. ఈసారి వాతావరణ పరిస్థితులు అనుకూలించక తోటల్లో సగానికన్నా తక్కువ కాత కన్పిస్తోంది.
ఐదు వేలకుపైగా ఎకరాల్లో..: గద్వాల జిల్లాలో 5,400 ఎకరాల్లో ఈ రకం మామిడి తోటలున్నాయి. అత్యధికంగా గట్టు మండలంలో రెండు వేల ఎకరాల వరకు సాగవుతోంది. అత్యల్పంగా అలంపూర్ మండలంలో 500 ఎకరాల వరకు సాగులో ఉంది. ఈ రకానికి చెందినవి పూర్తిగా మాగాల్సిన అవసరం కూడా ఉండదు. పక్వానికి వచ్చి పచ్చ రంగులోకి మారితే చాలు తీయగా ఉంటుంది. లోపలి భాగంలో సైతం పచ్చ రంగుతోనే కనిపిస్తుంది. టెంక కూడా చిన్న పరిమాణంలో ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉండటంతో ఈ పండ్లకు డిమాండు ఉండేది. విదేశాలకు సైతం ఎగుమతి అవుతుంటుంది. గతేడాది ఎకరాకు నాలుగు టన్నుల మేరకు దిగుబడి వచ్చిందని, ఈ ఏడాది రెండు టన్నులు రావడం కూడా కష్టమేనని రైతులు అంటున్నారు. తోటలకు రూ.లక్షల్లో పెట్టుబడులు పెట్టామని, పురుగుల మందు పిచికారీ చేసినా, ఎరువులు పెట్టినా దిగుబడి కానరావడం లేదని వారంటున్నారు. అక్టోబరులో రాత్రి సమయంలో 14 డిగ్రీల ఉష్ణోగ్రత ఉంటే చెట్లకు మంచిగా పూత వచ్చే అవకాశం ఉంటుంది. ఆ సమయంలో ఈ ఏడాది అనుకూల ఉష్ణోగ్రతలు లేకపోవడంతో పూత తగ్గిపోయింది. ప్రస్తుతం రాత్రి సమయంలో చల్లగా ఉండటంతో ఈ మధ్య కాలంలో ఆలస్యంగా కొంత పూత వచ్చింది.
ప్రయోజనం లేదు: పది ఎకరాల్లో ఈ తరహా మామిడి సాగుచేస్తున్నాను. రూ.రెండు లక్షల వరకు మందుల పిచికారీకి వెచ్చించాను. అయినా ఆశించిన మేర దిగుబడి రాలేదు. పెట్టిన పెట్టుబడి, అంతర్ సేద్యం, కూలీలు ఇలా చాలా మేరకు పెట్టుబడులు అయినా ప్రయోజనం కన్పించలేదు. ఈ ఏడాది పూత సరిగా రాకపోవడంతో కౌలుకు తీసుకునేందుకు కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో స్వయంగా సాగు చేసుకున్నాను.
గోవిందు, రైతు, గొందిమళ్ల
వాతావరణంలో మార్పుల వల్లనే..: వాతావరణంలో మార్పుల వల్ల ఈ ఏడాది మామిడి తోటల్లో దిగుబడి రాలేదు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం, సరైన వర్షాలు లేకపోవడంతో పూత సరిగా రాలేదు. ఈ నేపథ్యంలో దిగుబడులు బాగా తగ్గిపోయే అవకాశముంది.
రాజశేఖర్, హార్టికల్చర్ అధికారి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా భగీరథ మహర్షి జయంతి
[ 14-05-2024]
మండల కేంద్రమైన రాజోలి గ్రామంలో భగీరథ మహర్షి జయంతిని ఘనంగా నిర్వహించారు. -
ఓటెత్తిన పాలమూరు
[ 14-05-2024]
ఎల్లెడలా చైతన్యం వెల్లివిరిసింది... ఊరూవాడ ఓట్ల పండగకు కదిలింది. ఉమ్మడి జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఓటేయడానికి ఉదయం నుంచే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. నవతరం, వృద్ధుల్లోనూ ఉత్సాహం కనిపించింది. వాతావరణం కాస్త చల్లబడినా 10 గంటల తర్వాత ఉష్ణోగ్రత పెరిగింది. -
రెండు ఎంపీ స్థానాలు గెలుస్తాం: చిన్నారెడ్డి
[ 14-05-2024]
మహబూబ్నగర్, నాగర్కర్నూల్ ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి అన్నారు. సోమవారం ఆయన స్వగ్రామం జయన్నతిరుమలాపురంలో ఓటుహక్కు వినియోగించుకున్న తర్వాత విలేకరులతో మాట్లాడారు. -
మొరాయించిన ఈవీఎంలు
[ 14-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. వాటి స్థానంలో కొన్నిచోట్ల కొత్తవి ఏర్పాటు చేయగా మరికొన్ని చోట్ల మరమ్మతులు చేసి పోలింగ్ ప్రక్రియ ప్రారంభించారు. -
ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది
[ 14-05-2024]
కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, పురావస్తు శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. -
డబ్బు పంచుతున్న నాయకుడిపై కేసు
[ 14-05-2024]
ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్న మండలంలోని వెలటూరు గ్రామానికి చెందిన పరామళ్ల ప్రకాశ్పై కేసు నమోదు చేశామని ఎస్సై రమేశ్ తెలిపారు. -
ఓటుహక్కు వినియోగించుకున్న ప్రముఖులు
[ 14-05-2024]
సింగరేణి ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం తన స్వగ్రామమైన మహబూబ్నగర్ జిల్లా తిరుమలగిరిలో సోమవారం ఓటుహక్కును వినియోగించుకొన్నారు. -
లేయర్ కోళ్లకు వడదెబ్బ
[ 14-05-2024]
కోడిగుడ్డు ధర కొండెక్కి కూర్చుంది. డిమాండ్కు తగ్గట్టుగా సరఫరా లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని కొన్ని ప్రధాన పట్టణాల్లో రెండు రోజులుగా గుడ్ల లభ్యత లేకుండా పోయింది. మహబూబ్నగర్ పట్టణంలో గుడ్లు అరకొరగా సరఫరా అవుతున్నాయి. -
అభ్యంతరాలు.. వాగ్వాదాలు.. తోపులాటలు
[ 14-05-2024]
లోక్సభ పోలింగ్ నేపథ్యంలో సోమవారం ఆత్మకూరుతో పాటు మండలంలోని జూర్యాల, గుంటిపల్లి గ్రామాల్లో చెదురుముదురు ఘటనలు జరిగాయి. జూరాల గ్రామంలో ఓటర్లను ఆటోల్లో తరలించే విషయంలో కాంగ్రెస్, భారాస కార్యకర్తలు పరస్పరం దాడికి పాల్పడ్డారు.
తాజా వార్తలు (Latest News)
-
హోర్డింగ్ కుప్పకూలిన ఘటన.. వెలుగులోకి పలు కీలక విషయాలు
-
వెజ్ థాలీ ధర పెరిగింది.. నాన్ వెజ్ తగ్గింది.. ఎందుకిలా?
-
స్వాతి మాలీవాల్పై దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
-
జగన్ విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి
-
దిల్లీ మద్యం కేసులో ఆప్ను నిందితుల జాబితాలో చేరుస్తాం: ఈడీ
-
సార్వత్రిక ఎన్నికల వేళ.. సరిహద్దులో ‘పాక్’ డ్రోన్ల కలకలం!