దోచుకున్న సొమ్ముతో దుబాయ్లో పెట్టుబడులు : వంశీచంద్రెడ్డి
కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు.
మాట్లాడుతున్న కాంగ్రెస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, చిత్రంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి
బాలానగర్, న్యూస్టుడే : కేసీఆర్ కుటుంబం తెలంగాణలో పదేళ్ల పాటు దోచుకున్న సొమ్మంతా దుబాయ్లోని మాల్స్లో పెట్టుబడులు పెట్టిందని, అక్కడ అకాల వర్షాలతో మాల్స్ కొట్టుకుపోతే వారిలో అలజడి మొదలైందని మహబూబ్నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా బాలానగర్ మండలంలోని మోతిఘణపూర్, గంగాధర్పల్లి, మేడిగడ్డతండా, సురారం గ్రామాల్లో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వంశీచంద్రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో భారాస పోటీపడి దోచుకున్నాయని ఆరోపించారు. రాహుల్గాంధీ నాయకత్వంలో కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావటం ఖాయమని పేర్కొన్నారు. ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి మాట్లాడుతూ కులం, మతం పేరిట కాదు, అభివృద్ధి, సంక్షేమ ప్రజాపాలన కోసం కాంగ్రెస్కు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు. పెద్దాయపల్లి మాజీ సర్పంచి శంకర్ కాంగ్రెస్లో చేరారు. నాయకులు శంకర్నాయక్, ప్రదీప్కుమార్గౌడ్, నందీశ్వర్, స్లోమానాయక్, రఫీక్, నవీన్రెడ్డి పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ పోరు.. మారని తీరు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికపై పాలమూరు ఓటర్ల ఆసక్తి తగ్గుది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుది. -
స్ట్రాంగ్రూంలకు చేరిన ఈవీఎంలు
[ 15-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలను పాలమూరు వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలలో మంగళవారం భద్రపరిచారు. -
పీయూ ఉపకులపతి పదవికి తీవ్ర పోటీ
[ 15-05-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి(వీసీ) పోస్టుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా దరఖాస్తులు అందిన వర్సిటీల్లో పీయూ మూడో స్థానంలో ఉంది. -
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : డీకే అరుణ
[ 15-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఆమె భాజపా జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
అలసి.. సొలసి.. సేదదీరి!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నుంచి క్షణం తీరిక లేకుండా గడిపిన ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు మంగళవారం కాస్త తీరికగా కనిపించారు. -
ఇన్నాళ్లు కళకళ.. నేడు వెలవెల
[ 15-05-2024]
తెలంగాణలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల రోజులుగా మహబూబ్నగర్లో సందడి నెలకొన్న ప్రధాన పార్టీల కార్యాలయాలు మంగళవారం బోసిపోయి కనిపించాయి. -
ఎన్నికల సిబ్బంది ప్రయాణ కష్టాలు
[ 15-05-2024]
ఎన్నికల సిబ్బంది పోలింగ్ అనంతరం ఇళ్లకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి ఈవీఎంలు, ఇతర సామగ్రి తీసుకొని వచ్చి అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అప్పగించారు. -
మట్టి పాత్రలకు మంచిరోజులు
[ 15-05-2024]
కరోనా తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యం పట్ల జనానికి స్పృహ పెరిగింది. అందులో భాగంగా అల్యూమినియం, స్టీల్పాత్రలు వంటలకు ఉపయోగించడం మానుకొని మట్టి పాత్రలు వాడేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 15-05-2024]
మద్యం దుకాణం నిర్వాహకులు చేసిన దాడిలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. -
తీరని సాగునీటి గోస
[ 15-05-2024]
యాసంగి సీజన్లో సాగు నీటి సమస్య ఏళ్లుగా వేధిస్తోంది. సింగోటం జలాశయం నుంచి గోపల్దిన్నె జలాశయానికి లింకు కాల్వల నిర్మాణం పూర్తి చేస్తేనే సాగునీటి సమస్య తీరనుంది. -
భారాస కౌన్సిలర్ కుటుంబంపై దాడి
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం మొదలైన వివాదం రాజకీయంగా దాడులకు తెరలేపింది. -
పుస్తకాలొచ్చాయ్.. వస్త్రమే రాలె
[ 15-05-2024]
రాబోయే విద్యా సంవత్సరానికి ఉచిత పాఠ్యపుస్తకాలు వచ్చాయి. తొలివిడత ఇప్పటికే 20 శాతం మేరకు పుస్తకాలు జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ గోదాముకు చేరాయి. -
పురాల్లో పన్ను బాదుడు
[ 15-05-2024]
పురపాలక సంఘాల్లో పన్ను బాదుడు మొదలైంది. కొత్త పురపాలక చట్టం 2019 ప్రకారం నమోదు చేయడంతో పన్ను దారులు లబోదిబోమంటున్నారు. -
వాళ్లమ్మిందే మందు!
[ 15-05-2024]
జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు లేకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెడికల్ దుకాణాల వారిదే ఇష్టారాజ్యమవుతోంది. -
ఆరు బూత్లలో 50 శాతం లోపే పోలింగ్
[ 15-05-2024]
నాగర్ కర్నూల్ లోకసభ స్థానం పరిధిలోని గద్వాల పురపాలక సంఘంలో అతి తక్కువగా పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు వెలుగుచూడటంపై ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
5.3 లక్షల మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో 5.30 లక్షల మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. ఈ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా..
తాజా వార్తలు (Latest News)
-
కోర్టులో ఎన్నికల ఫలితాలు తేల్చుకునేవారు.. మాకు హితబోధలా?: వెస్టర్న్ మీడియాకు జైశంకర్ చురకలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కృష్ణాలో వైకాపా ఆనవాళ్లు మిగలవు: ఎంపీ బాలశౌరి
-
ఎవరి లెక్కలు వారివే.. భారీ ఆధిక్యంపై కాంగ్రెస్ ధీమా
-
ఆంధ్రప్రదేశ్లో 44 రోజులు... రూ.17 వేల కోట్ల అప్పులు
-
హైదరాబాద్ జూలో తెల్ల పులి మృత్యువాత