వలస ఓటర్లపై ఆశలు!
సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు.
గత శాసనసభ ఎన్నికల్లో బస్సులో స్వస్థలాలకు వస్తున్న ఓటర్లు
ఈనాడు, మహబూబ్నగర్: సార్వత్రిక ఎన్నికల్లో పాలమూరులోని రెండు లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని వలస ఓటర్లపై ప్రధాన పార్టీల అభ్యర్థులు దృష్టి పెట్టారు. ముంబయి, పుణె, భీమండిలో ఈ ప్రాంతానికి చెందిన ఓటర్లు అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వేలాది మంది ఉపాధి కోసం హైదరాబాద్లో స్థిరపడ్డారు. మహబూబ్నగర్ స్థానం పరిధిలో మహబూబ్నగర్, నారాయణపేట, కొడంగల్, మక్తల్, దేవరకద్ర అసెంబ్లీ సెగ్మెంట్లలో వలస ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో సుమారు 90 వేల మంది వలస ఓటర్లు ఉన్నట్లు అంచనా. నారాయణపేట, ధన్వాడ, కోయిల్కొండ, మద్దూరు, కోస్గి, బొంరాస్పేట, హన్వాడ మండలాల నుంచి ఎక్కువ మంది ఉపాధి కోసం వలస వెళ్లారు. నాగర్కర్నూల్ పరిధిలో వనపర్తి, అచ్చంపేట, నాగర్కర్నూల్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో 35 వేల మంది మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. వీరందరికీ ఉమ్మడి జిల్లాలో ఓటుహక్కు ఉంది. మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈ ఓటర్లను ఎలా తీసుకురావాలన్న దానిపై ప్రధాన పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. ఇప్పటికే ఆ నియోజకవర్గాల స్థానిక నేతలతో పార్టీ ముఖ్యులు సంప్రదింపులు జరుపుతున్నారు. అక్కడున్న గుంపు మేస్త్రీలు, ఓటర్ల వివరాలు, చరవాణి నంబర్లను సేకరించి పెట్టుకున్నారు. ప్రధానంగా మహబూబ్నగర్ లోక్సభ పరిధిలో ప్రధాన పార్టీలకు వలస ఓటర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
ఓటేసేందుకు వస్తారా..: గతేడాది నవంబరు 30న జరిగిన శాసనసభ ఎన్నికలకు వలస ఓటర్లు ఉమ్మడి జిల్లాకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మళ్లీ నాలుగు నెలల్లోనే లోక్సభ ఎన్నికలు రావడంతో పోలింగ్ రోజు వస్తారా.. లేదా.. అన్న ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది. వలస ఓటర్లు ఉన్న గ్రామాలకు చెందిన నేతలు కూడా ఈ ఎన్నికల్లో ఓటింగ్కు తీసుకురావడానికి ఆసక్తి చూపడం లేదు. సార్వత్రిక ఎన్నికలు ముగియగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికలకు ప్రతి ఓటూ కీలకమే. అందుకే స్థానిక నేతలు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకే వీరిని రప్పిస్తే తమ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయన్న ఆలోచనలో ఉన్నారు. పైకి మాత్రం ప్రధాన పార్టీల ముఖ్యనేతలతో సంప్రదింపులు జరుపుతున్నా.. వీరిని రప్పించడంతో మాత్రం పెద్ద ఆసక్తి చూపడం లేదు.
రాజధానిలోని ఓటర్లూ కీలకమే..: ఉమ్మడి జిల్లాకు చెందిన ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ఈ సంఖ్య రెండు నియోజకవర్గాల పరిధిలో కలిపి సుమారు లక్షన్నరకుపైగా ఉంటుందని అంచనా. ఇప్పటికే హైదరాబాద్లో నివాసం ఉంటున్న ఓటర్ల వివరాలను ప్రధాన పార్టీల అభ్యర్థులు సేకరించి పెట్టుకున్నారు. ఈ వారం రోజుల్లో ముఖ్య నేతలు రాజధానిలోని వలస ఓటర్లతో సమావేశానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. హైదరాబాద్ నుంచి ఉదయం వచ్చి ఓటు వేసి రాత్రికి వెళ్లవచ్చు. వారికి కావాల్సిన వాహనాలను కూడా సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఓటింగ్ శాతం పెరిగితే ఏ పార్టీకి లాభం ఉంటుందన్న సమీకరణాలను ప్రధాన పార్టీలు బేరీజు వేసుకుంటున్నాయి. దాని ప్రకారం వలస ఓటర్లను రప్పించే ప్రయత్నాలు చేస్తున్నటు నాయకులు చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గం పరిధిలో 79.89 శాతం, నాగర్కర్నూల్ పరిధిలో 80.95 శాతం ఓటింగ్ నమోదయ్యింది. ఈ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్లో కాంగ్రెస్కు 46.73 శాతం, భారాసకు 38.53 శాతం, భాజపాకు 8.73 శాతం ఓట్లు పడ్డాయి. ఇప్పుడూ జాతీయస్థాయిలో ఓట్ల ప్రభావం చూపే అవకాశాలు ఉండటంతో వలస ఓటర్ల మనస్సులో ఏముందో తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లోక్సభ పోరు.. మారని తీరు
[ 15-05-2024]
సార్వత్రిక ఎన్నికపై పాలమూరు ఓటర్ల ఆసక్తి తగ్గుది. శాసనసభ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా నమోదవుది. -
స్ట్రాంగ్రూంలకు చేరిన ఈవీఎంలు
[ 15-05-2024]
మహబూబ్నగర్ లోక్సభ ఎన్నికల పోలింగ్కు సంబంధించిన ఈవీఎంలను పాలమూరు వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్రూంలలో మంగళవారం భద్రపరిచారు. -
పీయూ ఉపకులపతి పదవికి తీవ్ర పోటీ
[ 15-05-2024]
పాలమూరు విశ్వవిద్యాలయం ఉప కులపతి(వీసీ) పోస్టుకు దరఖాస్తులు వెల్లువెత్తాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా దరఖాస్తులు అందిన వర్సిటీల్లో పీయూ మూడో స్థానంలో ఉంది. -
ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత : డీకే అరుణ
[ 15-05-2024]
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భాజపా మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. లోక్సభ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో మంగళవారం ఆమె భాజపా జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. -
అలసి.. సొలసి.. సేదదీరి!
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రక్రియ మొదలైన నుంచి క్షణం తీరిక లేకుండా గడిపిన ప్రధాన పార్టీల ఎంపీ అభ్యర్థులు మంగళవారం కాస్త తీరికగా కనిపించారు. -
ఇన్నాళ్లు కళకళ.. నేడు వెలవెల
[ 15-05-2024]
తెలంగాణలో సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. నెల రోజులుగా మహబూబ్నగర్లో సందడి నెలకొన్న ప్రధాన పార్టీల కార్యాలయాలు మంగళవారం బోసిపోయి కనిపించాయి. -
ఎన్నికల సిబ్బంది ప్రయాణ కష్టాలు
[ 15-05-2024]
ఎన్నికల సిబ్బంది పోలింగ్ అనంతరం ఇళ్లకు చేరుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. సోమవారం రాత్రి ఈవీఎంలు, ఇతర సామగ్రి తీసుకొని వచ్చి అలంపూర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కేంద్రంలో అప్పగించారు. -
మట్టి పాత్రలకు మంచిరోజులు
[ 15-05-2024]
కరోనా తర్వాత ఉమ్మడి జిల్లాలో ఆరోగ్యం పట్ల జనానికి స్పృహ పెరిగింది. అందులో భాగంగా అల్యూమినియం, స్టీల్పాత్రలు వంటలకు ఉపయోగించడం మానుకొని మట్టి పాత్రలు వాడేవాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. -
చికిత్స పొందుతూ యువకుడి మృతి
[ 15-05-2024]
మద్యం దుకాణం నిర్వాహకులు చేసిన దాడిలో గాయపడిన ఓ యువకుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మహబూబ్నగర్ గ్రామీణ ఠాణా సీఐ గాంధీ నాయక్, కుటుంబ సభ్యులు కథనం ప్రకారం.. -
తీరని సాగునీటి గోస
[ 15-05-2024]
యాసంగి సీజన్లో సాగు నీటి సమస్య ఏళ్లుగా వేధిస్తోంది. సింగోటం జలాశయం నుంచి గోపల్దిన్నె జలాశయానికి లింకు కాల్వల నిర్మాణం పూర్తి చేస్తేనే సాగునీటి సమస్య తీరనుంది. -
భారాస కౌన్సిలర్ కుటుంబంపై దాడి
[ 15-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సోమవారం మొదలైన వివాదం రాజకీయంగా దాడులకు తెరలేపింది. -
పుస్తకాలొచ్చాయ్.. వస్త్రమే రాలె
[ 15-05-2024]
రాబోయే విద్యా సంవత్సరానికి ఉచిత పాఠ్యపుస్తకాలు వచ్చాయి. తొలివిడత ఇప్పటికే 20 శాతం మేరకు పుస్తకాలు జిల్లా కేంద్రంలోని విద్యాశాఖ గోదాముకు చేరాయి. -
పురాల్లో పన్ను బాదుడు
[ 15-05-2024]
పురపాలక సంఘాల్లో పన్ను బాదుడు మొదలైంది. కొత్త పురపాలక చట్టం 2019 ప్రకారం నమోదు చేయడంతో పన్ను దారులు లబోదిబోమంటున్నారు. -
వాళ్లమ్మిందే మందు!
[ 15-05-2024]
జిల్లాలో ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు లేకపోవడంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో మెడికల్ దుకాణాల వారిదే ఇష్టారాజ్యమవుతోంది. -
ఆరు బూత్లలో 50 శాతం లోపే పోలింగ్
[ 15-05-2024]
నాగర్ కర్నూల్ లోకసభ స్థానం పరిధిలోని గద్వాల పురపాలక సంఘంలో అతి తక్కువగా పోలింగ్ నమోదైనట్లు గణాంకాలు వెలుగుచూడటంపై ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
5.3 లక్షల మంది ఓటుకు దూరం
[ 15-05-2024]
నాగర్కర్నూల్ లోక్సభ స్థానం పరిధిలో 5.30 లక్షల మంది ఓటుకు దూరంగా ఉండిపోయారు. ఈ నియోజకవర్గ పరిధిలో మహిళా ఓటర్లు అధికంగా ఉన్నా..
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
న్యూస్క్లిక్ వ్యవస్థాపకుడికి సుప్రీం కోర్టులో ఊరట..బెయిల్ మంజూరు
-
హీరోయిన్లు ఆ విషయంలోనూ పోరాడుతున్నారు: సోనాక్షి సిన్హా
-
పులివర్తి నానిపై హత్యాయత్నం.. పోలీసుల అదుపులో ఆరుగురు అనుమానితులు
-
భోజనానికి ముందు టీ, కాఫీ తాగుతున్నారా.. బీ అలర్ట్!
-
మెడకు స్కార్ఫ్ చుట్టి.. అంగన్వాడీ టీచర్ హత్య