logo

ప్రజాశక్తితో.. ఏడాదిలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని శాసిస్తారు

Updated : 29 Apr 2024 06:27 IST

భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వ్యాఖ్యలు

రోడ్‌షోలో మాట్లాడుతున్న కేటీఆర్‌, వినోద్‌కుమార్‌, నాయకులు

ఈనాడు, కరీంనగర్‌: ప్రజాశక్తిని కూడగట్టుకునే విధంగా పని చేస్తే ఏడాది లోపల రాష్ట్రాన్ని కేసీఆర్‌ శాసిస్తారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్‌ అన్నారు. భారాస నేతలు, కార్యకర్తలను ఇప్పుడు ఇబ్బంది పెడుతున్న ఏసీపీ, డీసీపీలు అప్పుడు మన పక్కన నిలబడతారని, ఇది జరగాలంటే ఈ ఎన్నికల్లో ప్రజల మద్దతును ఓట్ల రూపంలో కూడగట్టాలని పిలుపునిచ్చారు. కరీంనగర్‌, అల్గునూర్‌లలో ఆదివారం జరిగిన బూత్‌ కమిటీ స్థాయి నాయకుల సమావేశాల్లో.. చొప్పదండిలో రోడ్‌షోలో ఆయన మాట్లాడారు. కరీంనగర్‌లో అభివృద్ధి చేసిన వినోద్‌కుమార్‌కే ఈ ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు ఉందని.. ఇతరులకు లేదన్నారు. మోదీ- రేవంత్‌రెడ్డిలు ఒక్కటేనని.. జూన్‌ 4 తరవాత రేవంత్‌రెడ్డి భాజపాలో చేరడం ఖాయమని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో 10-12 ఎంపీ స్థానాలు గెలవాలన్నారు. భాజపాతో స్నేహం లేదని ఒకవేళ ఉంటే.. మన ఆడపడుచును జైల్లో పెట్టే పరిస్థితి వచ్చేదా.. అని పేర్కొన్నారు. సరిపడా బస్సులు లేక కిక్కిరిసి ప్రయాణిస్తుండటంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. భాజపా అభ్యర్థి బండి సంజయ్‌కు జై శ్రీరామ్‌ అనడం తప్ప ఏం తెలియదని విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని