భారాసతోనే ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
శివ్వంపేటలో ప్రసంగిస్తున్న మాజీ మంత్రి హరీశ్రావు, చిత్రంలో పార్లమెంట్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే సునీతారెడ్డి
చిన్నశంకరంపేట, వెల్తురి, శివ్వంపేట న్యూస్టుడే: కాంగ్రెస్ సర్కారు రాష్ట్రాన్ని నట్టేట ముంచిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. ఆదివారం రాత్రి చిన్నశంకరంపేట, వెల్దుర్తి, శివ్వంపేట మండలాల్లో భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా నిర్వహించిన ప్రచారంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. భారాస అధికారంలో ఉన్నప్పుడే ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందాయన్నారు. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, కులం, మతం పేరుతో భాజపా ఓట్లు అడుగుతోందని ఈ రెండు పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి, ఆరు గ్యారంటీలను అమలు చేసేలా పోరాడుతామన్నారు. దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రఘునందన్రావు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేదని, ఇపుడు ప్రజలను ఓట్లు ఎలా అడుగుతారని ప్రశ్నించారు. సేద్యానికి 24 గంటలు విద్యుత్తు రావడంలేదు, ఆసరా పింఛన్లు ఇవ్వడంలేదు, ధాన్యం కొనుగోలు మందకొడిగా నిర్వహిస్తూ, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్రెడ్డి నాలుగున్నర నెలల్లో చేసింది శూన్యమని, అయితే తిట్లు, లేకపోతే ఓట్లు అన్నట్లుగా ఆయన ప్రవర్తన ఉందని విమర్శించారు. వెంకట్రామిరెడ్డి కలెక్టర్గా పని చేయడమే కాదు, సేవాతత్పరుడని గెలిపించాలని కోరారు. సీఎం రేవంత్రెడ్డి ఓటుకు నోటు కేసులో ఉన్నారని, మళ్లీ ఇప్పుడు ఓటుకు ఒట్టుతో ప్రజలను మోసం చేయడానికి చూస్తున్నారని విమర్శించారు. రైతు బంధు, రుణమాఫీ, బీమా, మహిళలకు రూ.2,500, యువతకు నిరుద్యోగభృతి ఇవ్వడంలేదన్నారు. ప్రజలకు ఏమీ చేయని భాజపా అదాని, అంబానీలకు దోచిపెడుతోందని ఆరోపించారు. మెదక్ లోక్సభ స్థానంలో బరిలో నిలిచిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరు 7వ తరగతి, మరొకరు బ్లాక్ మెయిలర్, ఇంకొకరు కలెక్టర్ వీరిలో ఎవరికీ వేస్తే సేవ చేస్తారో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. ధాన్యం బస్తాలో ఆరు కిలోలు తరుగు తీసే, కాంగ్రెస్కు ఓట్లలో తరుగుపెట్టాలన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ శివ్వంపేటలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న భూములను కలెక్టర్గా వెంకట్రామిరెడ్డి పరిష్కారానికి కృషి చేశారని, ఆయన ఓటు వేసి గెలిపించాలన్నారు. అభ్యర్థి వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ గెలిస్తే యువత కోసం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆధ్వర్యంలో మాసాయిపేట నుంచి వెల్దుర్తి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు చిన్నశంకరంపేటలో జిల్లా అధ్యక్షురాలు పద్మ, జడ్పీటీసీ సభ్యురాలు మాధ]వి, జిల్లా నాయకులు తిరుపతిరెడ్డి, ఎకే.గంగాధర్రావు, వెల్దుర్తిలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, నాయకులు అనంతరెడ్డి, రమేష్గౌడ్, మోహన్రెడ్డి, భూపాల్రెడ్డి, శివ్వంపేటలో ఎమ్మెల్యే సునీతారెడ్డి, జడ్పీటీసీ సభ్యుడు పబ్బ మహేష్ గుప్తా, ఎంపీపీ హరికృష్ణ, చంద్రాగౌడ్, జడ్పీకోఆప్షన్ సభ్యుడు మన్సూర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రజాస్వామ్య పండుగకు ఆహ్వానం
[ 13-05-2024]
స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర వైశాఖ శుద్ధ షష్ఠి సోమవారం.. తేదీ 13.05.2024న మెదక్, జహీరాబాద్, చేవెళ్ల లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహణకు పెద్దలు (ఈసీ) నిర్ణయించారు. పార్లమెంట్లో కీలక ప్రతినిధిని ఎన్నుకునే మహత్తర అవకాశం ఈ శుభదినాన మీకు కల్పించాను. -
ఏ పార్టోడో చూడకు.. ఏ పాటోడో చూడు..
[ 13-05-2024]
ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి ఓటు విలువైనదే. ప్రలోభాలకు లొంగకుండా స్వచ్ఛందంగా తీసుకునే నిర్ణయం.. సమాజ ప్రగతికి దోహదపడు తుంది. పారదర్శకంగా ముందడుగు వేసే తీరు ఆదర్శంగా నిలుస్తుంది. -
ఓటు మరువకు
[ 13-05-2024]
ఈ ఎన్నికల్లో మహిళలు, యువత కదం తొక్కాలి. ఎప్పుడు ఎన్నికలు జరిగిన మహిళలు బారులుతీరి తమ హక్కునును వినియోగించుకుంటున్నారు. ఈ సారి ఆస్ఫూర్తిని చాటాల్సి ఉంది. కొత్తగా ఓటు హక్కు పొందిన వారు, యువత స్ఫూర్తిని చాటాల్సి ఉంది. -
సిద్దిపేటలో భారాస నేత ఇంటికి తాళం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల వేళ సిద్దిపేటలోని అంబేడ్కర్నగర్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారాస యువజన నాయకుడు జువ్వన్న కనకరాజు ఇంట్లో మద్యం నిల్వ ఉందన్న సమాచారంతో తాళం వేసి ఉన్న ఇంటిని టూటౌన్ పోలీసులు ఆదివారం ఉదయం సీల్ చేశారు. -
మాక్ పోలింగ్తో షురూ
[ 13-05-2024]
ఎన్నికల రోజు పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలవుతుంది. అంతకంటే రెండు గంటల ముందే ఎన్నికల సిబ్బంది, ఏజెంట్లు ఓట్లు వేస్తారు. ఇదే మాక్ పోలింగ్. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతాయని, ఈవీఎంలలో ఎలాంటి లోటుపాట్లు లేవని ఆయా పార్టీల ప్రతినిధులకు, ఓటర్లకు తెలియజెప్పడమే ఈ ప్రక్రియ ఉద్దేశం. -
మీ ఓటే.. భవితకు బాట
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా రాజకీయ పార్టీ అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తించారు. పోలింగ్కు 48 గంటల ముందు ప్రచారం నిలిపివేయగా... కీలక ఘట్టమైన పోలింగ్కు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. -
డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు
[ 13-05-2024]
సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, పటాన్చెరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాజీ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ఓటుకు రూ.500, 1000 చొప్పున పంచుతున్నారని మెదక్ లోక్సభ భాజపా ఎంపీ అభ్యర్థి రఘునందన్రావు ఆరోపించారు. -
పలు గ్రామాల్లో వడగళ్ల వర్షం
[ 13-05-2024]
పేట మండలంలో ఆదివారం మధ్యాహ్నం పలు గ్రామాల్లో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఈదురుగాలలు వీయడంతో సుమారు 4 గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. -
పటిష్ఠ బందోబస్తు
[ 13-05-2024]
ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు పోలీసు శాఖ పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసింది. జిల్లాలోని రెండు నియోజకవర్గాలు మెదక్ పరిధిలో, మూడు నియోజకవర్గాలు జహీరాబాద్ పరిధిలో ఉన్నాయి. -
కాంగ్రెస్లో చేరికలు
[ 13-05-2024]
భారాసకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆదివారం కాంగ్రెస్లో చేరారు. అందోలు మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మహేశ్వర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గజేందర్రెడ్డితో పాటు భారాస నాయకులు సంగారెడ్డి పట్టణంలోని మంత్రి దామోదర్ రాజనర్సింహ ఇంట్లో మంత్రి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. -
చైతన్యం చాటుతాం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల కీలక ఘట్టం రానేరానే వచ్చింది. ఇప్పుడు ఓటర్లంతా చైతన్యం చాటాల్సిన అవసరముంది. నేడు లోక్సభ ఎన్నికల సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. -
ఎన్నికల క్రతువును నిర్వహించే ఉద్యోగులు
[ 13-05-2024]
శనివారం పోలింగ్ కేంద్రాలకు తరలివెళ్లారు. పోలింగ్ సామగ్రి, ఉద్యోగులు, సిబ్బందిని తరలించేందుకు జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. -
మూడు పార్టీల శ్రేణుల వాగ్వాదం
[ 13-05-2024]
దుబ్బాక ధర్మాజీపేటలో భారాస కార్యకర్త సాయికుమార్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారనే సమాచారంతో తనిఖీ బృందం పట్టుకున్నారు. రూ.11,500 లభ్యమైంది. -
విధుల్లో అప్రమత్తత అవసరం
[ 13-05-2024]
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల పోలీసు అబ్జర్వర్ రామేశ్వర్సింగ్ పట్టణంలోని అంబిటస్ స్కూల్లోని పోలింగ్ కేంద్రం, చిన్నకోడూరు మండల కేంద్రం, తొగుట, వెంకట్రావుపేట, మిరుదొడ్డి మండలం అల్వాల, అక్బర్పేట-భూంపల్లి మండలం రుద్రారంలోని పోలింగ్ కేంద్రాలను ఆదివారం సందర్శించారు.
తాజా వార్తలు (Latest News)
-
ఏనుగులకు అనారోగ్యం.. 3500కి.మీ వెళ్లి కాపాడిన ‘అంబానీ’ బృందం
-
‘ప్రజ్వల్ మా అమ్మపై అత్యాచారం చేశాడు.. బలవంతంగా నా దుస్తులు విప్పించాడు’
-
స్ట్రెచ్చర్పై వచ్చి ఓటేసిన క్యాన్సర్ బాధితురాలు
-
నిజ్జర్ కేసు దర్యాప్తులో చెప్పుకోదగ్గ అంశాలేవీ బయటపడలేదు: జైశంకర్
-
ఏపీ ఎన్నికలు: ‘హలో ఏపీ బైబై వైసీపీ’ సోషల్మీడియాలో ట్రెండ్